జబర్దస్త్ లో మోనాలిసా.. ఆమెపై ఇలా? అర్ధరాత్రి వర్షిణితో.!
తెలుగు ప్రేక్షకలకు ఓవైపు భారీ చిత్రాలు వెండితెరపై అలరిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఆడియెన్స్ కు పసందైన సినిమా రుచులను చూపిస్తున్నారు. ఈ మేరకు వరుస పెట్టి సినిమాలు థియేటర్లోకి వస్తున్న విషయం తెలిసిందే.. ఇక మరోవైపు బుల్లితెర ఆడియెన్స్ లో కూడా ఎప్పటికప్పుడు జోష్ నింపేందుకు టీవీ షోలు జోరుగానే టెలికాస్ట్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా షోలు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక వాటన్నింటికీ మించి 'జబరస్త్ కామెడీ షో' రన్ అవుతూనే ఉంది. ఈ షో ప్రారంభమై పదేళ్లు పది పన్నెండేళ్లు దాటినా ఇంకా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అంటే.. జబర్దస్త్ కామెడీ షోకు ఎలాంటి డిమాండ్ ఉందో.. ప్రేక్షకుల నుంచి ఎంతటి ఆదరణకు నోచుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సక్సెస్ ఫుల్ కామెడీ షో నుంచి ప్రతి వారం రెండు ఎపిసోడ్స్ విడుదలవుతుంటాయి. ఈ కామెడీ షోకు నటుడు, బిగ్ బాస్ శివాజీ మేల్ జడ్జీగా వ్యవరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫీమేల్ జడ్జీగా హీరోయిన్, సీనియర్ నటి ఖుష్బూ తీర్పు ఇస్తున్నారు. కమెడియన్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక ఇమ్మాన్యుయేల్, రామ్ ప్రసాద్, చలాకి చంటి, యాదమ్మ రాజు, తాగుబోతు రమేశ్, బుల్లెట్ భాస్కర్ వంటి వారు తమ స్కిట్లతో అలరిస్తూనే వస్తున్నారు. కొత్తకొత్త స్కిట్లతో ఆడియెన్స్ ను మరింతగా నవ్విస్తున్నారు. అసలే పనిఒత్తిడి పెరుగుతున్న ఈకాలంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ లు ఫన్ పిల్ లా తమ స్కిట్లను అందిస్తున్నారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.

అయితే.. ప్రతివారం విడుదలయ్యే జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ పై ఎంతో ఆసక్తిని పెంచుతుంటుంది. ఇక ఫిబ్రవరి 14, 15న ఈటీవీ తెలుగులో ప్రసారం కాబోతున్న జబర్దస్త్ కామెడీ షో ఫుల్ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోను టీమ్ విడుదల చేసింది. ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. వరుస స్కిట్లతో ఆర్టిస్టులు ఇరగదీశారనే చెప్పాలి. పంచులు, ప్రాసలతో ఆడియెన్స్ కు కొత్త జోష్ ఇచ్చేందుకు ప్రయత్నించారని ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇక ఎప్పటి లాగే ఈ ప్రోమోలో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ను కూడా జోడించారు.
మహాకుంభ మేళా 2025లో ఫేమస్ అయిన మోనాలిసా.. జబర్దస్త్ వేదికపై కనిపించబోతోంది. అంటే.. ఆమె ప్రత్యేక్ష రాదండోయ్.. ఆమె రెఫరెన్స్ గా జబర్దస్త్ వర్షిణి అలరించబోతోంది. మోనాలిసా ఆహార్యంతో ఆకట్టుకునేందుకు ఇమ్మాన్యుయేల్ స్కిట్ సిద్దంగా ఉంది. వర్షిణితో జడ్జీ శివాజీ అర్ధరాత్రి అంటూ.. మరింత ఆసక్తిని పెంచేశారు. ఇక మోనాలిసాను ప్రయాగ్ రాజ్ లో పర్యాటకులు ఎంత ఇబ్బందిపెట్టారో తెలిసిందే. సెల్ఫీల కోసం అర్ధరాత్రి కూడా ఆమె గుడారానికి వెళ్లి విసిగించిన వార్తలు చదివాం. ఆమె వీడియోలు ఎన్ని కోట్లు పెట్టిన వైరల్ విధంగా సోషల్ మీడియాలో నిండిపోయాయని తెలిసిందే.
ఓవర్ నైట్ లో దేశమంతంటి చూపును తనవైపు తిప్పుకున్న మోనాలిసా రిఫరెన్స్ ను జబర్దస్త్ వేదికపై ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆమె ఇప్పటికే 'ది డైరీ ఆఫ్ మణిపూర్' చిత్రంలో నటించబోతోంది. రూ.21 లక్షల రెమ్యునరేషన్ కూడా తీసుకోబోతుందని ప్రచారం. సోషల్ మీడియా పుణ్యమా అని కడుపేదరికాన్ని అనుభవిస్తున్న ఆమె కుటుంబం గట్టున పడినట్లే అంటున్నారు.


Click it and Unblock the Notifications











