Gunde Ninda Gudi Gantalu Weekly: రోహిణి రహస్యం బట్టబయలు, మలేషియా ప్లాన్తో బాలు మాస్టర్ స్ట్రోక్!
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 25వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకూ 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఆసక్తిగా ఆకట్టుకుంది. రాజమండ్రి నేపథ్యంలో కథ సాగుతూ, బాలు కారులో ప్రయాణిస్తుండగా మలేషియా నుండి వచ్చిన దంపతులను తీసుకెళ్తాడు. 25 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన వారు దేశ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతారు. తమ పెళ్లిరోజును భారతదేశంలో జరుపుకోవాలని వచ్చామని చెప్పడం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. బాలు వారికి గైడ్లా మారి గుడికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తాడు. మీనా కూడా పూజ ఏర్పాట్లు చేసి వారిని ఆత్మీయంగా స్వాగతిస్తుంది. ఇక మరోవైపు గుణ గుడికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఆలయ అధికారులు కోర్ట్ ఆర్డర్ లేకుండా ఇవ్వలేమని చెప్పడంతో అతని ప్లాన్ విఫలమవుతుంది.

Photo courtesy: Jio Hotstar
ఇదే విషయం మీనాకు తెలిసి అనుమానాలు పెరుగుతాయి. శివ కూడా గుణపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఈ సంఘటనల వెనుక రోహిణి ఉందనే అనుమానం మరింత బలపడుతుంది. ఇక ఫ్యామిలీ ట్రాక్లో బాలు, మీనా మలేషియా దంపతులను ఇంటికి ఆహ్వానించడం ద్వారా భావోద్వేగం పెరుగుతుంది. మరోవైపు ప్రభావతి పరిస్థితి, మనోజ్ సమస్యలపై చర్చలు కుటుంబంలో ఉద్రిక్తతను పెంచుతాయి. రోహిణి తన ప్లాన్ను ముందుకు తీసుకెళ్లేందుకు మనోజ్ను పోలీస్ స్టేషన్కు పంపించడం కథలో టెన్షన్ను మరింత పెంచింది. చివర్లో ప్రభావతి ఎంట్రీతో ఎపిసోడ్ క్లైమాక్స్ టెన్షన్గా ముగిసింది.
మంగళవారం ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్తో పాటు హై టెన్షన్ డ్రామాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎపిసోడ్ ప్రారంభంలో మీనా మలేషియా అతిథుల కోసం స్పెషల్ వంటలు చేస్తుండగా ప్రభావతి ఎంట్రీ ఇచ్చి వెటకారంగా ప్రశ్నించడం వంటగదిలో ఉద్రిక్తతను పెంచింది. శృతి కూడా కౌంటర్లు ఇస్తూ మాటల యుద్ధాన్ని మరింత పెంచగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మీనా జోక్యం చేసుకుంది. ప్రభావతి మాత్రం తన వైఖరిని మార్చకుండా అతిథుల విషయం మీద అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ సమయంలో సత్యం వచ్చి ఆతిథ్యం మన సంప్రదాయం అని చెప్పి పరిస్థితిని కూల్ చేస్తాడు. మరోవైపు రోహిణి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ మీనాను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది.
అయితే మీనా తన కష్టార్జితంతో ఇతరులకు భోజనం పెట్టడం ఆనందమని ఘాటుగా సమాధానం ఇవ్వడం హైలైట్గా నిలిచింది.బాలు మలేషియా దంపతులను ఇంటికి తీసుకురాగానే ప్రభావతి మొదట అసహనం చూపించినా, వారి గురించి తెలుసుకున్న తర్వాత టోన్ మార్చి నటించడం ఆసక్తికరంగా మారింది.రోహిణి నిజం బయటపడుతుందనే భయంతో పంటి నొప్పి డ్రామా చేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ శృతి ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లడంతో చివరికి నిజంగానే పన్ను పీకించుకోవాల్సిన పరిస్థితి రావడం ఎపిసోడ్లో ప్రధాన ట్విస్ట్గా నిలిచింది. చివర్లో మలేషియా దంపతులు మీనా ఆతిథ్యాన్ని ప్రశంసించి, ఆమెను ఆదర్శ కోడలిగా కొనియాడటం భావోద్వేగాన్ని కలిగించింది. ప్రభావతి బయటకు నవ్వినా లోపల అసంతృప్తిగా ఉండటం మరో కోణాన్ని చూపించింది. మొత్తం ఎపిసోడ్ డ్రామా, కామెడీ, ట్విస్టులతో ఆకట్టుకుంది.
బుధవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, అనుమానాలు, కుటుంబ ఘర్షణలతో ఎంతో ఆసక్తికరంగా సాగింది. మలేషియా దంపతులు మీనా చేసిన వంటలను ప్రశంసిస్తూ ఆమెను ఆదర్శ కోడలిగా పొగడటం ఇంట్లో ప్రత్యేక వాతావరణాన్ని తీసుకొచ్చింది. అయితే వారు వెళ్లిన వెంటనే రోహిణి కనిపించకపోవడంతో ఇంట్లో టెన్షన్ మొదలైంది. శృతి ఆమెను తీసుకురాగా, పంటి నొప్పితో ట్రీట్మెంట్ చేయించుకున్నానని రోహిణి చెప్పడం అందరినీ షాక్కు గురిచేసింది. కానీ మలేషియా పేరు వినగానే ఆమె భయపడటం బాలు, మీనాల్లో అనుమానాలను పెంచింది. "ఏదో దాచిపెడుతోంది" అంటూ బాలు ఆమె గతాన్ని బయటపెడతానని ఛాలెంజ్ చేయడం కథలో సస్పెన్స్ను పెంచింది.
ఇక రోహిణి ఫోన్కు వచ్చిన కాల్ మరో భారీ ట్విస్ట్ ఇచ్చింది. "నేను రోహిణి భర్తను" అంటూ రెంట్ గురించి మాట్లాడిన వ్యక్తి మాటలు విన్న మనోజ్ షాక్కు గురయ్యాడు. దీంతో రోహిణిపై అతని అనుమానం మరింత బలపడింది. మరోవైపు బాలు స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఇంటికి రావడంతో మీనా తీవ్రంగా ఆగ్రహించింది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణగా మారి, బాలు కోపంతో టెర్రస్కు వెళ్లిపోయాడు. అటు రవి-శృతి మధ్య కూడా అపార్థాలు పెరిగాయి. రవి మీటింగ్లో ఉండగా కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో శృతి బాధపడగా, నీతూ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. చివరగా డైనింగ్ టేబుల్ దగ్గర మీనా, శృతి, రోహిణి ఒక్కొక్కరిగా కోపంతో వెళ్లిపోవడం ఇంట్లో విభేదాలు ఎంత తీవ్రంగా మారాయో చూపించింది.
గురువారం ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ ఘర్షణలు, కామెడీ, సస్పెన్స్తో ఎంతో ఆసక్తికరంగా సాగింది. మీనా కేవలం సత్యంకు మాత్రమే భోజనం వడ్డించి వెళ్లిపోవడంతో ఇంట్లో టెన్షన్ మొదలైంది. ప్రభావతి ప్రశ్నించగా, "నేను చాలా కోపంగా ఉన్నాను.. మీరే వడ్డించుకుని తినండి" అంటూ మీనా గట్టిగా సమాధానం ఇచ్చింది. దీంతో సత్యం తన కొడుకులను ప్రశ్నించగా, రవి "వాళ్లే మాతో గొడవ పడుతున్నారు" అంటూ బాధపడతాడు. ఇదే సమయంలో బాలు నోట మద్యం వాసన రావడంతో అసలు గొడవకు కారణం బయటపడుతుంది. సత్యం తీవ్రంగా మందలించడంతో ముగ్గురు అన్నదమ్ములు టెర్రస్పైకి వెళ్లిపోతారు. టెర్రస్పై బాలు మద్యం మత్తులో పాటలు పాడుతూ "భార్యా బాధితుల సంఘం" పెట్టాలని కామెడీగా మాట్లాడటం నవ్వులు పూయించింది.
అయితే సత్యం మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు సహజమని, చిన్న విషయాలను పెద్దవి చేయొద్దని ముగ్గురికీ క్లాస్ పెట్టాడు. మరోవైపు శృతి గదిలో మీనా, రోహిణి, శృతి కలిసి తమ సమస్యలు చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతారు. ప్రభావతి కూడా అక్కడికి రావడంతో వాతావరణం కాస్త కూల్ అవుతుంది. మరుసటి రోజు మీనా ట్రాక్ హైలైట్గా నిలిచింది. సీరియల్ నటుడు కిరణ్ ఇంట్లో చేసిన సంప్రదాయ డెకరేషన్ అందరినీ ఆకట్టుకుంది. చింతామణి పంపిన గుండాలను మీనా ధైర్యంగా ఎదుర్కొని తరిమికొట్టింది. కిరణ్ ఆమె పనిని మెచ్చుకుని అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పడం విశేషం. ఇదే సమయంలో రోహిణి-మనోజ్ గుడికి వెళ్లగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ కోసం రావడం కథలో కొత్త సస్పెన్స్కు దారితీసింది.
శుక్రవారం ప్రసారమైన 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రోహిణి దాచిపెడుతున్న రహస్యం చుట్టూ కథ తిరగడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఎపిసోడ్ ప్రారంభంలో మీనా చెల్లి సుమతి ఫోన్ చేసి, గుడిలోని సీసీటీవీ ఫుటేజ్ గురించి రోహిణి, మనోజ్ విచారణ చేస్తున్నారని చెబుతుంది. దీంతో మీనాకు రోహిణిపై ఉన్న అనుమానాలు మరింత బలపడతాయి. అదే సమయంలో బాలు కూడా రోహిణి వ్యవహారంపై దృష్టి పెడతాడు. మనోజ్ను పరీక్షించేందుకు మలేషియాలో ఉన్న రవీంద్ర సహాయంతో రోహిణి తండ్రి కేసు వివరాలు తెలుసుకుందామని చెబుతాడు. ఈ విషయం విన్న రోహిణి తీవ్ర ఆందోళనకు గురవుతుంది. బాలు వరుస ప్రశ్నలు అడుగుతుండటంతో ఆమె మరింత ఇబ్బందిపడుతుంది.
రోహిణి గతాన్ని తెలుసుకోవాలని నిర్ణయించిన బాలు, మీనా తమదైన దర్యాప్తు మొదలుపెడతారు. బాలు మీనాక్షిని కలవగా, రోహిణి కుటుంబం గురించి తనకూ పెద్దగా తెలియదని ఆమె చెప్పడంతో అతడు షాక్ అవుతాడు. మరోవైపు మీనా, రోహిణి స్నేహితురాలు విద్యను కలుస్తుంది. విద్య చేసిన వ్యాఖ్యలు రోహిణి జీవితంలో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయని సూచిస్తాయి. అయితే ఆమె కూడా పూర్తిస్థాయిలో నిజం చెప్పకుండా తప్పించుకోవడం అనుమానాలకు తావిస్తుంది. ఇక మీనా తన గురించి ఆరా తీస్తోందని తెలుసుకున్న రోహిణి భయంతో వణికిపోతుంది. ఇదే సమయంలో మనోజ్, మలేషియాలో ఉన్న మామయ్య సహాయం కావాలని ఒత్తిడి చేయడంతో ఆమె మరింత టెన్షన్లో పడుతుంది. మరోవైపు చింతామణి, మీనా వ్యాపారాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినా, మీనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఎపిసోడ్ చివర్లో బాలు ఇంటికి పాస్పోర్ట్ అప్లికేషన్ ఫార్మ్స్ తీసుకొచ్చి, తాను మీనాతో కలిసి మలేషియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నానని ప్రకటిస్తాడు.


Click it and Unblock the Notifications







