ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తోన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపుతో టాప్ ప్లేస్‌కు చేరుకుంటోన్నారు. అలాంటి వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. అందానికి అందం, టాలెంట్ ఉన్న ఈ అమ్మడు.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగింది. అలాగే, సినిమాల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అనసూయ తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ షో నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

అలా ఎంట్రీ.. ఫుల్ ఫేమస్

అలా ఎంట్రీ.. ఫుల్ ఫేమస్

అనసూయ భరద్వాజ్ న్యూస్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత కొన్ని ఈవెంట్లను కూడా ఆమె హోస్ట్ చేసింది. అనంతరం జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో అద్భుతమైన హోస్టింగ్, అదిరిపోయే అందంతో మాయ చేసి అందరి దృష్టిలో పడింది. దీంతో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంది.

సినిమా నటిగానూ సక్సెస్

సినిమా నటిగానూ సక్సెస్


సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేసిన అనసూయ.. 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటింది. అలాగే, కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది. ఇలా సినీ నటిగా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోంది.

భారీ ఆఫర్లు.. ఆమెదే హవా

భారీ ఆఫర్లు.. ఆమెదే హవా

సినీ రంగంలో తిరుగులేకుండా దూసుకుపోతోన్న అనసూయకు ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడామె వరుసగా 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. దీంతో బుల్లితెరపై పెద్దగా షోలను మాత్రం ఒప్పుకోవట్లేదు. ఫలితంగా ఆమె ఫ్యాన్స్ ఢీలా పడిపోయారు.

జబర్ధస్త్ షోకు టాటా చెప్పి

జబర్ధస్త్ షోకు టాటా చెప్పి

ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారానే అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అందుకే అదే ఛానెల్‌లో సుదీర్ఘ కాలం పాటు పని చేసింది. అలాంటిది గత ఏడాది చివర్లో ఆమె జబర్ధస్త్ షో నుంచి తప్పుకుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పర్సనల్ రీజన్స్ వల్లే ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె క్లారిటీ ఇచ్చింది.

సుధీర్‌తో కలిసి సందడిగా

సుధీర్‌తో కలిసి సందడిగా


ఈటీవీ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి అడుగు పెట్టింది. అందులో ప్రసారం అయిన 'సూపర్ సింగర్ జూనియర్' షోకు ఆమె
సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా చేసింది. ఈ షో పూర్తైన తర్వాత నుంచి అనసూయ బుల్లితెరపై కనిపించడం లేదు. అప్పటి నుంచి దీనిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

వాళ్ల వల్లే జబర్ధస్త్ చేయట్లే

వాళ్ల వల్లే జబర్ధస్త్ చేయట్లే

జబర్ధస్త్ మానేయడానికి తన పర్సనల్ రీజన్సే కారణం అని అనసూయ భరద్వాజ్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆమె తన ఇద్దరు కొడుకుల కోరిక మేరకే ఈ షో నుంచి తప్పుకుందట. వాళ్లతో సమయం గడపడం వీలు కావడం లేదని ఈ నిర్ణయం తీసుకుందని టాక్.

అన్ని లక్షలు ఇస్తామన్నా

అన్ని లక్షలు ఇస్తామన్నా

అనసూయ భరద్వాజ్‌ను కొడుకులు తమకు టైం కేటాయించమని కోరడం వల్లే జబర్ధస్త్ మానేసిందని తాజాగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆమె షో నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిన సమయంలో మల్లె మాల టీమ్ అనసూయకు రెమ్యూనరేషన్ కొన్ని లక్షలు పెంచుతామని ఆఫర్ ఇచ్చారట. అయినప్పటికీ ఆమె మాత్రం తన పిల్లలకే ప్రాధాన్యం ఇచ్చి తప్పుకుందని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X