Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Guppedantha Manasu: రిషికి కొత్త టెన్షన్.. మారిపోయానంటూ లండన్ నుంచి వచ్చేసిన సాక్షి
స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. వసు రిషి దగ్గరవుతున్న నేపథ్యంలో దేవయాని ఎలా అయిన వారిని దూరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. వసుధార ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకున్న ఆమె బావ రాజీవ్ ఆమె మీద ఎటాక్ చేసి అర్ధరాత్రి సమయంలో వేరే చోటికి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించిన క్రమంలో రిషి ఆమెను రక్షించి తన ఇంటికి తీసుకు వెళ్తాడు. అలా ఆమెను ఇంటికి తీసుకు వెళ్ళగా ఇంట్లో పెద్ద రచ్చ అవుతుంది.
అయినా అయితే అవేవీ పట్టించుకోకుండా ఆమె కష్టాల్లో ఉంది కాబట్టి తీసుకు వచ్చాను అని చెప్పిన రిషి ఆమెను ఇంటి లోపలికి తీసుకువెళతాడు. అయితే జగతిని, వసుధారను ఒకే చోటకు పిలిచిన దేవయాని వారిద్దరినీ అనేక రకాలుగా మాట్లాడి బాధ పెడుతుంది. ఆమె మాటలకు బాధ పడిన వసుధార అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సరైన సమాధానం చెప్పలేదని
తన బట్టలు అన్నీ సర్దుకుని బయలుదేరడానికి సిద్ధమైన వసుధారను రిషి ఆపుతాడు. నువ్వు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్లిపోతున్నావు? ఉండమని అంటాడు. లేదని వసుధార అంటే నేను ఉండమన్నా ఉండవా అని కొంచెం గట్టిగానే అడుగుతాడు రిషి. అయితే దానికి ఆమె కూడా వెనక్కు తగ్గకుండా నేను ఉండను, అసలు నేను ఎందుకు ఉండాలో చెప్పండి అని అడుగుతుంది.
సరే నేను ఇక్కడ ఎందుకు ఉండాలో దానికి కారణం చెప్పండి, నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడుగుతుంది వసుధార. అయితే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయా? అంటే ఉంటాయని అంటుంది. దీంతో కాలేజీ ఎండీగా ఉండమని అంటున్నారు అని రిషి అంటే.. ఇది కాలేజీ విషయం కాదని కాబట్టి ఇది సరైన సమాధానం కాదని వసుధార అంటుంది.
ఇంటి నుంచి వెళ్ళిపోయి
ఆమె చెప్పింది కూడా నిజమే కావటంతో ఆమెను ఎలా ఒప్పించాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఉండిపోవచ్చు కదా అని బేలగా ఆమెను ప్రాధేయ పడతాడు రిషి. అయితే దేవయాని అన్న అన్ని మాటలు గుర్తు తెచ్చుకున్న ఉండమనే గొప్ప మనసు మీకు ఉన్నా ఉండిపోయే అర్హత నాకు లేదని వసుధార అంటుంది. నాకు అంటూ కొన్ని హద్దులు ఉన్నాయి దాన్ని దాటనివ్వొద్దని రిషితో చెబుతుంది.
అయితే వసుధార ఉండిపోవాలని లోపల కోరుకుంటున్నా పైకి మాత్రం నీ మనసుకు నచ్చిన నిర్ణయమే తీసుకోమని చెబుతాడు రిషి. ఉండమని నిన్ను బలవంతం చేయలేను.. వద్దని ఆపలేను అని చెబుతూనే నీ మనసు చెప్పిన మాట వినమని ఆమెకు చెబుతాడు. దీంతో ఆమె మీరు జంటిల్ మెన్ అని మరోసారి నిరూపించుకున్నారని చెబుతూ ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
సాక్షి ఎంట్రీ
ఇంట్లో ఉన్న వారు అందరూ రిషి ఆమెను తీసుకు వస్తే ఎంత షాక్ అయ్యారో వెళ్ళిపోతున్న సమయంలో కూడా అంతే షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. కానీ ఇది జరగడం కోసమే మాటలు అని మనసులు బాధ పెట్టిన దేవయాని మాత్రం లోలోప ఆనందిస్తూ ఉంటుంది. ఇక మరో పక్క కింది నుంచి వెళ్లిపోతున్న వసుధారను పై నుంచి చూస్తూ బాధపడతాడు రిషి. వసుధార కూడా వెళుతూ వెళుతూ రిషిని చూసి అంతే బాధపడుతుంది.
ఆమె అలా వెళ్లిందో లేదో కాబ్ వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఓ అమ్మాయి దిగుతుంది. ఆమె ఎవరా అని చూసిన రిషి షాక్ అవుతాడు. ఎందుకు అంటే ఆమె మరెవరో కాదు సాక్షి. గతంలో ఆమెతో పెళ్లి వరకు వెళ్ళిన తరువాత ఆ పెళ్లి ఆగిపోయిన విషయం రిషికి గుర్తుకు వస్తుంది.
వసుధారను ఏం చేయాలో?
ఇప్పుడు ఈమె ఎందుకు వచ్చిందా? అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దేవయాని మాతృ జగతి, వసుధార మీద నన్ను గెలిపించే ఆయుధం వచ్చిందని అనుకుంటుంది. అందుకే ఇంటికి వచ్చిన సాక్షిని హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించాలని ధరణికి చెబుతుంది. అయితే అలాంటివి ఏవీ వద్దన్న సాక్షి వెంటనే ఇంట్లోకి వచ్చేస్తుంది.
ఆ తరువాత జగతి, మహేంద్రను పిలుస్తుంది. అయితే ఆమెను చూసి బెడ్ రూమ్ కు వెళ్ళిన రిషి వసుధార గురించే మళ్లీ ఆలోచిస్తుంటాడు. ఇంతలో థ్యాంక్యూ మెసేజ్ పంపిస్తుంది వసుధార. అది చదివిన రిషి ఇప్పుడు ఏం చేయాలా? అనుకుంటూ సుదీర్ఘ ఆలోచనలో పడతాడు. మరోపక్క సాక్షికి దేవయాని రిషిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నూరి పోస్తూ ఉంటుంది. ఇంతలో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో సాక్షి లండన్ నుంచి వచ్చేసిందని చెబుతుంది దేవయాని.
నా వల్ల కాదు అంటున్న రిషి
అయితే గతంలో పెళ్లి విషయంలో ఏం జరిగింది అనే విషయమై జగతికి అంతా చెబుతాడు మహేంద్ర. అలాగే దేవయాని జగతిని సాక్షికి పరిచయం చేస్తుంది. హాల్ లో నుంచి సాక్షి వెళ్లిపోయిన క్రమంలో మహేంద్ర, దేవయాని మధ్య కొంత వాగ్వాదం జరుగుతుంది. ఎందుకిలా చేస్తున్నారు అంటూ వదినను టార్గెట్ చేసి మాట్లాడతాడు మహేంద్ర. అయితే బెడ్రూమ్లో రిషి దగ్గరకు వెళ్ళిన సాక్షి రిషిని మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది.
అయితే అసలు నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాడు రిషి. నన్ను మర్చిపోయావు అనుకున్నా గుర్తు ఉన్నాను కదా అని సంబరిపడిపోతున్నట్టు సాక్షి హడావుడి చేస్తుంది. అడిగిందానికి సమాధానం చెప్పమని కోపంగా అడగడంతో నేను మారిపోయాను అని ఇక నీతోనే అంటూ ప్రేమ కురిపించే ప్రయత్నం చేస్తుంది. అవేమీ కుదరవు వచ్చిన దారిలోనే వెళ్లిపోమని రిషి అంటాడు.