Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
Guppedantha Manasu Weekly Roundup: కొడుకు కోసం జగతి కలవరింత.. తల్లికి రిషి సేవలు
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..
నవంబర్ 21వ ఎపిసోడ్ లో..
ఒక స్టూడెంట్ తో మీరు గదిలో ఉన్నారు. మేము వచ్చేసరికి గడియ పెట్టారని సింపుల్ గా చెప్పేశారు. అందరూ అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు.. అని తప్పుగా మాట్లాడతారు. ఆ మటాలకి కోప్పడిన రిషి అరుస్తాడు. అసలు మీరిద్దరు గదిలోకి ఎందుకు వచ్చారని మళ్లీ అడుగుతాడు. దీంతో తన డ్రెస్ పై జ్యూస్ పడిందని క్లీన్ చేసుకుని వచ్చేసరికి గడియ పెట్టి ఉందని.. దీంతో రిషి సార్ కి కాల్ చేస్తే వచ్చారు. మళ్లీ బయటకు వచ్చే సమయానికి ఎవరో గడియ పెట్టారని వసుధార చెబుతుంది.
ఇలా చెబితే భలే స్టోరీ అల్లారు.. కాలేజీ గదిలో దొరికిన స్టూడెంట్.. ఇంకా అని మీడియా వ్యక్తి మాట్లాడుతుంటే అటు నుంచి మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. వసుధార వాళ్లు వచ్చిన గదిలోపల ఉండి అడుగుతాడు. మహేంద్రను చూసిన రిషి చాలా ఎమోషనల్ అవుతాడు. రిషి నాకోసం వచ్చాడు.. నేనే రిషిని రమ్మన్నాను.. గదిలో ఇద్దరం ఉన్నాం.. ఆలోచనలు మారిపోతాయా.. గదిలో ముగ్గురుం ఉన్నాం.. ఏం కావాలి నీకు అని గట్టిగా అరుస్తాడు మహేంద్ర.
నవంబర్ 22వ ఎపిసోడ్ లో..
డాడ్ ఏం జరిగిందని, మీరు ఎందుకు వెళ్లారని నేను అడగను.. మిమ్మల్ని దూరం చేసుకుని మీరు లేని రిషి ఎలా ఉంటాడే ఆ బాధ ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు. మీరెప్పుడూ నాతోనే ఉండాలి అని రిషి అంటాడు. కాలం, పరిస్థితులు.. ఈ రెండు మనుషుల కన్నా, బంధాల కన్నా బలమైనవి. అవి ఆడిస్తాయి.. అవే శాసిస్తాయి.. ఇప్పుడు జరిగింది కూడా అదే. కొన్ని ప్రమేయం లేకుండా జరుగుతాయి. వాటికి మనం బాధ్యులం కాదు.. బాధితులం మాత్రమే అవుతామని మహేంద్ర సమాధానం ఇస్తాడు.
డాడ్ మీరు ఎన్ని చెప్పినా సరే.. జరిగిందేదో జరిగింది.. నాపై కోపం వచ్చిందో.. నేనేదైనా తెలియక తప్పు చేశానో.. పెద్దమ్మ ముందు మిమ్మల్ని హర్ట్ చేశానో.. ఏదేమైనా ఈ రిషి మిమ్మల్ని వదిలి ఉండలేడు డాడ్ అని రిషి అంటాడు. ఎందుకు వెళ్లామో అది ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయిందని మహేంద్ర అంటాడు. మీరు రావాలని ఆశపడుతున్నాను, అయినా నాకు శిక్ష విధిస్తారా అని రిషి అంటే.. శిక్ష వేశానని నువ్ అనుకుంటున్నావ్.. నాకు నేనే శిక్ష విధించుకున్నానని నేను భావిస్తున్నాను అని మహేంద్ర అంటాడు.
నవంబర్ 23వ ఎపిసోడ్ లో..
మహేంద్రను ఇంటికి రమ్మని అడుగుతాడు రిషి. మిమ్మల్ని చూడగానే ఎగిరి గంతులు వేయాలనిపించింది. కానీ అప్పుడున్న పరిస్థితి వేరు, టెన్షన్ వేరు అని ఎమోషనల్ అవుతాడు రిషి. ఇంత మాట్లాడుతున్నా.. ఇంకా ఆలోచిస్తున్నారా.. నా కళ్లలోకి చూసి చెప్పండి మీరు ఇంటికి వస్తున్నారా లేదా అని అడుగుతాడు రిషి. దీంతో నేను.. అది అని ఏం మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంటాడు మహేంద్ర.
సరే డాడ్.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రిషిని మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో ఈరోజు రాత్రంతా ఆలోచించుకోండి. మీ మనసు ఏం చెబితే అది చేయండి. మీ మనసులో రిషి ఉన్నాడు అది గుర్తుపెట్టుకోండి. ఆ సూర్యుడి కన్నా ముందే మీరు దర్శనమివ్వాలి. ఇద్దరం కలిసి మనింట్లో టిఫిన్ చేద్దాం, ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం, కబుర్లు చెప్పుకుందాం.. మీరు వస్తున్నారని అనుకుంటున్నాను అనే చెప్పేసి అక్కడి నుంచి వెళుతూ పరిగెత్తుకుని వెనక్కి వచ్చి మహేంద్రను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు రిషి.
నవంబర్ 24వ ఎపిసోడ్ లో..
ఇంట్లో మహేంద్ర-జగతి కోసం ఎదురు చూస్తుంటారు రిషి, వసుధార. ఇంతలో గౌతమ్ కి కాల్ రావడంతో బయటకు వెళ్తున్నా అని చెబుతాడు. రిషి ఎక్కడికని అడగడంతో ఎవరికో యాక్సిడెంట్ అయిందట.. నా నంబర్ వాళ్ల దగ్గర ఉందని కాల్ చేశారు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తోంది అంటాడు గౌతమ్. సరే నువ్వెళ్లు డాడ్ వాళ్లు వస్తున్నారు కదా అని రిషి అంటాడు.
అలాగే అరేయ్ గౌతమ్ డాడ్ వాళ్లు వస్తారు కదా.. అని సందేహంగా రిషి అడిగితే.. నువ్ టెన్షన్ పడకు.. అంకుల్ వాళ్లు తప్పకుండా వస్తారని ధైర్యం చెప్పి వెళతాడు గౌతమ్. హాస్పిటల్ కి వెళ్లిన గౌతమ్.. యాక్సిడెంట్ అయింది మహేంద్ర-జగతి అని తెలియడంతో షాక్ అవుతాడు. రిషికి ఎలా చెప్పాలి అనుకున్నా.. చెప్పకతప్పదని కాల్ చేస్తాడు. ఆ ఫోన్ దేవయాని చూసి మహేంద్ర వాళ్లు వచ్చారో లేదో తెలుసుకునేందుకేమో అని కట్ చేస్తుంది. అదేంటి కట్ అయిందని గౌతమ్ మళ్లీ కాల్ చేస్తే మళ్లీ కట్ చేస్తుంది దేవయాని.
నవంబర్ 25వ ఎపిసోడ్ లో..
హాస్పిటల్ బెడ్ పై మహేంద్రను చూసిన రిషి, వసుధార ఒక్కసారిగా షాక్ అవుతారు. రిషి పరిగెత్తుకుంటూ వెళ్లి.. డాడ్ మీకు ఏమైంది డాడ్ అని అనడంతో మహేంద్ర జరిగింది చెబుతాడు. మహేంద్ర రిషితో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా.. జగతి మేడమ్ ఎక్కడున్నారని అడుగుతుంది వసుధార. గౌతమ్ జగతిని చూపించగా వసుధార, రిషి షాక్ అవుతారు. ఇంతలో ఆమెకు బ్లడ్ కావాలని చెప్పాం కదా అని డాక్టర్ అంటాడు.
చాలా రేర్ గ్రూప్ అర్జెంటుగా కావాలని అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు నాది కూడా ఓ నెగెటివ్.. నేను ఇస్తాను రిషి అంటాడు. జగతి కోసం రిషి బ్లడ్ ఇస్తానని చెప్పడంతో వసుధార, మహేంద్ర ఆనందపడతారు. జగతికి రిషి రక్తం ఇస్తుంటాడు. జగతివైపు ఎమోషనల్ గా బాధగా చూస్తూ ఉంటాడు రిషి. అమ్మా అని పిలవను అన్న రిషి మాటలు తలుచుకుంటుంది వసుధార. వసుధార కన్నీళ్లు చూసిన రిషి.. మేడమ్ కి ఏం కాదు.. నేనున్నా కదా అని ధైర్యం చెబుతాడు. మరోవైపు గౌతమ్, మహేంద్ర ఇద్దరూ బాధపడుతూ ఉంటారు.
నవంబర్ 26వ ఎపిసోడ్ లో..
నీ దగ్గరికి వస్తున్నాం రిషి.. బయలుదేరాం అని కలవరిస్తూ ఉంటుంది. జగతి అలా కలవరించడం చూసి ఆమె తల నిమురుతాడు రిషి. జగతి చెవి దగ్గరికి వెళ్లి మీకేం కాదని చెప్పి బయటకు వెళ్తుండగా దాహం దాం అని జగతి అనగానే నీళ్లు తాగిస్తాడు. బయటి నుంచి ఇదంతా చూసి సంతోషిస్తారు మహేంద్ర, వసుధార, గౌతమ్.
లోపలికి వెళ్దాం పదండి అంకుల్ అని గౌతమ్ అనడంతో వద్దు ఆ తల్లి కొడుకుని అలాగే వదిలేద్దాం అంటాడు మహేంద్ర. ఇంతలో అక్కడికి దేవయాని, ఫణీంద్ర వస్తారు. తర్వాత మహేంద్ర తాను బయటకు వెళ్లేందుకు కారణాలు చెబుతుండగా మీరేం చెప్పకండి డాడ్.. నేనేమీ అడగను.. మీరు బాగుంటే చాలు.. మేడమ్ కి బాగవుతుందని ధైర్యం చెబుతాడు రిషి. నీకు చాలా చెప్పాలి కానీ మాటలు రావడం లేదంటాడు మహేంద్ర. మీరు ఎక్కడికి వెళ్లారో.. ఎందుకు వెళ్లారో నాకు అనవసరం. ఇంకెప్పుడూ వదిలేసి వెళ్లకండి. మీరు లేకుండా నేను ఎలా ధైర్యంగా ఉండగలనని అంటాడు రిషి.