జబర్దస్త్ వర్ష రూమ్ లో అలాంటి కేకలు.. తన గదిలో ఉన్నది ఎవరు?
తెలుగు ప్రేక్షకులకు నూటికి నూరు శాతం కామెడీ అందిస్తున్న ఏకైక షో జబర్దస్త్. 2013 నుంచి ఈ కామెడీ షో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది ఆర్టిస్టులు ఈ వేదికపై తమ ప్రతిభను చాటుకుని సెలబ్రిటీలుగా మారిన సంగతి తెలిసిందే. ప్రతివారం కంటెస్టెంట్లు కొత్త కొత్త కామెడీ స్కిట్లతో అలరించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో జబర్దస్త్ వర్ష నటించిన స్కిట్ కాస్త ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఆర్టిస్టులను స్టార్ లుగా మార్చిన ఘనత..
టెలివిజన్ ఆడియన్స్ దశాబ్ద కాలంగా అలరిస్తున్న కామెడీ షో 'జబర్దస్త్'. ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, రష్మి గౌతమ్, అనసూయ లాంటివారు ఎంత పాపులర్ అయ్యారో తెలిసింది. నార్మల్ స్థాయి నుంచి స్టార్ లు ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొత్త వారికి ఈ సంస్థ అవకాశం అందిస్తూనే ఉంది. జబర్దస్త్ షో ప్రారంభం నుంచి ఉన్న వాళ్లు కూడా తన స్కిట్లతో ఇప్పటికీ అలరిస్తున్నారు.

ఫన్ రైడ్ గా లేటెస్ట్ ప్రోమో..
తాజాగా జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. తాజా ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఫన్ రైడ్ తో కూడిన ప్రోమోను రిలీజ్ చేశారు. కమెడియన్లు సద్దామ్ హుస్సున్, బుల్లెట్ భాస్కర్, ప్రవీణ్, తాగుబోతు రమేశ్, ఆటో రాం ప్రసాద్, రాకెట్ రాఘవ, కెవ్వు కార్తీక్ వంటి టీమ్ లీడర్లు తమ స్కిట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సరికొత్త కామెడీని పంచేందుకు సిద్దంగా ఉన్నారు.
జబర్దస్త్ వర్ష రూమ్ లో కేకలు..
లేటెస్ట్ ప్రోమోలో జబర్దస్త్ వర్షకు సంబంధించిన స్కిట్ ఆసక్తికరంగా మారింది. బుల్లెట్ భాస్కర్, నరేశ్, వర్ష ముగ్గురు కలిసి చేసిన కామెడీ కడుపుబ్బా నవ్వించేలా ఉందని తెలుస్తోంది. అయితే ప్రోమోలో వర్ష తన గదిలో కేకలు వినిపిస్తున్నాయని, తన సరైనా గదిని ఇవ్వలేదని అంటూ బుల్లెట్ భాస్కర్ పై అరుస్తుంది. ఈ సందర్భంగా నరేశ్ వర్షపై కాస్తా ఘాటైన పంచులు పేల్చడం ఫుల్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. వర్ష, బుల్లెట్ భాస్కర్, నరేష్ ఎలాంటి స్కిట్ ను ప్రదర్శించారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే సద్దామ్ హుస్సేన్, రాకెట్ రాఘవా స్కిట్లు కూడా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి.
లేటెస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చూడాలి..
ప్రతి శుక్ర, శని వారాల్లో జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్స్ ఈటీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్స్ మే 30న, మే31న ఈటీవీలో రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఈ షోలకు యంగ్ బ్యూటీ రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తోంది. సీనియర్ నటి ఖుష్బూ లేడీ జడ్జీగా, నటుడు శివాజీ మేల్ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఇక వర్ష ఇటు జబర్దస్త్ కామెడీ షోలో నటిస్తూనే మరోవైపు కిస్సిక్ టాక్స్ అనే షోకు హోస్ట్ గానూ వ్యవహరిస్తోంది.


Click it and Unblock the Notifications











