Gundeninda Gudigantalu June 27th: పెళ్లైన వెంటనే పీఏ ఫోన్.. అతడితో గదిలో రోహిణి ఏం చేసింది?
ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే
పెళ్లి జరుగుతున్న సమయంలోనే బాలు వచ్చి తన భార్యను ఎందుకు అవమానించారని తల్లితో గొడవ పడతాడు. దీంతో మనోజ్ వచ్చి అతడి కాలర్ పట్టుకోవడంతో తాళిబొట్టును లాక్కుంటాడు. అప్పుడు ఎవరు బ్రతిమాలినా ఇవ్వనని తేల్చేస్తాడు. అప్పుడు బాలు తండ్రి ప్రశ్నించగా జరిగిన విషయం మొత్తం చెప్తారు. దీంతో ఆయన భార్యపై ఫైర్ అవుతాడు. తర్వాత మీనా వచ్చి బాలును బ్రతిమాలడంతో తాళిబొట్టును ఇచ్చేస్తాడు. దీంతో మనోజ్, రోహిణి పెళ్లి జరుగుతుంది. తర్వాత పంతులు వాళ్లకు పూజ చేయడంతో పాటు బాలు, మీనాతో పూల దండలు మార్పిస్తాడు.



Click it and Unblock the Notifications











