Gunde Ninda Gudi Gantalu: మీనా ప్రశ్నల వర్షం.. అడ్డంగా దొరికిపోయిన రోహిణి..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో పండుగ పూట ఇలాగైనా రోహిణి చేత వంట చేయించాలని ఫిక్స్ అవుతుంది సుశీలమ్మ. తనకు వంట చేయడం రాదని రోహిణీ చెప్పినా.. తాను నేర్పిస్తానంటూ వంట చేయిస్తుంది సుశీల. ఇలానే ఉంటే వంట మొత్తం తన తోనే చేయిస్తారని.. తనకు తల తిరుగుతుంది అంటూ యాక్టింగ్ చేస్తుంది రోహిణి. దీంతో ప్రభావతి తీసుకువెళ్లి హాల్లో పడుకోబెట్టి తలపై చల్లని గుడ్డ వేస్తుంది. ఇంతలోనే రోహిణి తల్లి సుగుణ ఇంటికి వస్తుంది. తన కూతురికి ఏదో ప్రమాదం జరిగిందని కంగారు పడుతుంది.
ఈ క్రమంలో గట్టిగా అరవడంతో ఇంట్లో వారు అందరూ వచ్చి ఏమైందని ప్రశ్నిస్తారు. అయినా రోహిణి చూసి ఎందుకలా అరిచారు? అని సుగుణపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ప్రభావతి. తలపై గుడ్డ చూసి తాను భయపడ్డానని అంటుంది సుగుణ. సర్లే అని అందరు చదివి చెప్పి వెళ్తారు. ఇంతలోనే రవి ఇంటికి చేరుతాడు. రాగానే బాలు ఎదురుపడుతాడు. దీంతో రవి కాలర్ పట్టుకుని ఎందుకొచ్చావు? అని నిలదీస్తాడు తనకు నానమ్మ ఫోన్ చేసిందని, అందుకే తన వచ్చానని చెప్తాడు. తనకు అసలు విషయం తెలియక.. నిన్ను రమ్మని ఫోన్ చేసి ఉంటుందని అవసరంగా పండుగ పూట గొడవ చేయకుండా వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తాడు.

మరోవైపు రోహిణి తల్లి తోపాటు కొడుకు ను తన రూంకి తీసుకువెళ్తుంది మీనా. మీనా లేని సమయంలో రోహిణి తన తల్లి దగ్గరికి వెళ్లి.. ఎందుకొచ్చావని ప్రశ్నిస్తుంది. తనకు ఎవరో ఫోన్ చేసి నీకు ప్రమాదం జరిగిందనీ, చెప్పడంతో తాను ఇలా వచ్చానని చెబుతుంది. ఇంకోసారి ఇంటికి రావద్దని వార్నింగ్ ఇస్తోంది. మీనా రావడంతో టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతుంది.
సోమవారం ఎపిసోడ్లో.. రోహిణి ప్రవర్తన చూసిన మీనాకు అనుమానం వస్తుంది. రోహిణి రూమ్ లో నుండి వెళ్ళగానే.. మీకు ముందే రోహిణి తెలుసు కదా అని సుగుణను అడుగుతుంది మీనా. దీంతో కంగారుపడిన సుగుణ.. అదేం లేదు.. అంటూ అబద్దం చెప్పి తప్పించుకుంది.
ఇక దీపావళి పండుగ రోజు.. ఇంట్లో వారందరూ సంతోషంగా పటాసులు కాలుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ దీపావళి సంబరాలు జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తారు. తన కుటుంబాన్ని దూరంగా ఉండి రవి చూస్తూ ఉండిపోతాడు.
మరోవైపు రోహిణి కొడుకు చింటూ కూడా దీపావళి సంబరాలు వారితో కలిసి పోతాడు. కానీ, చింటూని చూసి మనోజ్ చిరాకు పడతాడు. వాడు ఎవడికి పుట్టాడో.. కానీ దర్జాగా మన ఇంట్లో మనమడిలా టపాసులు కాలుస్తున్నాడు చూడు అంటూ రోహిణి చూపిస్తాడు. ఈ సమయంలో అనుకోకుండా చింటూ పై నిప్పురవ్వలు పడతాయి. దీంతో రోహిణి కంగారుపడి పరిగెత్తి చింటూని దగ్గరకు తీసుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యులందరికీ రోహిణి పై అనుమానం వస్తుంది. బాలు అయితే ఏకంగా రోహిణి దగ్గరకు వచ్చి.. చిన్నోడు పెళ్లి చిన్న నిప్పురవ్వ పడితే ఇంత కంగారు పడాలా పార్లర్ అమ్మ అని ప్రశ్నిస్తాడు.


Click it and Unblock the Notifications











