Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫేక్ స్మైల్ ఇవ్వాలా? ఎన్నికల ఫలితాలపై యాంకర్ రష్మి సంచలన కామెంట్
Recommended Video
2019 ఎన్నికల్లో మరోసారి 'నమో' మంత్రం మారుమ్రోగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటి తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారం చేజిక్కించుకుంది. బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నవారంతా దేశ వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు.
మోదీని అధికారంలోకి తెచ్చిన ప్రజలు, మోదీని వ్యతిరేకిస్తున్న వారు.... ఈ ఫలితాలపై సినీ సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారనే విషయాన్ని ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు తమ ఒపీనియన్ వెల్లడిస్తూ ట్వీట్స్ చేశారు. అయితే కొందరు మౌనంగా ఉండటంతో స్పందించాలంటూ నెటిజన్ల నుంచి ఒత్తిడి పెరిగుతోంది. ఈ క్రమంలో యాంకర్ రష్మి తదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
ఫేక్ స్మైల్ ఇవ్వాలా?
బీజేపీ అధికారంలోకి రావడంపై మీ అభిప్రాయం ఏమిటి? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా రష్మి తనదైన శైలిలో స్పందించారు. ‘‘ప్రజలు ఎన్నుకున్నారు. అదే ప్రజలు నా లాంటి వారి నుంచి సోషల్ మీడియాలో వారికి అనుకూలంగా ఒక పోస్ట్ పెట్టాలని ఆశిస్తున్నారు. వారి కోసం నేను ఒక ఫేక్ స్మైల్ ఇవ్వాలేమో, దానికి కట్టుబడి ఉండాలేమో''... అంటూ రష్మి వ్యాఖ్యానించారు.
వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేకనే...
రష్మి ఇచ్చిన రిప్లై చూస్తుంటే... తాను ఒక పార్టీకి చెందిన వ్యక్తి అని కానీ, మద్దతుదారు అనే ముద్ర పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీని వల్ల అనవసర వివాదాల్లో ఇరుక్కుంటాననే సందేహంలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.
పొలిటికల్ అంశాలకు దూరంగా రష్మి
పొలిటికల్ అంశాలకు రష్మి మొదటి నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకే గురువారం విడుదలైన ఫలితాలపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీని, ఏపీలో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డిని అభినందించే ప్రయత్నం చేయలేదు. రష్మి ఎక్కువగా స్త్రీవాదానికి సంబంధించిన అంశాలు చర్చించడానికి ఆసక్తి చూపుతారనే విషయం తెలిసిందే.