Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Sudigali Sudheer ఇంట్లో విషాదం...చివరి చూపు కూడా దక్కలేదు...కామెడీ షోలో ఏడుస్తూ...!
సుడిగాలి సుధీర్ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎంతగానో కష్టపడి టాప్ టీవీ కమెడియన్ గా హోస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇటీవల సుధీర్ ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకుంది. ఇష్టమైన వారు మరణించడంతో ఈ కమెడియన్ కనీసం చివరి చూపులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఎదురయ్యింది. ఆ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ
నచ్చిన ప్రొఫెషన్ లోనే..
జబర్దస్త్ లోకి రావడానికి ముందు సుధీర్ ఒక మ్యూజిషియన్ గా ట్రిక్స్ తో జనాలను అమితంగా ఆకట్టుకునేవాడు. ఉన్నతమైన విద్యాభ్యాసం చేసినప్పటికీ తనకు నచ్చిన ప్రొఫెషన్ లోనే కొనసాగాలని అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి కామెడీతో పాటు మ్యాజిక్ కూడా నేర్చుకున్నాడు.
కష్టపడి సోలోగా..
అనేక ఈవెంట్స్ లలో మ్యాజిక్ చేసిన సుధీర్ అనంతరం జబర్దస్త్ లో చేరాడు. వేణు టీమ్ లోనే ఒక చిన్న కమెడియన్ గా చేస్తూ వచ్చిన సుధీర్ అనంతరం కష్టపడి సోలోగానే స్క్రిప్ట్స్ రాస్తూ వచ్చాడు. చివరకు టీమ్ లీడర్ వరకు వచ్చాడు. జబర్దస్త్ మొత్తంలో ఎక్కువసార్లు ఎపిసోడ్స్ విన్నర్స్ గా నిలిచిన వారిలో సుడిగాలి సుధీర్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
శ్రీదేవి డ్రామా కంపెనీతో..
ఇక ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీతో కూడా మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. మల్లెమాల ప్రొడక్షన్ లో ఈటీవీలో ప్రసారం అవుతున్న ఆ షోలో రామ్ ప్రసాద్, హైపర్ ఆది వంటి కమెడియన్స్ కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాప్ కామెడీ షోలతో అది కూడా ఒకటి.
అమ్మమ్మ మరణించడంతో..
అయితే ఇటీవల సుడిగాలి సుధీర్ ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకుంది. సుధీర్ అమ్మమ్మ కరోనా కారణంగా మరణించారు. అయితే కడసారి చూడడానికి కూడా పరిస్థితులు అనుకూలించేందు. ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో రామ్ ప్రసాద్ ఆ విషయాన్ని చెప్పాడు.
Recommended Video
కంటతడి పెట్టిన సుధీర్
అమ్మమ్మ చనిపోయిందని తెలిసి సుధీర్ చాలా బాధపడ్డాడు అని చెబుతూ.. వెళ్లాలని ఉన్నా వెళ్లలేకపోయినట్లు రామ్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. షోలోనే సుధీర్ కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ గా మారింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ప్రత్యేక అతిధులుగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వితో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా షోలో సందడి చేశారు.