twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: వసుధారకు కొత్త టెన్షన్ పెట్టిన దేవయాని- రిషి సాక్షినే పెళ్లి చేసుకోవాలంటూ అల్టిమేటం!

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. వసుధార బావ రాజీవ్ వసును బలవంతంగా ఎక్కడికో తీసుకు వెళ్లి పోతున్న క్రమంలో ఆమెను రిషి రక్షించి తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. అయితే దేవయాని వసుధారను అవమానించడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లి పోతుంది. అలా బయటకు వెళ్లిన ఆమె ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసుకోవడంతో ఎట్టకేలకు రిషి అనేక తంటాలు పడి ఆమెను కనుక్కుని ఆమె వెనకే వెళతాడు. ఆమెను కలిసి ఎప్పటి లాగే ఆమెను కారులో రెస్టారెంట్ కు అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి, అటు నుంచి కాలేజీకి ఇలా షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు. తన కోసం ఇంత చేస్తున్న రిషికి మంచి భోజనం పెట్టాలని భావించిన వసుధార అతనికి భోజనం పెడుతుంది. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    తేడాగా ఉందని

    తేడాగా ఉందని

    రిషి, వసుధార ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉన్న సమయంలో ఆ బస్తీ వసుధారకు రూమ్ ఇచ్చిన వ్యక్తి భార్య వచ్చి వీళ్లిద్దరి గురించి ఆరా తీస్తుంది. భోజనం చేస్తున్న సమయంలోనే ఒకసారి మాట్లాడాలి అంటూ వసుధారను ఆమె పిలుస్తుంది. అయితే అన్నం పెట్టుకున్న తరువాత లేవకూడదు అని రిషి వారించడంతో ఆమె అలానే కూర్చుని ఏమిటి పెద్దమ్మా అని అడిగితే ఏమీ లేదులే అమ్మా మనం తరువాత మాట్లాడుకుందామని అంటుంది. అలా భోజనం పూర్తైన తర్వాత నీ వంటలు చాలా బాగున్నాయి అని ప్రశంసలు కురిపించిన రిషి ఎట్టకేలకు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఈలోపే ఆమె తన భర్తకు వీళ్ళ గురించి తప్పుగా నూరి పోస్తూ ఉంటుంది. ఏమీ కనుక్కోకుండా ఇల్లు ఇచ్చి తప్పు చేశానేమో అని ఆమె భర్త అంటుంటే అవును నిజమే ఇదేదో తేడాగా ఉందని ఆమె మరింత రెచ్చగొడుతుంది. ఇక ఇంతలో రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

    ఒకేసారి కౌంటర్ వేస్తా

    ఒకేసారి కౌంటర్ వేస్తా

    ఆ తరువాత రూమ్ ఇచ్చిన వ్యక్తి ఆయన భార్య ఇద్దరూ వచ్చి వసుధారను నిలదీస్తారు. ఈ పనులు ఏమిటి అని అడుగుతుంది. అయితే మా సర్ కు భోజనం పెట్టడం కూడా తప్పేనా అని అడిగితే సార్‌ అయితే కాలేజీలో పాఠాలు చెప్పాలి కానీ ఇంటికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తారు. బస్తీ అన్నాక అందరి చూపులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయని కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. డానికి వసుధార ఏదో చెప్పబోతే అసలు ఆయన నీకు ఏమవుతారు అని ప్రశ్నిస్తుంది. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోమని భార్యాభర్తలు వసును హెచ్చరించి వెళ్లిపోతారు. దీంతో వసు బాధ పడుతూ రూమ్‌కి వెళ్లిపోతుంది. ఇక ఆ ఆడ మనిషి దేవయానికి ఫోన్ చేసి చెప్పిన పని చెప్పినట్టు చేశాను అని చెబుతుంది. ఇక మీదట కూడా చెప్పింది చెప్పినట్టు చేయాలని పేర్కొన్న ఆమె జగతి, వసుధారకు ఇద్దరికీ ఒకేసారి కౌంటర్ వేస్తా అంటూ ఆమె హెచ్చరిస్తుంది. ఇక మరో పక్క వెనుకాలే ఉన్న ధరణి ఈవిడ మళ్ళీ ఏదో ప్లాన్ చేసింది అనుకుంటుంది.

    రిషితో బ్రేక్ ఫాస్ట్

    రిషితో బ్రేక్ ఫాస్ట్

    ఇక అది గమనించిన దేవయాని... ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఏమైనా తాగడానికి తీసుకురమ్మంటారా? అని అడిగితే జ్యూస్ డబుల్ పంచదార వేసి తీసుకురమ్మని చెబుతుంది. ఇక ఆరోజు గడుస్తుంది. తెల్లారుతూ ఉండగానే గౌతమ్, రిషి ఇద్దరూ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తుంటారు. అలా పక్కగా వెళుతున్న మహేంద్రను గౌతమ్ పిలుస్తాడు. వచ్చి మాతో కలిసి ఎక్స్‌ర్‌సైజ్‌ చేయమంటే వద్దు డాక్టర్ లు వద్దన్నారు కదా అంటూ రిషి వద్దంటాడు. ఇంతలో గౌతం సైలెంట్ గా సాక్షి ప్రస్తావన తీసుకొస్తాడు. అయితే సాక్షి ఉంది కదా అంటే గౌరవంగా పిలవాలన్న రిషి, మరోసారి అసలు ఆమె టాపిక్ నా ముందు తీసుకురావద్దని వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఇంతలో రిషికి సాక్షి ఫోన్ చేస్తుంది. ఫోన్‌లో మాట్లాడుకునేంత చనువు మన ఇద్దరి మధ్య లేదని పేర్కొన్న రిషితో ఆమె బ్రేక్ ఫాస్ట్ కు వెళదామని అంటుంది.

     తేడా లేదా

    తేడా లేదా

    దీంతో నా ఫ్రెండ్‌తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంతున్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో ఫ్రెండ్‌ అంటే గౌతమ్ తన గురించి అనుకుంటూ ఎక్కడికి వెళదాం అని అడిగితే నేను నీతో అన్నానా అని ట్విస్ట్ ఇస్తాడు. ఇక మరోపక్క వసుధార సీరియస్‌గా చదువుకుంటున్న సమయంలో వరుసగా మార్కెటింగ్‌ ఫోన్లు వస్తాయి. డిస్టర్బ్‌ చేయొద్దని పెట్టేస్తుంది. అలా ఫోన్ కట్ కాగానే రిషి ఫోన్ చేస్తాడు. మార్కెటింగ్‌ ఫోన్‌ అనుకొని ముందు ఎత్తి బుద్ధి లేదా అంటూ చెడామడా తిట్టేస్తుంది. రిషి నేను అనేసరికి సారీ చెబుతుంది. నీ రూమ్‌ దగ్గరే ఉన్నాను త్వరగా రమ్మంటే ఆమె వచ్చి కార్ ఎక్కుతుంది. కార్ ఎక్కినా తరువాత ఎక్కడకు వెళ్తున్నామో అని అడుగుతుంది వసుధార. బ్రేక్ ఫాస్ట్ చేశావా అని అడుగుతాడు. లేదని అంటుంది, అది తినడానికే అని అంటాడు రిషి. అంతేకాక మార్కెటింగ్‌ కాల్‌కు నా కాల్‌కు తేడా లేదా అని రిషి అడుగుతాడు. అయితే ఫోన్ నెంబర్ చూడలేదని చెబుతుంది.

    సాక్షితోనే నీ పెళ్లి

    సాక్షితోనే నీ పెళ్లి

    అలా వీరు వెళుతూ ఉండగానే వసుధార రూమ్‌కు జగతి, మహేంద్ర వస్తారు. వసుధార పిల్లకు ట్యూషన్ చెప్పడం చూసి ఇద్దరూ ఆనంద పడతారు. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ అయిపోతుంది. రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం రిషి ఇంట్లో ఉండగా సాక్షి అక్కడికి వచ్చి ఉంటుంది. ఆమె ఈ ఇంటికి సరైన కోడలని దేవయాని రిషితో చెబుతుంది. ఈ క్రమంలో అప్పుడు రిషి నోట మాట రాదు. ఇంతలో కారులో వెళ్తూ వసుధారకు ఫోన్ చేస్తాడు. నేను వస్తున్నాను అని చెప్తాడు. కానీ భయపడుతూ మాట్లాడుతున్న వసుధార మీరు రావద్దు అని చెబుతూ ఉండగానే రిషి ఆమె రూమ్‌ డోర్‌లు తీస్తాడు. దీంతో వసుధార షాక్‌ అవుతుంది.

    English summary
    Guppedantha Manasu Episode 442: Vasudhara is hurt as her neighbour talks ill about her. Elsewhere, Mahindra and Jagathi feel elated after finding Vasudhara's house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X