Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Guppedantha Manasu:వసుధారకు మొదలైన తొలి పరీక్ష.. అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా?
రిషి, వసుధార ప్రేమాయణం కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన ఇంటికి వసుధార వచ్చినట్లు ఊహించుకుంటాడు రిషి. మరోవైపు ఒకరికొకరు తమకు కాల్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంతలో రిషి వాట్సాప్లో ఓ గ్రూప్ క్రియేట్ చేస్తాడు. అందులో జగతిని కూడా యాడ్ చేస్తాడు. పుష్ప కూడా ఈ గ్రూప్ను చూస్తుంది. ఈలోపు గుడ్ ఐడియా సార్ అని రిషికి వసుధార మెసేజ్ చేస్తుంది. అలాగే అందరికీ వచ్చే డౌట్స్ ఈ గ్రూప్లో అడగొచ్చా అని మరో మెసేజ్ పెడుతుంది వసుధార. ఇలా ఆసక్తికరంగా సాగుతున్న ఆగస్టు 30, 2022 మంగళవారం నాటి 'గుప్పెడంత మనసు' సీరియల్ తాజా ఎపిసోడ్ 542లో ఏం జరిగిందంటే?
ఎలా కలుసుకుంటారు?
వసుధార పెట్టిన మెసేజెస్కు అవును, ఏ డౌట్ అయినా అడగొచ్చు.. మీ లక్ష్యమే మీకు ముఖ్యం అని రిప్లై ఇస్తాడు రిషి. తనకోసమే రిషి ఈ మెసేజ్ పెట్టాడని అనుకుంటుంది వసుధార. ఈ మెసేజ్ చూసిన జగతి.. ఎవరికీ తెలియకుండా చాటింగ్ చేసుకుంటున్నారా.. బాగుంది అని అనుకుంటుంది. తర్వాత భోజనం చేశారా? సమయానికి తినండి, ఆరోగ్యం కాపాడుకోండి అని రిషి పెట్టిన మెసేజ్కు ఓకే సార్ అని రిప్లై ఇస్తుంది వసుధార. మరోవైపు మహీంద్రా, జగతి, గౌతమ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా అయితే రిషి, వసుధార ఎలా కలుస్తారు? అని అంటాడు గౌతమ్. కానీ, ఏదో జరుగుతుంది అని మహీంద్రా అన్న దానికి మనకు తెలియకుండా ఏదో పెద్ద కుట్రే నడుస్తోంది అంటాడు గౌతమ్.
గ్రూప్లో పర్సనల్గా చాటింగ్!
దీంతో ఫోన్ చూస్తున్న జగతిని, ఏదో చెబుతా అని ఫోన్ చూసుకుంటూ ఉంటావేంటీ అని జగతిని మహీంద్రా అడుగుతాడు. దీంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పేరుతో రిషి గ్రూప్ స్టార్ట్ చేశాడు. ఈ గ్రూప్లో ఇద్దరూ చాట్ చేసుకుంటున్నారు అని అసలు విషయం చెబుతుంది జగతి. అలాగే వాళ్ల చాట్ మొత్తాన్ని చూపిస్తుంది. మా ఇంట్లో కరెంట్ పోయింది ఫ్రెండ్స్ అని వసు ఇప్పుడే గ్రూప్లో మెసేజ్ పెట్టింది అని చెప్పిన జగతితో.. ఇప్పుడు చూడు వెంటనే కారు తీసుకుని రిషి వెళ్తాడు అని మహీంద్రా అంటాడు. దీంతో గౌతమ్ వెళ్లి చూడగానే రిషి నిజంగానే కారులో వెళ్తుంటాడు. దీనికి జగతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు కరెంట్ లేదు.. ఎలా చదువుకోవాలి? అని టెన్షన్ పడుతుంది వసుధార.
ఫస్ట్ ఎగ్జామ్ ప్రారంభం..
దీంతో వెన్నెల పడుతుందని బయటకు వచ్చన వసుధార, చందమామతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రిషి వస్తాడు. కారు లైట్స్ ఆన్ చేసి.. చదువుకో అంటాడు. దీంతో షాక్ అయినా వసుధార.. నాకోసం వచ్చారా? కరెంట్ పోయిందని గ్రూప్లో మెసేజ్ పెడితే వచ్చి కారు లైట్స్ పెట్టారా? థ్యాంక్స్ రిషి సార్ అని మనసులో అనుకుంటుంది వసుధార. తను చదవడం పూర్తయ్యాక ఒక లెటర్ రాసి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతుంది వసుధార. కట్ చేస్తే పరీక్షల సమయం వచ్చేస్తుంది. మొదటి పరీక్ష ప్రారంభం అవుతుంది. కాలేజీకి వచ్చిన రిషి.. అందరూ బాగా ప్రిపేర్ అయ్యారా? అని అడుగుతాడు రిషి. దీనికి సమాధానంగా అందరు ప్రిపేర్ అయ్యామని చెబుతారు. అయితే అందరితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి కేవలం వసుధారకు అర్థం అయ్యేలా మాట్లాడుతాడు రిషి.
మీరు జెంటిల్ మెన్ సార్..
అనంతరం వసుధార బ్యాగులో పెన్ను పెడతాడు రిషి. ఎగ్జామ్స్ కోసం పెట్టిన గ్రూప్లో అందరూ యాక్టివ్గా ఉండండి. పరీక్షలు బాగా రాయండి. మంచిగా మార్క్స్ తెచ్చుకోండి అని చెబుతాడు రిషి. అలాగే వసుతో పాటు అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతాడు రిషి. తర్వాత తన బ్యాగులో రిషి పెట్టిన పెన్ను చూస్తుంది వసుధార. పెన్నుతోపాటు చిన్న లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్లో మనసు మాట్లాడమంటోడి. షరతు వద్దంటోంది. నీ లక్ష్యమే నీ గమ్యం. ఎగ్జామ్స్ బాగా రాయి. ఆల్ ది బెస్ట్ అని ఉంటుంది. థ్యాంక్యూ సార్, మీరు జెంటిల్ మెన్ సార్.. అని వసుధార అనుకుంటుంది. ఇక తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం ఆగాల్సిందే.