Janaki Kalaganaledu January 13th: మల్లిక కఠినమైన మాటలు.. భర్త కోసం బాధను బరిస్తున్న జానకి
జానకి కలగనలేదు సీరియల్ మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది. తమ్ముడు అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు అందరిని ఇబ్బందుల్లో పడేస్తుంది. అయితే ఆ సమస్యల వలన రామ భార్య జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 477 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

రామపై కోపంగా..
రామచంద్ర చేసిన కారణంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వెళ్లి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పు ఇచ్చిన భాస్కరరావు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని డబ్బు కట్టిన తర్వాతనే మళ్లీ ఇంటిని తిరిగి ఇస్తామని చెబుతారు. దీంతో జ్ఞానాంబ చేసేది ఏమి లేక కట్టుబట్టలతో వాళ్లను అందరిని కూడా బయటకు తీసుకువెళుతుంది. ఇక రామచంద్ర పై ఆమె కోపంగా ఉంటుంది. ఒక్క మాట కూడా తమకు చెప్పకపోవడంతో ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది అని ఇంట్లో వాళ్ళు మల్లిక కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తుంది. అలాగే మల్లికా ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్లి పోదామా అని అనుకుంటుంది. కానీ కుటుంబం మొత్తం కూడా కలిసి ఉండాలి అని జ్ఞానాంబ గోవిందరాజులు కోరుకుంటారు.

మీరు చేసిన తప్పును ఎందుకు బాధపడాలి
ఇక బయట అద్దె ఇంట్లోకి వచ్చిన తర్వాత మా ఇంట్లో పనులు అన్నీ కూడా జానకి దగ్గర ఉండి చూసుకుంటుంది కానీ మళ్ళీ ఆమె మాత్రం ఏ పని చేయకుండా ఉంటుంది. అంతేకాకుండా తనకు పాలు కావాలి అని అడుగుతూ ఉంటుంది. ఇక జానకి మల్లిక కోసం ప్రత్యేకంగా పాలు తీసుకువెళ్లి ఆమెకు ఇస్తుంది. అంతేకాకుండా ఆమెకు సరైన బుద్ధి కూడా చెప్పాలని అనుకుంటుంది. అయితే మల్లిక మాత్రం జానకి మాటలు పట్టించుకోకుండా పొగరుగానే మాట్లాడుతుంది. అసలు మీరు చేసిన తప్పుకు మేము ఎందుకు బాధపడాలి అని మీ వల్ల ఈరోజు కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చింది అని మల్లికా మరింత కఠినంగా మాట్లాడుతుంది.

బాధ ఉన్నా సరే..
ఇక మల్లిక మాట్లాడిన మాటలకు జానకి మరింతగా బాధపడుతుంది. ఇంట్లో అత్తమామలు కూడా దీనంగా కూర్చుని ఉండడంతో జానకి ఆలోచనలో పడుతుంది. అలాగే రామచంద్ర కూడా బాధపడుతూ ఒక దగ్గర నిలుచొని ఉంటాడు. ఇక అందరూ బాధపడుతూ ఉండగా ఈ సమయంలో తాను కూడా బాధపడితే బాగుండదు అని జానకి ఇంట్లో పనులన్నీ చకచకా చేస్తూ ఉంటుంది. అత్త మామలకు మొదట కాఫీ ఇవ్వాలని అనుకున్న జానకి మళ్లీ తను ఇస్తే తీసుకోరు అని అనుకొని పనిమనిషి చేత పంపిస్తుంది. ఇక అందరినీ భోజనానికి పిలవాలని కూడా ఆమె అనుకుంటూ ఉంటుంది.

జెస్సి ద్వారా పిలిపించిన జానకి
అయితే మొదట జ్ఞానంభ గోవిందరాజులు ఇద్దరు కూడా ఇప్పుడే మాకు తినాలని లేదు అని అంటారు కానీ జెస్సీ ద్వారా జానకి అత్త గారిని పిలుచుకురావాలని చెబుతుంది. ఇక అందరూ కూడా కిచెన్ లోకి వచ్చి తినాలని అనుకుంటారు. మరోవైపు మల్లికా మాత్రం ఇదే మా అమ్మ గారి ఇంట్లో ఉంటే నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తిని ఉండే దానిని అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఆ తర్వాత జ్ఞానాంబ తన భర్తకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక అందరూ భోజనం చేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే జానకి రామచంద్ర ఇద్దరు కూడా కిచెన్ లోని పండుకొని ఉంటారు. ఇక వారు పడుకునే సమయంలో ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు.

భర్తకు అండగా జానకి
ముఖ్యంగా రామచంద్ర అయితే తన కారణంగానే ఈరోజు మీకు అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక జానకి మాత్రం అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అని అప్పుడే మనం ధైర్యంగా కలిసికట్టుగా ఉండాలి అని చెబుతోంది. అలాగే మరోవైపు తల్లి జ్ఞానాంబ గోవిందా గోవిందరాజులు ఇంట్లో పరిస్థితులను చూసి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇలా అవుతుందని అనుకోలేదు
ముఖ్యంగా జ్ఞానాంబ అయితే ఎంతో గౌరవంగా బ్రతికిన వాళ్ళము ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని అనుకోలేదు అని అంటుంది. కానీ గోవిందరాజులు మాత్రం ఆమెకు మరింత ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. రామచంద్ర ఏదో ఒకటి చేస్తాడులే అంటూ ఆమెకు భరోసా ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఉదయాన్నే మళ్ళీ ఎప్పటిలానే జానకి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటుంది. ఇక ఆమె టిఫిన్ రెడీ చేస్తూ ఉండగా అప్పుడే రామచంద్ర వచ్చి త్వరగా నాకు టిఫిన్ పెట్టండి షాప్ కు వెళ్లాలి అని అంటాడు. కానీ షాప్ మాత్రం అప్పుల వాళ్ళు తీసుకున్నారు అనే విషయాన్ని రామచంద్ర గ్రహించలేక పోతాడు. సడన్ గా ఆ విషయం గుర్తుకు రాగానే బాధపడుతూ ఉంటాడు. మరి ఈ పరిస్థితులను దాటి జానకి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











