అతనితో జబర్దస్త్ వర్ష ఎఫైర్... ఇమ్మానుయేల్ ముందే మితిమీరిన రొమాన్స్
బుల్లితెర ఆడియెన్స్ ను 'జబర్దస్త్' కామెడీషో ఎంతగానో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది ఆరిస్ట్ లు షైన్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వెలుగులోకి వస్తూనే ఉన్నారు. ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ షో ద్వారా వేణు, ధన్ రాజ్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ వంటి ఆర్టిస్టులు సెలబ్రెటీలుగా మారిన సంగతి తెలిసిందే. ఇక యాంకర్ గా అలరించిన అనసూయ, రష్మీ గౌతమ్ ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ టాలెంట్ తో కెరీర్ లో దూసుకుపోతున్నారు. బుల్లితెర ఆడియెన్స్ ను కూడా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నారు.
అయితే, ఈ షోద్వారానే నటి వర్ష, ఇమ్మాన్యుయేల్ కూడా మంచి పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తమ టాలెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు తమకంటూ స్పెషల్ ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం సెలబ్రెటీలుగా బుల్లితెరపై వెలుగొందుతున్నారు. ఇక ఇమ్మాన్యుయేల్ అయితే టీమ్ లీడర్ గా క్రేజీ కంటెంట్లతో ఆడియెన్స్ ను అలరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే స్కిట్లకు కూడా బొలేడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ జంట కామెడీ స్కిట్లకు సేపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.

అయితే, జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ పేయిర్ లో వచ్చే స్కిట్స్ బాగా పండుతుండటం విశేషం. తమ నటన, ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు కూడా ఫిదా అయ్యారు ఫ్యాన్స్. అయితే తమ స్కిట్ల ప్రభావంతో వీరిద్దరి మధ్య రియల్ గానే సంథింగ్, సంథింగ్ అంటూ ప్రచారం జరిగింది. కొన్నాళ్లుగా ఈ తంతు సాగుతూనే ఉంది. వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ కూడా రూమర్లు పుట్టుకొచ్చాయి. పలు ఇంటర్వ్యూల్లోనూ తాము మంచి స్నేహితులనే ఎన్నో మార్లు వివరించారు. అయినా ఆ రూమర్లు ఆగడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా వర్ష, డ్యాన్సర్ పండుతో కలిసి రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.
జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రొమో తాజాగా విడుదలైంది. ఆ ప్రోమోలో టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు తమ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. కాగా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ స్కిట్ హైలెట్ గా మారింది. లేటెస్ట్ స్కిట్ లో వర్ష, పండుతో కలిసి తెగ రొమాన్స్ చేసింది. ఇమ్మాన్యుయేల్ ముందే డ్యాన్సర్ పండుతో క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపించింది. అందుకు ఇమ్మాన్యుయేల్ వారిని ఆశీర్వదిస్తూ కూడా తన బాధను వ్యక్తం చేశాడు. అయితే ఇదంతా లేటెస్ట్ జబర్దస్త్ స్కిట్ లో హైలెట్ గా నిలిచింది. ఇక ఫుల్ ఎపిసోడ్ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మార్చి 21, 22న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫుల్ ఎపిసోడ్ ఈటీవీలో ప్రసారం కానుంది. అయితే..
అయితే, ఇమ్మాన్యుయేల్ - వర్ష జంటగా నటించిన స్కిట్లకు బోలెడన్నీ వ్యూస్ తో పాటు ప్రేక్షకాదరణ కూడా దక్కింది. కాగా లేటెస్ట్ ఎపిసోడ్ లో మాత్రం వర్షతో ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చేసే ఛాన్స్ డ్యాన్సర్ పండుకు అందించాడు ఇమ్మాన్యుయేల్. పైగా తన స్కిట్ల తీరు కూడా కాస్తా బాగుండటం లేదని అభిమానులు తమ అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇమ్మాన్యుయేల్ రాబోయే ఎపిసోడ్ లో హైలెట్ స్కిట్ ను ప్రదర్శించబోతున్నారని తెలుస్తోంది. బుల్లెట్ భాస్కర్, రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవ, నూకరాజు, యాదమ్మరాజుల టీమ్స్ కూడా అదిరిపోయే స్కిట్స్ ను ప్రదర్శించనున్నాయి.


Click it and Unblock the Notifications











