Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బ్రహ్మానందం, టీవీ యాంకర్లు ఇళ్లపై ఐటీ దాడులు
ఐటీ దాడులు చోటుచేసుకున్న సమయంలో సుమ రామోజీ ఫిలింసిటీలోను, సునిత తిరుపతిలోను, గీతామాధురి ఒక మ్యూజికల్ నైట్ షో నిమిత్తం అబుదాబీలోను ఉన్నట్లు తెలిసింది. ఉదయభాను ఇంటికి ఐటీ అధికారులు వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నట్లు సమాచారం. ఇటీవల కుమారుడు వివాహం చేసిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన ఇంటి మీద ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలుసుకుని షూటింగ్ నుంచి ఇంటికి చేరుకున్నారు. బుల్లితెరపై తన హవాను సాగిస్తూ, 'జీనియస్' సినిమాతో ఇటీవల దర్శకుడైన ఓంకార్... ఆదాయపు పన్ను అధికారులు తన ఇంటి మీద, కార్యాలయం మీద దాడులు జరిగినప్పుడు సినిమా కార్యాలయంలో ఉన్నట్లు తెలిసింది.
ఐటీ రిటర్న్స్ సరిగా చెల్లించడంలేదన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది. పన్ను ఎగవేతల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. ఐటీ అధికారులు ఇంతకాలం సినీ నటీనటులు, నిర్మాతలపైనే దృష్టిపెట్టారు. ఈ మధ్య కాలంలో యాంకర్స్, టీవీ నటుల ఆదాయం కూడా బాగానే పెరిగిందని, పన్ను మాత్రం చాలా తక్కువగా చెల్లిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సేకరించారని తెలిసింది. సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు 2011-12 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్లో చూపించిన ఆదాయం, చెల్లించిన పన్నును పరిశీలించారు.
ఐటీ రిటన్స్ లో చూపించిన ఆదాయానికి మించి ఆస్తులు, సంపాదన ఉన్నట్టు గుర్తించిన అధికారులు కొంతమంది రికార్డులు పరిశీలించారు. వారి ఆదాయ మార్గాలను కూడా గుర్తించి, పూర్తి సమాచారంతో గురువారం పలువురు సినీ, టీవీ ప్రముఖుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఇందుకోసం 40 మంది ఐటీ అధికారులతో 20 ప్రత్యేక బృందాలు ఏర్పడినట్టు తెలిసింది.
ఇక ఈ దాడులు గురువారం అర్ధరాత్రి దాటేవరకు సోదాలు కొనసాగాయి. ఐటీ రిటన్స్ లో పోల్చి చూసినప్పుడు కొంతమంది వద్ద ఆస్తులకు సంబంధించిన రికార్డులు సరిగాలేవని వెల్లడయింది. కొంతమంది యాంకర్లు ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, సినిమా విజయోత్సవాలకు యాంకరింగ్ చేస్తూ, పలు ప్రారంభోత్సవాలు, కార్యక్షికమాలకు సెలబ్రిటీస్ గా వెళ్లి లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నారని ఐటీ అధికారులు గుర్తించారు. టీవీల్లో కూడా కొన్ని కార్యక్షికమాలు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారని, ఐటీ రిటర్న్ లో మాత్రం ఆదాయం కొద్దిగానే చూపిస్తూ పన్ను ఎగవేస్తున్నారని తెలిసింది. హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఈ మధ్య కాలంలో తన నటనకు పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు.