Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సామ్రాట్ కంటే.. తేజస్వికే ఎక్కువ ఎఫెక్ట్.. డిప్రెషన్లోకి వెళ్లాడు.. అఫైర్లు నిజమే!
Recommended Video
బిగ్బాస్ రియాలిటీ షో చివరి అంకానికి చేరుకొన్నది. మరో మూడు వారాల్లో ఈ షో ముగియనున్నది. కామన్ మ్యాన్గా ఇంట్లోకి ప్రవేశించిన గణేష్ 85 రోజుల తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన గణేష్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంగా గణేష్, మాధవీ లత మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. అదేమిటంటే..
కామన్మ్యాన్గా బిగ్బాస్లోకి
బిగ్బాస్ ఇంట్లో అడుగు పెట్టడం చాలా అదృష్టం. కామన్ మ్యాన్గా ప్రవేశించినప్పుడు వారం కంటే ఎక్కువ ఉంటాననుకోలేదు. కానీ ప్రతీ వారం గడిచిన తర్వాత నాలో విశ్వాసం పెరిగింది. నాలాంటి ఓ వ్యక్తి 85 రోజులు ఉండటమే గొప్ప అనే ఫీలింగ్ నాకు ఉంది అని గణేష్ అన్నారు.
బిగ్బాస్లో అఫైర్లు నిజమే
బిగ్బాస్ ఇంట్లో లవ్ అఫైర్లు ఉన్నమాట నిజమే. సామ్రాట్, తేజస్విని మధ్య లవ్, ఇష్టం ఉంది. సామ్రాట్ అంటే తేజస్వికి చాలా ఇష్టం. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. సామ్రాట్ను బిగ్బాస్ ఇంట్లో బాగా చూసుకొన్నది అని గణేష్ చెప్పారు.
సామ్రాట్ డీలా పడ్డాడు
తేజస్విని ఎలిమినేట్ అయిన తర్వాత సామ్రాట్ డీలా పడిపోయారు. ఒకరోజు డిప్రెషన్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఆ అంశం నుంచి తేరుకొని మామూలు అయిపోయాడు అని గణేష్ అన్నారు.
తేజస్వినే ఎక్కువగా
అయితే గణేష్ మాటలకు నటీ మాధవీ లత సమాధానం ఇస్తూ.. సామ్రాట్ కంటే తేజస్వి ఎక్కువగా డిప్రెషన్ గురైంది. సామ్రాట్కు దూరం కావడమనే విషయాన్ని తట్టుకోలేకపోయింది. ఆమె విషయం నాకు క్లియర్గా తెలుసు అని మాధవీ లత చెప్పింది.
తేజస్వి చాలా డీప్గా
సాధారణంగా ఆడవాళ్లు చాలా డీప్గా ఇష్టపడుతారు. అలాంటి వారికి దూరమైనప్పుడు మగవాళ్ల కంటే ఎక్కువగా ఆడవాళ్లే మనోవేధనకు గురవుతారు. తేజస్వి విషయంలో అదే జరిగింది అని మాధవీ లత పేర్కొన్నారు.