Don't Miss!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- News సిట్టింగ్ ఎంపీ ప్రాణం తీసిన టిక్కెట్, మరోసారి ఎంపీ కావాలనే ఆశతో, నిద్రమాత్రలతో బెదిరించి ?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Finance DA Hike: కోటి మంది ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 30 నుంచి పెరిగిన జీతాలు..!!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
మిడ్ నైట్ మసాలా టీవీ యాంకర్.. వెండి తెరపై
ఆషా రామ్ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'విచక్షణ'. దీపక్ దర్శక నిర్మాత. ధీరజ్, పద్మిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లోని డెక్కన్పార్కులో జరుగుతోంది. దీపక్ మాట్లాడుతూ "టాకీ, రెండు పాటలు పూర్తయ్యాయి. నాలుగు పాటల్ని తెరకెక్కించాలి. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. ఓ ప్రేమజంట తమ సహచరులతో కలిసి చేసిన మిషన్ ఎలా పూర్తయింది? దానివల్ల ప్రజలకు ఎలాంటి మంచి జరిగిందన్నది కథాంశం'' అని తెలిపారు.
తమ తొలి చిత్రం చక్కగా వస్తోందని ధీరజ్, పద్మిని అన్నారు. పోలీస్ కమిషనర్గా నటిస్తున్నట్టు ముఖేష్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పాటకు తాను నృత్యరీతుల్ని సమకూరుస్తున్నట్టు రాజేష్ అన్నారు. జయలక్ష్మి, పద్మజయంతి, ఉషారాణి, సురేందర్ గౌడ్, రిజ్వాన్, రాహుల్, ఆకాష్, వంశీ, సుప్రీమ్, దివిజ, శ్రీదేవి, కొర్రపాటి, ధర్మేంద్ర, మాస్టర్ విశోధన్, జయప్రద తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రాజేంద్ర, కెమెరా: డి.కె.నాగరాజ్, నృత్యాలు: నిక్సన్, రాజేష్, శ్రీనివాస్, సంగీతం: జగన్నాధ్ సెంధి, కూర్పు: మోహన్ రామారావు.