Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Jabardasth కమెడియన్ కన్నుమూత.. చివరి వరకు ప్రాణంతో పోరాడుతూ..
బుల్లితెరపై ఎంతగానో నవ్వించిన ఒక ప్రముఖ కమెడియన్ ఇటీవల కన్నుమూయడం బుల్లితెర అభిమానులను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందే. అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఎంతో సంతోషంగా కొనసాగినా కమెడియన్ ఆ విధంగా మరణించడం ఇతర కమెడియన్స్ ను కూడా కంటతడి పెట్టించింది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా పలు టెలివిజన్ షోలలో అలాగే స్టేజ్ షో లతో కూడా ఎంతోమందిని ఆకట్టుకున్న ఆ ప్రముఖ నటుడు మరెవరో కాదు. మిమిక్రీ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న మూర్తి. అతను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రోజు తుది శ్వాస విడిచాడు.
మొదట వివిధ రకాల స్టేజ్ షోలతో మిమిక్రీ ఆర్టిస్టుగా జనాల్లో మంచి క్రేజ్ అందుకున్న మూర్తి ఆ తర్వాత టెలివిజన్ షోలలో కూడా అవకాశాలను అందుకున్నాడు. ఇక అటువైపు నుంచి జబర్దస్త్ లో కూడా కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించాడు. ఇతర టీం సభ్యులతో కూడా అతను ఎంతో సన్నిహితంగా కొనసాగుతూ జబర్దస్త్ లో వీక్షకులను నవ్వించాడు. అయితే అలాంటి నవ్వు వెనక ఎంత విషాదం కూడా ఉంది అని అతను పలుమార్లు వివరణ ఇచ్చాడు.
కమెడియన్ గా కొనసాగుతున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడినట్లు చెప్పిన మూర్తి వైద్యం కోసం చాలా ఖర్చు చేసినట్లుగా చెప్పాడు. ఇంతకాలంగా సంపాదించుకున్న చాలా డబ్బు కూడా వైద్యం కోసమే ఖర్చుపెట్టినట్లు చెబుతూ దాదాపు 16 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలియజేశాడు. అయితే ఈ క్రమంలో తన పరిస్థితి గురించి తెలుసుకున్న చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఆర్థికంగా సహాయం చేశారని కూడా గతంలో మూర్తి తెలియజేశాడు. ఇక మూర్తి మరణం పై జబర్దస్త్ కమెడియన్స్ అలాగే మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా అతని ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు స్పందిస్తున్నారు.