హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు: ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ మగాడు కాదు.. నోరు జారి మరీ దారుణంగా!
ప్రస్తతం తెలుగు బుల్లితెరపై టాలెంట్ ఉన్న ఎంతో మంది కుర్రాళ్లు సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్లు మరింత పాపులారిటీని సొంతం చేసుకుని దూసుకెళ్తోన్నారు. అందులో టాలెంటెడ్ గాయ్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిన ఈ కుర్రాడు.. తనదైన కామెడీతో వరుస షోలలో సందడి చేస్తోన్నాడు. ఫలితంగా క్రేజ్ను, మార్కెట్ను భారీగా పెంచుకుంటోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ షోలో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాలేంటో మీరే చూడండి!

జబర్ధస్త్గా హైపర్ ఆది కెరీర్
సినిమా స్ఫూఫ్ వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఆది.. అదిరే అభి ద్వారా జబర్ధస్త్ షోలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి ఎన్నో స్కిట్లలో చేశాడు. ఇలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతడు టీమ్ లీడర్గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి అతడి కెరీర్ జబర్ధస్త్గానే సాగిపోతుందని చెప్పుకోవచ్చు.

మూవీల్లో.. ధమాకా చూపించి
జబర్ధస్త్ షో వల్ల పాపులర్ అయిన హైపర్ ఆదికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అందులోనూ తన శైలిని చూపించాడు. ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇటీవలే వచ్చిన రవితేజ 'ధమాకా' మూవీలో ఆది అదిరిపోయే రోల్తో తెగ మెప్పించాడు.

జబర్ధస్త్లోకి అలా.. అందులో
సుదీర్ఘ కాలం పాటు జబర్ధస్త్లో టాప్ టీమ్ లీడర్గా హవాను చూపించిన హైపర్ ఆది.. కొంత కాలం పాటు ఆ షోలో కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత అతడు షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ ఇప్పుడు దాని నుంచి గ్యాప్ తీసుకున్నాడు. కానీ, 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో మాత్రం యమ సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఢీలో అదరగొట్టేస్తోన్న ఆది
దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న 'ఢీ' ప్రస్తుతం 15వ సీజన్ను జరుపుకుంటోంది. ఇందులో గతంలో కంటే కొత్త కాన్సెప్టులను చూపిస్తున్నారు. దీన్ని ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తుండగా.. హైపర్ ఆది, బిగ్ బాస్ జస్వంత్ పడాల, మరో అమ్మాయితో కలిసి సందడి చేస్తోన్నాడు. ఇందులో కూడా అతడు తనదైన కామెడీతో చెలరేగుతోన్నాడు.

సూపర్ డ్యాన్స్.. అలా ఎంట్రీ
వచ్చే వారం ప్రసారం కాబోతున్న 'ఢీ' 15వ సీజన్ ఎపిసోడ్ విలేజ్ స్పెషల్గా రాబోతుంది. ఇది గతంలో వాటి కంటే మరింత ఫన్నీగా జరగబోతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. ఇందులో జడ్జ్లు శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్తో పాటు అందరూ సంప్రదాయమైన బట్టల్లో కనిపించారు. హైపర్ ఆది మాత్రం జెస్సీతో కలిసి కూరగాయలు తీసుకుని ఫన్నీగా వచ్చాడు.

వెనక కాయలతో వచ్చారు
తాజాగా విడుదలైన ప్రోమోలో కొన్ని డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు చూపించిన తర్వాత హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. అతడి వెనక జెస్సీ కూరగాయలు పట్టుకుని కనిపించాడు. రావడమే ఆది 'ఓహో.. ఈరోజు వీళ్లంతా ఏదో క్యారెక్టర్లతో వచ్చినట్లున్నారు' అన్నాడు. దీంతో శేఖర్ మాస్టర్ 'మీరేంటి వెనుక కాయలతో వచ్చారు' అని పంచ్ వేశాడు. దీంతో అందరూ తెగ నవ్వుకున్నారు.
జెస్సీని లేడీ అనేసిన ఆది
ఆ తర్వాత జెస్సీ తీసుకొచ్చిన కూరగాయలను ఒక్కొక్కొటిగా చూపిస్తుండగా హైపర్ ఆది అది ఏంటి? అది ఎవరికి సెట్ అవుతుంది? అనేది చెప్పాడు. ఆ సమయంలోనే జెస్సీ బెండకాయను తీసి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పు అని అడిగాడు. దీనికి ఆది 'దాన్ని జెస్పీ ఫింగర్ అంటారు' అన్నాడు. అంటే పరోక్షంగా జెస్సీని లేడీ అని అనేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు.


Click it and Unblock the Notifications











