Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బిగ్బాస్ తెలుగు 4 ఫైనల్కు చీఫ్ గెస్ట్ కన్ఫర్మ్.. ఆ స్టార్ హీరోనే వేదికపై.. రచ్చ రచ్చ..
బిగ్బాస్ తెలుగు 4 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. అత్యంత పాపులారిటిని సంపాదించుకొన్న ఈ షో ఇంకా రెండు వారాలపాటు కొనసాగనున్నది. ఈ క్రమంలో ముగింపు వేడుక కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో నాలుగో సీజన్ క్లోజింగ్ వేడుకకు ఎవరు చీఫ్ గెస్ట్ అనే విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది. ముగింపు వేడుకకు ఎవరు ముఖ్య అతిథి అంటే..
బిగ్ బాస్ మూడు సీజన్లకు ముఖ్య అతిథిగా
బిగ్బాస్ తెలుగు 1, 2, 3 సీజన్ ముగింపు కార్యక్రమంలో ఎన్టీఆర్, వెంకటేష్, చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శివ బాలాజీకి ఎన్టీఆర్ షీల్డ్ అందంచగా, రెండో సీజన్ విజేత కౌశల్ మండాకు వెంకటేష్ అందించారు. ఇక మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్కు చిరంజీవి ట్రోఫిని అందించారు.
నాలుగో సీజన్కు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్
ఇక నాలుగో సీజన్ కోసం ముఖ్య అతిథి ఎవరనే విషయంపై ఇప్పుడు మీడియాలో అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు పేర్లు వినిపించినప్పటికి.. క్లారిటీ రాలేదు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రానున్నారంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్?
నాలుగో సీజన్ మరో 14 రోజులపాటు సాగనున్నది. ఈ క్రమంలో ముగింపు వేడుకకు ఇప్పటి నుంచే బిగ్బాస్ హౌస్లో హంగామా కొనసాగుతున్నది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబును కలిసి ముఖ్య అతిథిగా పాల్గొనాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
డిసెంబర్ 20 తేదీన ఫైనల్
బిగ్బాస్ ముగింపు వేడుకు డిసెంబర్ 20వ తేదీన నిర్వహించేందుకు ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు పలువురు ప్రముఖులను, కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే కోవిడ్ 19 పరిస్థితుల దృష్ట్యా వేడుకను నిరాడంబరంగానే తక్కువ మందితోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.