Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెళ్లికూతురైన టీవీ హీరోయిన్.. సీక్రెట్గా షాకిచ్చింది.. పెళ్లికొడుకు ఎవరంటే!
Recommended Video
కళ్యాణ వైభోగం సీరియల్ ద్వారా రెండేళ్లకుపైగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న మేఘనా లోకేష్ పెళ్లి కూతురయ్యారు. స్వరూప్ భరద్వాజ్తో మూడు మూళ్లు వేయిచుకొన్నారు. బెంగళూరులో నిరాడంబరంగా జరిగిన పెళ్లికి సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు మరిన్నీ..
స్వరూప్ భరద్వాజ్తో వివాహం
గత కొద్దికాలంగా స్వరూప్ భరద్వాజ్తో మేఘనా లోకేష్ పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారట. దాంతో వారిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధపడినట్టు సమాచారం. స్వరూప్ భరద్వాజ్ బెంగళూరుకు చెందినవారు కావడంతో పెళ్లికి అక్కడే ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
పెళ్లికి హాజరైన అతిథులు
మేఘనా లోకేష్ పెళ్లికి కల్యాణ వైభోగం హీరో వీజే సన్నీతోపాటు సీరియల్లో నటించిన నటులు, పనిచేసిన సిబ్బంది హాజరయ్యారు. అలాగే మరికొందరు టెలివిజన్ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు మేఘనా, స్వరూప్ను ఆశీర్వదించినట్టు సమాచారం. ప్రస్తుతం మేఘన పెళ్లి ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తున్నది.
బుల్లితెర ప్రేక్షకుల మదిని దోచుకొని
అత్యంత ప్రజాదరణ పొందిన కళ్యాణ వైభోగం సీరియల్ ద్వారా ప్రతీ తెలుగు ఇంటికి మేఘన లోకేష్ పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో నిత్య, మంగతాయారు రెండు పాత్రలను పోషించి లక్షలాది మంది ప్రేక్షకుల మనసు దోచుకొన్నారు. ఈ సీరియల్ ద్వారా మేఘనకు మంచి నటిగా పేరు వచ్చింది. పెళ్లి విషయంలో చాలా సీక్రెట్గా వ్యవహరించి, అందరికీ షాకిచ్చిందని సన్నిహితులు చెప్పుకొంటున్నారు.
520 ఎపిసోడ్స్తో కల్యాణ వైభోగం
కల్యాణ వైభోగం సీరియల్ మే 2017లో ప్రారంభమై.. దాదాపు రెండేళ్లకుపైగా సాగింది. దాదాపు 520 ఎపిసోడ్స్తో బుల్లితెర ప్రేక్షకులను రంజింప చేసింది. వీజే సన్నీ, మేఘనా లోకేష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు.