Gundeninda Gudigantalu April 8th Episode: 2 లక్షల స్కాం, మనోజ్కు శిక్ష, రవిపై నీతూ మోజు, శృతి హార్ట్ బ్రేక్!
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ లో ముంబై నుంచి ముఖేష్ ఫోన్ చేసి యాడ్ ఫిల్మ్ చేయాలని చెప్పడం కథలో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. మొదట పెద్ద సెలబ్రిటీని తీసుకురావాలనుకున్న మనోజ్కు, కుటుంబ సభ్యులే యాడ్లో నటిస్తే బెటర్ అని ముఖేష్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఒక్కో జంటకు రూ.50,000 ఇస్తామని చెప్పడంతో మనోజ్ బయటకు ఓకే అన్నప్పటికీ, లోపల మాత్రం ఖర్చు గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడతాడు.రోహిణి మాత్రం ఈ ప్లాన్పై ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. కానీ మనోజ్ ఖర్చు తగ్గించడానికి కుట్ర పన్ని, అసలు మొత్తాన్ని దాచిపెట్టి తక్కువ డబ్బులు ఇవ్వాలని ప్లాన్ చేయడం ఫన్నీగా చూపించారు. ఇదే సమయంలో రోహిణి తనలో తాను అనుకునే డైలాగ్ ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇంట్లో అందరినీ యాడ్ కోసం ఒప్పించే సన్నివేశాలు కూడా వినోదాన్ని పంచాయి.
బాలు సెటైర్లు, ప్రభావతి కామెంట్లు, శృతి కాన్ఫిడెన్స్ అన్ని కలిసి మంచి కామెడీని తీసుకొచ్చాయి. అయితే మీనా-ప్రభావతి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎమోషనల్ టచ్ ఇచ్చింది. గత విషయాలను గుర్తుచేసుకుంటూ మీనా ఇచ్చిన కౌంటర్ సీన్కు బలం చేకూర్చింది. యాడ్ షూట్ సమయంలో డైరెక్టర్ ముక్కోటి ముకుంద ఎంట్రీతో మరింత హాస్యం పెరిగింది. అతని కోపం, అరిచే స్టైల్, పాత్రల కేటాయింపులో చేసిన తేడాలు అన్ని కలిసి నవ్వులు పూయించాయి. ముఖ్యంగా బాలు-డైరెక్టర్ మధ్య జరిగిన మాటల యుద్ధం ఎపిసోడ్కు హైలైట్గా నిలిచింది. "బాలు... చాలు" అనే కోడ్ వర్డ్ సీన్ మొత్తం ఎంటర్టైనింగ్గా మార్చింది. క్లైమాక్స్లో అసలు ట్విస్ట్ బయటపడింది. యాడ్ కోసం డబ్బులు ఇవ్వడం లేదని చెప్పిన మనోజ్ అబద్ధం బయటపడడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రతి ఒక్కరికీ రూ.25,000 ఇస్తున్నారని తెలిసి కుటుంబం మొత్తం మనోజ్ వైపు తిరిగింది. దీంతో వచ్చే ఎపిసోడ్పై ఆసక్తి మరింత పెరిగింది.

బుధవారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. యాడ్ షూటింగ్ కోసం ముఖేష్ రెండు లక్షల రూపాయలు ఇచ్చిన విషయం బయటపడడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని చెప్పిన మనోజ్ అబద్ధం బయటపడడంతో కుటుంబ సభ్యులందరూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాలు తనదైన స్టైల్లో రెచ్చిపోవడం ఎపిసోడ్కు హైలైట్గా నిలిచింది. మొదట మనోజ్ తప్పించుకోవడానికి ప్రయత్నించినా, బాలు-రవి ప్రశ్నల దాడికి తట్టుకోలేక చివరికి నిజం చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో రవి కోపంతో టేబుల్ ఎత్తడం ఇంట్లో ఉద్రిక్తతను మరింత పెంచింది. వెంటనే సత్యం కలుగజేసుకుని, ప్రశాంతంగా విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. "ఈ యాడ్ ఐడియా ఎవరిది?", "డబ్బులు వచ్చాయా?" వంటి ప్రశ్నలకు మనోజ్ సమాధానాలు చెప్పాల్సి వచ్చింది. చివరికి షూటింగ్ తర్వాత ఇవ్వాలని అనుకున్నానంటూ కవరింగ్ ఇచ్చినా, ఎవరూ నమ్మలేదు.
ఇక కోపం అదుపు తప్పిన బాలు, రవి కలిసి మనోజ్పై చేయి చేసుకోవడం సన్నివేశానికి హై వోల్టేజ్ డ్రామాను తీసుకొచ్చింది. సత్యం కూడా అసహనం వ్యక్తం చేస్తూ మనోజ్ను మందలించాడు. ఆ తర్వాత రోహిణిని పిలిచి ఈ విషయం తెలుసా అని అడగగా, ఆమె కూడా నిజం చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మీనా, శృతి ఇద్దరూ తీవ్రంగా స్పందిస్తూ "మనల్ని మోసం చేశారు" అంటూ ఫైర్ అయ్యారు. శృతి అయితే చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేయడం సన్నివేశాన్ని మరింత వేడెక్కించింది. ఈ గొడవ మధ్య సత్యం జోక్యం చేసుకుని వెంటనే అందరికీ వారి డబ్బులు ఇవ్వాలని మనోజ్కు ఆదేశించాడు. తప్పించుకునే మార్గం లేక మనోజ్ ఒక్కొక్కరికి రూ.25,000 చెల్లించాడు. అయితే ప్రభావతికి మాత్రం రూ.15,000 ఇస్తానని చెప్పడంతో మరోసారి వివాదం చెలరేగింది. చివరకు "ఇప్పటికే రూ.10,000 ఇచ్చాను" అని చెప్పడంతో ప్రభావతి షాక్కు గురైంది. తాను మోసపోయానని గ్రహించిన ప్రభావతి కోపంతో మనోజ్పై విరుచుకుపడింది. చివరికి రోహిణి కూడా మనోజ్ను తీవ్రంగా మందలిస్తూ, "ఇది నీ ఆశపడి చేసిన తప్పు" అని తిడుతూ కొడుతుంది.
ఇక సీరియల్లో మరోవైపు కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది. రవి ట్రాక్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. నీతూ ఆకస్మికంగా రవికి ఫోన్ చేసి, "రెస్టారెంట్ బాధ్యత తీసుకోకుండా ఇలా ఎలా ఉంటావ్?" అంటూ తీవ్రంగా మందలించడం కథకు కొత్త మలుపు తీసుకొచ్చింది. అసలు విషయం తెలియక రవి కన్ఫ్యూజ్ అయినా, నీతూ మాత్రం ఏమీ వినకుండా వెంటనే చెప్పిన చోటికి రావాలని ఆదేశించడం సస్పెన్స్ క్రియేట్ చేసింది. దీంతో రవి శృతికి చెప్పకుండా తన బాస్ను కలవడానికి వెళ్లడం కీలకంగా మారింది. అక్కడికి వెళ్లాక అసలు విషయం బయటపడుతుంది. అమెరికా నుంచి తనకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేయాలంటే, రవిని తన బాయ్ఫ్రెండ్గా నటించమని నీతూ కోరుతుంది. అయితే ఈ ఆఫర్ను రవి మొదట గట్టిగా తిరస్కరిస్తాడు. 'ఈ విషయం శృతి తెలుసుకుంటే హర్ట్ అవుతుంది... నేను ఇలా చేయలేను" అంటూ తన నిజాయితీని చూపిస్తాడు. అవసరమైతే తన తండ్రితో మాట్లాడతానని చెప్పడం రవికి ఉన్న విలువలను తెలియజేస్తుంది.
కానీ నీతూ మాత్రం వెనక్కి తగ్గదు. తన తండ్రి తిక్క మనిషి అని చెప్పి, రవి బాయ్ఫ్రెండ్గా నటించకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానని ఇన్డైరెక్ట్గా బెదిరించడం పరిస్థితిని క్లిష్టంగా మారుస్తుంది. చివరికి జాబ్ కోల్పోతాననే భయంతో రవి బలవంతంగా ఒప్పుకోవడం సన్నివేశానికి ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఇక మరుసటి రోజు రవి పూర్తిగా మారిపోయినట్టుగా టిప్టాప్గా రెడీ అవ్వడం ఆసక్తికరంగా చూపించారు. నీతూ ఫోన్ చేసి లుక్ గురించి అడగడం, బ్లేజర్ వేసుకోమని చెప్పడం అన్ని కలిసి సన్నివేశాన్ని మరింత రియలిస్టిక్గా తీర్చిదిద్దాయి. అయితే రవి ఇలా రెడీ కావడం చూసిన శృతి అనుమానం వ్యక్తం చేయడం కథలో మరో టెన్షన్ ఎలిమెంట్ను తీసుకొచ్చింది. రవి మాత్రం అసలు విషయం దాచిపెట్టి "బాస్ మీటింగ్ ఉంది" అంటూ తప్పించుకోవడం గమనార్హం.
శృతి ప్రశ్నలు పెరగడంతో ఎక్కడ దొరికిపోతానోనని ఆత్రుతగా వెళ్లిపోతున్న రవి, బ్లేజర్ మర్చిపోవడం కీలక మలుపుగా మారింది. అదే బ్లేజర్ను తీసుకుని శృతి అతన్ని ఫాలో అవుతుంది. నీతూ ఫోన్ చేసి హోటల్కు పిలవడంతో అక్కడికి వెళ్లిన రవిని, వచ్చిన వ్యక్తికి తన బాయ్ఫ్రెండ్గా పరిచయం చేస్తుంది. ఈ పరిస్థితిలో రవి కూడా 'మేమిద్దరం రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాం'అంటూ డ్రామాను కొనసాగిస్తాడు. దీంతో ఆ వ్యక్తి వారిద్దరి ప్రేమను నమ్మి, పెళ్లి ప్రపోజల్ను వదిలేసి వెళ్లిపోవడం కీలక ఘట్టంగా మారింది. పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న ఆనందంలో నీతూ రవిని హగ్ చేయడం అయితే కథలో పెద్ద ట్విస్ట్కు దారి తీసింది.
అదే సమయంలో అక్కడికి వచ్చిన శృతి ఈ సీన్ మొత్తం చూసి షాక్ అవుతుంది. రవి ఎంత చెప్పినా "ఇది డ్రామా మాత్రమే" అని నమ్మక, ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. నిజం చెప్పమని రవి నీతూను కోరగా, ఆమె మాత్రం పరిస్థితిని సీరియస్గా కాకుండా సరదాగా తీసుకుంటూ "మనిద్దరం నిజంగానే ప్రేమలో ఉన్నాం" అంటూ శృతికి షాక్ ఇస్తుంది. దీంతో రవి జీవితంలో పెద్ద కలకలం రేగుతుంది. శృతి కోపంతో వెళ్లిపోవడం, రవి కన్ఫ్యూజ్ అవడం అన్ని కలిసి కథలో టెన్షన్ను పెంచాయి. అంతేకాదు, తర్వాత నీతూ 'శృతి వెళ్లిపోతే ఏంటి... మనిద్దరం పెళ్లి చేసుకుందాం' అని చెప్పడం మరో షాకింగ్ ట్విస్ట్గా నిలిచింది.
ఇక మరోవైపు బాలు-మీనాల ట్రాక్ ఎమోషనల్గా సాగింది. బాలు అప్పు తీర్చడానికి వెళ్లగా, అప్పటికే మీనా ఆ అప్పును క్లియర్ చేయడం అతనికి షాక్ ఇచ్చింది. "నీ అప్పు నా అప్పు కాదా?" అంటూ మీనా చెప్పిన డైలాగ్ వారి బంధాన్ని మరింత బలంగా చూపించింది. ఇదే సమయంలో సత్యం కూడా వాళ్లిద్దరికీ తెలియకుండా అప్పు తీర్చడానికి రావడం కుటుంబ బంధాల లోతును చూపించింది. ఇంట్లో మరో ట్రాక్లో ప్రభావతి-మీనాల మధ్య మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. రాధిక తల్లి ఖరీదైన చీరలతో రావడం, ఒక్కో చీర రూ.40,000-50,000 అని చెప్పడంతో ప్రభావతి ఆశ్చర్యపోయింది. ఈ క్రమంలో రోహిణి చేసిన రెండు లక్షల దొంగతనం విషయం బయటపడుతుందా? లేక మళ్లీ మీనాపైనే నిందలు పడతాయా? అన్నది ఇప్పుడు కథలో ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











