Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జగన్ పాదయాత్రకి వెళ్లడం వల్ల జబర్దస్త్ నుంచి పక్కన పెట్టారు: శాంతి స్వరూప్
Recommended Video
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు ఏపీలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్న కారణంగా జబర్దస్త్ కమెడియన్లు శాంతి స్వరూప్, వినోద్లను స్కిట్ల నుంచి తీసివేసినట్లు రూమర్లు వినిపించాయి. ఈ రూమర్లపై శాంతి స్వరూపం తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
మేము జగన్ గారి పాదయాత్రకు వెళ్లిన మాట నిజమే, కానీ ఆ పాదయాత్రకు, మమ్మల్ని పక్కన పెట్టడానికి సంబంధం లేదు. మేము అపుడు జబర్దస్త్ మానేసి వెళ్లాం. మాకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చినపుడు మేము దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు తెలియని తత్వంతో నేను, వినోద్ వాళ్లు పిలిచారు కదా అని వెళ్లిపోయామని శాంతి స్వరూప్ తెలిపారు.
అందుకే పనిష్మెంట్ ఇచ్చారు
మేము వెళుతున్న విషయం టీమ్ లీడర్లకు కూడా చెప్పాం, వారు మేనేజ్ చేయలేక పోయారు. డైరెక్షన్ డిపార్టుమెంటుకు మాపై కోపం లేదు కానీ ఇంకొకరు ఇలా చేయకూడదు అని మాకు మూడు నెలలు పనిష్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకుని స్క్రిట్లు రాసుకున్నపుడు ఇలా వదిలేసి వెళ్లడం తప్పు అని మేము తెలుసుకునేలా చేశారని తెలిపారు.
ఆ విషయం నిజం కాదు
మేము చేసిన పొరపాటును మేము కూడా సరిదిద్దుకోవాలనుకున్నాం. ఆ మూడు నెలలు మేము అందరితో టచ్లోనే ఉన్నాం. కానీ బయట మా గురించి ఏవేవో అనుకున్నారు. జగన్ గారి గురించి మాట్లాడటం వల్లే తీసేశారు అని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని శాంతి స్వరూప్ తెలిపారు.
ట్రాన్స్ జెండర్స్ అంటే ఎంతో గౌరవం
తమన్నా అనే ట్రాన్స్జెండర్ జబర్దస్త్లో అందరినీ చెప్పుతో కొడతాను అని ఎందుకు అన్నారు? అనే ప్రశ్నకు శాంతి స్వరూపం స్పందిస్తూ.... తనకు తమన్నా అంటే ఎవరో తెలియదన్నారు. ట్రాన్స్ జెండర్స్ అంటే నాకు ఎంతో గౌరవం. మా జబర్దస్త్లో కూడా సాయి అనే వ్యక్తి లేడీగా మారారు. తన కష్టమేదో తాను పడుతున్నాడు. తమన్నా లాంటి వారు సర్జరీలు చేసుకుని ఆడవారిగా మారిపోయినా గుర్తింపు లేదే అని వల్గారిటీగా హైప్ అవ్వడం కోసం ఇలాంటి పిచ్చివాగుడు వాగుతుంటారు.. అని శాంతి స్వరూప్ తెలిపారు.
నేను తిరిగి చెప్పుతో కొట్టగలను
మమ్మల్ని ఎందుకు చెప్పుతో కొట్టాలి? ఆమె అలా ఎందుకన్నారో తెలియదు, ఎవరైతే ఈ మాట అన్నారో వారికి చెప్పేది ఒకటే. మేము లేడీసా? జంట్సా? అనేది గురువారం, శుక్రవారం చూసే కోట్ల మందికి తెలుసు. మేము బేసిగ్గా జంట్సే అయినా లేడీ గెటప్స్ వేస్తున్నాం. మీలా సర్జరీలు చేసుకుని హైప్ అవ్వడం కోసం ప్రయత్నించడం లేదు. మమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేస్తే ఊరుకోం. లేడీ గెటప్ వేసే వారిని కించపరిచే విధంగా మాట్లాడితే మీరు కొడతానన్న చెప్పుతోనే తిరిగి కొడతాను... అని శాంతి స్వరూప్ హెచ్చరించారు.