Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మిడ్ నైట్ మసాలా టీవీ యాంకర్.. వెండి తెరపై
ఆషా రామ్ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'విచక్షణ'. దీపక్ దర్శక నిర్మాత. ధీరజ్, పద్మిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లోని డెక్కన్పార్కులో జరుగుతోంది. దీపక్ మాట్లాడుతూ "టాకీ, రెండు పాటలు పూర్తయ్యాయి. నాలుగు పాటల్ని తెరకెక్కించాలి. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. ఓ ప్రేమజంట తమ సహచరులతో కలిసి చేసిన మిషన్ ఎలా పూర్తయింది? దానివల్ల ప్రజలకు ఎలాంటి మంచి జరిగిందన్నది కథాంశం'' అని తెలిపారు.
తమ తొలి చిత్రం చక్కగా వస్తోందని ధీరజ్, పద్మిని అన్నారు. పోలీస్ కమిషనర్గా నటిస్తున్నట్టు ముఖేష్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పాటకు తాను నృత్యరీతుల్ని సమకూరుస్తున్నట్టు రాజేష్ అన్నారు. జయలక్ష్మి, పద్మజయంతి, ఉషారాణి, సురేందర్ గౌడ్, రిజ్వాన్, రాహుల్, ఆకాష్, వంశీ, సుప్రీమ్, దివిజ, శ్రీదేవి, కొర్రపాటి, ధర్మేంద్ర, మాస్టర్ విశోధన్, జయప్రద తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రాజేంద్ర, కెమెరా: డి.కె.నాగరాజ్, నృత్యాలు: నిక్సన్, రాజేష్, శ్రీనివాస్, సంగీతం: జగన్నాధ్ సెంధి, కూర్పు: మోహన్ రామారావు.