Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కోటి రూపాయల పరువు నష్టం దావా వేసిన బిగ్బాస్ కంటెస్టెంట్
మోడల్ గెహానా వశిష్ఠ్ మీద బిగ్ బాస్ పోటీదారు అర్షి ఖాన్ ప్రతినిధి రూ. 1 కోటి పరువునష్టం దావా వేశారు.కొన్ని రోజుల క్రితం అర్షి ఖాన్ మీద గెహానా వశిష్ఠ్ తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఈ కేసు వేశారు.
హిందీ బిగ్ బాస్ 11 కంటెస్టెంట్, నటి ఆర్షి ఖాన్ మీద కొన్ని రోజుల క్రితం మోడల్ గెహానా వశిష్ఠ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అర్షి ఖాన్ చెప్పేవన్నీ అబద్దాలే అని, తప్పుడు వివరాలతో బిగ్ బాస్ షోలో పాల్గొంది అంటూ ఆమె ఆరోపించింది.
గెహానా వశిష్ఠ్ ఆరోపణలతో ఖంగుతిన్న ఆర్షి ఖాన్ చట్టపరమైన చర్యలకు దిగింది. ఆమెపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేసింది. ఈ విషయాన్ని ఆర్షి ఖాన్ పబ్లిసిస్ట్ ఫ్లైన్న్ రెమెడివోస్ మీడియాకు వెల్లడించారు.
అందుకే కేసు వేశాం
‘గెహానా వశిష్ఠ్ వ్యాఖ్యలు తన క్లయింట్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని. ప్రస్తుతం అర్షి ఖాన్ బిగ్ బాస్ షోలో ఉంది. దేశం మొత్తం ఆమెను పరిశీలిస్తుంది. ఈ సమయంలో గెహానా వ్యాఖ్యలు నా క్లైంట్ జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ కేసు వేశాం' అని ఫ్లైన్న్ రెమెడివోస్ అన్నారు.
అర్షి ఖాన్ మీద గెహానా వశిష్ఠ్ ఆరోపణలు
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శంగారంలో పల్గొన్నాను అంటూ గతంలో అర్షి ఖాన్ ప్రకటించుకుంది. అయితే అర్షి ఖాన్ చెబుతున్నదంతా అబద్దమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గెహానా వశిష్ఠ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నట్లు ఆమె చెబుతున్నదాంట్లో నిజం లేదని, అసలు ఆవిడ అఫ్రిదిని ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే అర్షి ఖాన్ ఇవన్నీ చెప్పుకుంటోందని గెహానా వశిష్ఠ్ ఆరోపించింది.
పెళ్లి కూడా అయింది
భూపాల్లో స్కూల్ డేస్ నుంచి తనకు అర్షి ఖాన్ తనకు తెలుసని, అందుకే ఆమెకు సంబంధించిన విషయాలన్నీ తాను కశ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఆమె వయసు 32 సంవత్సరాలని, 50 ఏళ్ల వ్యక్తితో ఆమెకు ఆల్రెడీ పెళ్లయిందని గెహానా వశిష్ఠ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఆరోపించారు.
క్రిమిన్ కేసులు ఉన్నాయి
ఆర్షి ఖాన్పై 10 క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందులో భారత్, పాకిస్తాన్ జెండాలను అవమానించిన కేసులు కూడా ఉన్నాయని గెహానా వశిష్ఠ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఆరోపించారు. గెహానా వశిష్ఠ్ చేసిన ఈ ఆరోపణలు అన్నీ అర్షి ఖాన్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయంటూ ఆమె పబ్లిసిస్ట్ ఫ్లైన్న్ రెమెడివోస్ పరువు నష్టం దావా వేశారు.