Gundeninda Gudigantalu May 21 Episode: రోహిణి కన్నింగ్ ప్లాన్, చింతామణికి మీనా షాక్, చేజారిన మోసగాళ్లు
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ పూర్తిగా రోహిణి చుట్టూ తిరుగుతూ, ఆమె భండారం ఒక్కొక్కటిగా బయటపడేలా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రభావతి, మనోజ్-రోహిణిలను డబ్బు గురించి నిలదీస్తూ, "డబ్బు తెచ్చేవరకు ఇంట్లో గౌరవం లేదు" అని గట్టిగా చెప్పడం టెన్షన్ పెంచింది. ఇదే సమయంలో బాలు, మీనా ఎంట్రీ ఇచ్చి, వాళ్లను మరింత ఇరికించేలా మాట్లాడారు. ముఖ్యంగా రోహిణి తన తండ్రి గొప్పలు చెప్పడంతో మీనా ఘాటుగా కౌంటర్ ఇవ్వడం హైలైట్గా నిలిచింది. పరిస్థితి మరింత దిగజారుతూ, చివరకు మనోజ్-రోహిణి తినడానికి కూడా నోచుకోని స్థితి వచ్చింది. అందరూ బయట నుంచి భోజనం తెచ్చుకోవడంతో, రోహిణి కిచెన్లోకి దిగాల్సి వచ్చింది.
అయితే దోసెలు కూడా సరిగా వేయలేకపోవడం, చేసిన చట్నీ కారంగా ఉండటంతో మనోజ్, ప్రభావతి కళ్లలో నీళ్లు రావడం సన్నివేశానికి కొంచెం కామెడీ టచ్ ఇచ్చింది. ఇక అసలు ట్విస్ట్ కిచెన్ సీన్లో వచ్చింది. మీనా, రోహిణిని గుణ దగ్గర అప్పు గురించి నిలదీయడం ఆమెను కంగారు పెట్టింది. గుణ ఓ రౌడీ అని, శివ ద్వారా ఈ విషయం తెలిసిందని చెప్పడంతో రోహిణి టెన్షన్ పడింది. అదే సమయంలో బాలు, రవి కూడా మనోజ్కు ఈ విషయం చెబుతారు. మొదట నమ్మని మనోజ్, తర్వాత అనుమానంతో భార్యను నేరుగా ప్రశ్నించడం ఎపిసోడ్ను హై వోల్టేజ్లో ముగించింది.



Click it and Unblock the Notifications