Don't Miss!
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మానవ జాతి అంతమవ్వడానికి కారణమిదే.. యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్
బుల్లితెరపై యాంకర్ అనే పదానికి సరికొత్త అర్ధాన్ని చెప్పిన ముద్దుగుమ్మల్లో రష్మీ గౌతమ్ ఒకరు. హీరోయిన్స్ రేంజ్ లో గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే ఈ బ్యూటీ అప్పుడప్పుడు సినిమాల్లో బోల్డ్ గా నటిస్తూ అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక ఇంటర్వ్యూలలో కూడా రష్మీ అదే తరహాలో బోల్డ్ కామెంట్స్ తో షాకిస్తుంటుంది. ఎలాంటి రూమర్స్ వచ్చినా వాటికి ఎండ్ కార్డ్ పడేలా రష్మీ కరెక్ట్ గా కౌంటర్ వేస్తోంది.
సోషల్ మీడియానే ఆయుధం..
తారలు చాలా వరకు సోషల్ మీడియానే వారి ప్రధాన ఆయుధంగా మార్చుకొని రూమర్స్ పై క్లారిటీ ఇస్తుండడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇక సామాజిక అంశాలపై అలాగే రూమర్స్ పై కూడా ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్స్ చేస్తుండడం తెలిసిందే. రష్మీ కూడా అప్పుడప్పుడు కాంట్రవర్సీలపై తనదైన శైలిలో కామెంట్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యేలా చేస్తుంటుంది. ఆమె ప్రధాన ఆయుధం కూడా సోషల్ మీడియానే..
టిక్ టాక్ వీడియోపై అగ్రహం..
టిక్ టాక్ వచ్చిన తరువాత మనుషుల జీవన శైలిలో ఊహించని మార్పులు వచ్చాయనే చెప్పాలి. లైకుల కోసం ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్ గా ఒక వ్యక్తీ పోస్ట్ చేసిన వీడియోపై కూడా రష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూగ జీవిని హింసించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అతనిపై పిర్యాదు కూడా చేసింది.
అందుకే మనిషి బ్రతుకు అంతరించిపోతోంది..
టిక్ టాక్ వీడియోపై ఆగ్రహం చెందిన రష్మీ తనదైన శైలిలో ఒక స్ట్రాంగ్ లైన్ తో అందరిని ఆలోచించేలా చేసింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఒక వ్యక్తి కుక్కను నీళ్ళల్లో పడేసి దారుణంగా ప్రవర్తించాడు. ఆ మూగజీవి కష్టపడి ఎలాగోలా ఒడ్డుకైతే చేరుకుంది. ఆ సన్నివేశాన్ని వీడియో తీసి అతను టిక్ టాక్ లో పోస్ట్ చేయగా.. రష్మీ ఆ వీడియోని పోస్ట్ చేసి.. ఇందుకే కదా.. మానవ జీవితం అంతరించిపోతోంది అని కామెంట్ చేసింది.
Recommended Video
నెటీజన పై కంప్లైట్..
మూగజీవిపై అమానుష ప్రవర్తనకు రష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ట్విట్టర్లో ద్వారా పిర్యాదు కూడా చేసింది. జంతు ప్రేమికురాలైన బిజెపి నేత మేనకా గాంధీని ట్యాగ్ చేస్తూ వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని వివరణ ఇచ్చింది. ఈ విషయంలో నెటీజన్స్ రష్మీ చేసిన కామెంట్ కి మద్దతు పలుకుతున్నారు.