Don't Miss!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
Janaki Kalaganaledu January 17th: మరింత దీనంగా జ్ఞానాంబ కుటుంబ పరిస్థితి.. పని వేటలో రామ, జానకి!
జానకి కలగనలేదు సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు కారణంగా జ్ఞానాంబ ఫ్యామిలీని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇక ఆ సమస్యల వలన రామ భార్య జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 479 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
టాబ్లెట్స్ కోసం..
ఇల్లు తాకట్టులో పోవడం వలన జ్ఞానాంబ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో పడుతుంది. అద్దె ఇంట్లో ఉంటూ చాలీచాలని సరుకులతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆఖరికి మందులు కొనడానికి కూడా డబ్బులు ఉండవు. ఇక జ్ఞానాంబ భర్త గోవిందరాజులు పక్షవాతానికి సంబంధించిన మాత్రలు అయిపోతాయి. వాటిని తీసుకురావాలని జానకి అనుకుంటూ ఉంటుంది. అయితే జానకి తీసుకువస్తాను అని చెప్పినప్పటికీ ఆమె దగ్గర డబ్బులు ఉండవు. ఆ విషయం మర్చిపోతుంది. ఇక మల్లిక భర్త విష్ణుని డబ్బులు అడిగి మాత్రలు తీసుకురావాలని అనుకుంటుంది. అయితే అతన్ని అడగడంతో డబ్బులు లేవు అని అంటాడు.
ట్విస్ట్ ఇచ్చిన విష్ణు
ఇక అప్పుడే మల్లికా వచ్చి డబ్బులు ఎందుకు లేవు అనే విషయం గురించి చెబుతుంది ఉమ్మడి కుటుంబంలో మొదలుపెట్టిన బట్టల షాపు అంతగా నడవడం లేదు అని కాస్త కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడే జ్ఞానాంబ ఏమైంది షాపు ఎందుకు లేదు అని అడుగుతుంది. నా స్నేహితుడు సపోర్ట్ తో మొదలుపెట్టిన ఆ షాప్ కూడా గిరాకీ అంతగా నడవకపోవడంతో మూసేశాను అని అంటాడు. దీంతో అందరూ ఒక్కసారిగా మరింత బాధపడుతూ ఉంటారు. అసలు స్వీట్ షాప్ పోయి బాధలో ఉన్న జ్ఞానాంబ ఇప్పుడు రెండవ కుమారుడు విష్ణు కు సంబంధించిన షాప్ కూడా మూసినట్లు తెలియడంతో మరింతగా షాక్ అవుతుంది.
పని కోసం రామ జానకి
విష్ణు అయితే డబ్బులు లేవు అని చెప్పేస్తాడు. ఇక జానకి ఎలాగైనా తన మామ గారికి మెడికల్ షాప్ కు వెళ్లి టాబ్లెట్స్ తీసుకురావాలని అనుకుంటుంది. బయటకు వెళ్లి ఏదైనా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటుంది. అయితే మరోవైపు రామచంద్ర కూడా బతుకు గడవడానికి ఎక్కడైనా హోటల్లో పని చేయాలని అనుకుంటాడు వంట చేస్తాను అని ఒక హోటల్లో అడుగుతాడు. కానీ వారు ఖాళీ లేదు అని చెబుతారు. ఇంకా అప్పుడే ఒక టీ షాప్ దగ్గర ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హఠాత్తుగా ఒక వేడుకకు వంటలు చేసేవారు రాలేము అని చెప్పడంతో ఆ విషయాన్ని రామచంద్ర తెలుసుకుంటాడు.
అడ్వాన్స్ తీసుకున్న రామ
ఇక వెంటనే వారి దగ్గరికి వెళ్లి నేను వంట చేస్తాను అని నా దగ్గర పని వాళ్లు కూడా ఉన్నారు అని అంటాడు. ఇక తెలియని వారిని ఎలా నమ్మేది అని అతను అడగడంతో నేను జ్ఞానాంబ కొడుకును అని చెప్పడంతో వాళ్ళు గుర్తుపడతారు. ఇక వెంటనే అతను అడ్వాన్స్ ఇచ్చి రేపే పని మొదలుపెట్టాలి అని అంటాడు. ఇక అందుకు రామచంద్ర వారి దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరుతాడు.
స్కూల్లో టీచర్ గా జానకి
ఇక ఈ క్రమంలో మరోవైపు జానకి ఒక స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటుంది. మళ్ళీ కుటుంబ పరిస్థితి నిలదొక్కుకునే వరకు ఒక వైపు తన ఐపిఎస్ చదువును కొనసాగిస్తూనే మరొకవైపు స్కూల్ టీచర్ గా కూడా కంటిన్యూ అవ్వాలని అనుకుంటుంది. ఇక జానకి ఆ తర్వాత అలా వెళుతూ ఉండడంతో మధ్యలో రామచంద్ర కలుస్తాడు. తనకు ఉద్యోగం వచ్చింది అని చెప్పడంతో.. మీరు చదువుకోవాలి అని ఈ పని చేయకండి అని తనకు పని దొరికింది అని రామ అంటాడు. ఇక రామచంద్ర మాటలకు జానకి సంతోషిస్తుంది. అంతేకాకుండా మామయ్య గారికి టాబ్లెట్స్ తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పడంతో వెంటనే రామచంద్ర అందుకు ఆమెకు సహకరిస్తాడు.
జెస్సి తండ్రి అసహనం
ఇక ఇంట్లో అందరూ కూడా ఏదో ఒక విధంగా కష్టపడుతూ ఉండడంతో చిన్న కుమారుడు అఖిల్ మాత్రం ఇంట్లో ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. వెంటనే అతని భార్య జెస్సి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు మీరు మాత్రమే ఖాళీగా ఉన్నారు అని అంటుంది. ఇక వారి మధ్యలో గొడవ జరుగుతూ ఉండగా అప్పుడే ఇంట్లోకి జెస్సీ తండ్రి వస్తాడు. ఇక అతను తన కూతురిని ఇంట్లో నుంచి తీసుకువెళ్లాలని అనుకుంటాడు. అయితే జెస్సి మాత్రం ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నేను రాలేను అని మా అత్తయ్య గారు చెబితే నేను ఇంటికి వస్తాను అని సమాధానం ఇస్తుంది. అయితే జెస్సి తండ్రి ఊహించిన విధంగా జానకి పై కొంత కోపాన్ని వ్యక్తం చేస్తాడు. నువ్వే కదా నా కూతురికి పెళ్లి చేసింది నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మ.. ఈ పరిస్థితి వస్తుంది అని నేను ఊహించలేదు అని అసహనంతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈ పరిస్థితులను దాటించడానికి జానకి ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.