Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
రష్మీ, సుధీర్ల వీడియో చూశాం.. అది నిజమేనా అని అడిగారు: జబర్ధస్త్ అప్పారావు షాకింగ్ కామెంట్స్
ప్రముఖ చానెల్లో ప్రసారం అయ్యే కామెడీ షో 'జబర్ధస్త్' ద్వారా ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోందీ షో. అందుకే 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ షో ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో అప్పారావు ఒకరు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఈయన ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ దక్కని గుర్తింపు 'జబర్ధస్త్'లో చేసిన తర్వాత దక్కింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.
జబర్ధస్త్లోకి వచ్చిన తర్వాతే..
తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయన్న విషయంపై స్పందిస్తూ.. ‘నేను జబర్ధస్త్కు రాక ముందు సుమారు 50 సినిమాల్లో నటించాను. అప్పుడు నన్ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ, షోకు వచ్చిన తర్వాత దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించాను. ఏ వేషం ఉన్నా నాకు ఫోన్ చేస్తున్నారు' అని అప్పారావు చెప్పుకొచ్చారు.
గ్లామర్ ఎంత ఉంటే రూమర్ అంత ఉంటుంది
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ సహజం అని అప్పారావు అన్నారు. ‘ఇది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఎంత ఉంటుందో.. రూమర్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. వందేళ్ల క్రితం నుంచి ఇలాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అనడం మనకు తెలిసిందే. వాస్తవాలు ఏవైతే ఉన్నాయో.. అవి మీరు ప్రత్యక్షంగా చూడండి. మీకు భగవంతుడు ఇచ్చిన కళ్లతో చూడండి. వాస్తవాలు మాట్లాడండి' అని ఆయన కోరారు.
సుధీర్, రష్మీ పెళ్లి గురించి..
ఆ మధ్య రష్మీకి, సుధీర్కు వివాహం జరిగినట్లు వచ్చిన ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ.. ‘అహానా పెళ్లంట అనే ఒక ప్రోగ్రాం ఉంది. దాన్ని క్రియేట్ చేసి సుధీర్ గారికి, రష్మీ గారికి పెళ్లని పెట్టారు. ఆ ఎపిసోడ్ కోట్లాది మంది చూశారు. హై రేటింగ్స్ వచ్చాయి. ఆ సమయంలో కొంత మంది నాతో.. ఏమండీ రష్మీకి, సుధీర్కు పెళ్లి అయిపోయిందా అని అడిగారు' అని చెప్పుకొచ్చారు.
వాళ్లను చూసి షాకయ్యాను
వాళ్లు అడిగింది చూసి షాకయ్యానన్న అప్పారావు.. ‘అదేంటి వాళ్లిద్దరికి పెళ్లి అవడం ఏంటి..? అంటే మొన్న షోలో చూశామని చెప్పారు. మీరు షో పూర్తిగా చూశావా అని అడిగాను. లేదంటి మొత్తం చూడలేదు అన్నారు. మరి మొత్తం చూడాలి కదా. అది ఒక కల. కలలో జరిగినటువంటి అద్భుతమైన పెళ్లి. వాళ్లిద్దరికీ అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి, డైరెక్టర్లు ఒక కథ అల్లారు. ఆ కథ సారాంశమే ఆహానా పెళ్లంట. కాబట్టి ఎవరైనా చూసి మాట్లాడితేనే బాగుంటుంది' అని పేర్కొన్నారు.
గుర్తింపు తెచ్చిన సినిమాలు
అప్పారావుది విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం గ్రామం. పీయూసీ పూర్తిచేసి అనంతరం సినిమా రంగంలోకి ప్రవేశించిచారు. తన తొలిగురువు ఎల్ సత్యానందం మాస్టారు. ఆయనకు బీవీ రమణ దర్శకత్వంలో ‘శుభవేళ' తొలి చిత్రం. ఆ తర్వాత ఆయనకు ‘గోపి.. గోపికా గోదావరి', ‘వేదం', ‘నేనింతే', ‘శ్రీఆంజనేయం', ‘చందమామ', ‘మనం', ‘మినుగురులు' గుర్తింపును ఇచ్చాయని ఈ సందర్భంగా వెల్లడించారు.