Don't Miss!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పవిత్ర - నరేష్ లపై హైపర్ ఆది దిమ్మతిరిగే సెటైర్.. కోసికారం పెడతా అంటూ యాంకర్ కౌంటర్
టెలివిజన్ షోలో హైపర్ ఆది వేసే పంచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న ఈ కమెడియన్ ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా కూడా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం అందులోనే కొనసాగుతున్న ఆది ల్ ఎప్పటిలానే కామెడీ పంచలతో ఇరగదీస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఎంతో హాట్ టాపిక్ గా మారిన పవిత్ర నరేష్ టాపిక్ పై కూడా అతను ఊహించిన విధంగా సెటైర్ వేయడం వైరల్ గా మారిపోయింది. అంతేకాకుండా యాంకర్ అనసూయ కూడా వారిపై గట్టిగానే కౌంటర్ వేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
వెనక్కి తిరిగి చూసుకోకుండా
మొదటి జబర్దస్త్ స్క్రిప్ట్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఆ తర్వాత చాలా తొందరగానే కమెడియన్ గా క్రేజ్ అందుకున్నాడు. అదిరే అభి సపోర్ట్ తో మొదట జబర్దస్త్ ద్వారా అతనికి మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇతర ఫెస్టివల్ షోలతో అలాగే వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది రెగ్యులర్ కమెడియన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
శ్రీదేవి డ్రామా కంపెనీ
శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మీ మేయిన్ యాంకర్ గా ఉండగా ఆమెకు కౌంటర్లు ఇచ్చేందుకు మరొకవైపు ఆటో రాంప్రసాద్ హైపర్ ఆది కూడా కొనసాగుతున్నారు. ఇక చాలా రోజులుగా జబర్దస్త్ కంటే ఎక్కువగా శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా హైప్ పెరిగింది. ఈ కామెడీ షో రేటింగ్ కూడా ఇటీవల టాప్ లిస్టు లోకి చేరిపోయింది. నాన్ స్టాప్ కామెడీ పంచులతో హైపర్ ఆది మరింత ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడు.
కోసి కారం పెడతా
ఆదివారం జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా హడావిడి చేశారు. ప్రత్యేకంగా శ్రీదేవి డ్రామా కంపెనీ క్యాలెండర్ ను లాంచ్ చేయవలసిందిగా రష్మి మొదలుపెట్టిన డ్రామాకు ఆటో రాంప్రసాద్ హైపర్ ఆది కామెడీ పంచలతో మరింత ఫన్ క్రియేట్ చేశారు. అయితే హైపర్ ఆది రష్మిని అలానే చూస్తూ ఉండడంతో ఆమె కోసి కారం పెడతా అని కౌంటర్ ఇచ్చింది. అయితే ఒక్కసారి చూసినందుకే కారం పెడతా అన్నావు అంటే.. మరి గురుడికి ఎన్నిసార్లు ఏమేమి పెట్టావో అంటూ సుధీర్ ను గుర్తు చేస్తూ ఆది కౌంటర్ వేశాడు.
కాంట్రవర్సీ విషయాలపై పంచ్
అయితే హైపర్ ఆది ఎప్పుడు కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతున్న టాపిక్స్ మీద కామెడీ స్కిట్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక మధ్య మధ్యలో కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వాటిపై కూడా పంచ్ లు వేసేందుకు ప్రయత్నం చేస్తాడు. గతంలో మా ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మంచు విష్ణు కోపంతో అన్న డైలాగ్స్ ను కూడా ఇమిటేట్ చేసి హైలైట్ అయిన విషయం తెలిసిందే.
పవిత్ర, లోకేష్ పంచ్
ఇక ప్రస్తుతం పవిత్ర, నరేష్ కు సంబంధించిన వివాదాన్ని కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో హైలెట్ చేశారు. పొట్టి నరేష్ అలాగే మరొక లేడీ కమెడియన్ పవిత్రను ఆసరాగా చేసుకుని హైపర్ ఆది కామెడీని క్రియేట్ చేశాడు. ముందుగా పొట్టి నరేష్ పేరు ఏమిటి అని అడుగుతూనే.. మరొకవైపు పవిత్ర పేరును కూడా ప్రస్తావించేలా చేశాడు. వారి పేర్లు చెప్పగానే హైపర్ ఆది నడుచుకుంటూ వెళ్లిపోతాడు. దీంతో పక్కనే ఉన్న పంచ్ ప్రసాద్ పవిత్ర నరేష్ అంటూ పక్కున నవ్వేశాడు. దీంతో అందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని నవ్వేశారు.