Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టీవీ ఛానెల్ ఆస్తులు జప్తు...కోర్టులో విచారణ
చెన్నై : 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ నీడ...సన్ టీవి కు ఇప్పుడు చుట్టుకుని భయపెడుతోంది. ఇందునిమిత్తమై ఛానెల్ కు సంభందించిన ఆస్తులు జప్తు చేయాలని ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ మారన్ సోదరులకు చెందిన సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్స్ పెట్టుకున్న రిట్ పిటిషన్లపై తీర్పును మద్రాసు హైకోర్టు మంగళవారం వాయిదా వేసింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
జస్టిస్ సత్యనారాయణన్ సమక్షంలో జరిగిన విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ జి.రాజగోపాలన్ తన వాదన వినిపిస్తూ 2జీ స్రెక్ట్రమ్ కేసును తామే పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు విచారణ జరపాలా వద్దా అనే విషయంపై సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్స్ వివరణ ఇవ్వాలని కోరారు.
ఎయిర్సెల్ మేక్సిస్ కేసు కూడా 2జీ స్పెక్ట్రమ్ పరిధిలోకే వస్తుందని గుర్తు చేశారు. మారన్ సోదరుల సంస్థ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్ వాదిస్తూ ఈ కేసు ముగిసే వరకు ఆస్తులను పరాధీనం చేయబోమన్నారు. ఆస్తుల జప్తు ఆదేశాలను రద్దు చేయాలని వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్లపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.