Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Janaki Kalaganaledu April 21st: ఇంకా చల్లారని జ్ఞానాంబ ఆగ్రహం.. మరో ట్విస్టుతో కొత్త కండిషన్!
జానకి కలగనలేదు సీరియల్ మరో కొత్త తరహా ఎమోషన్స్ తో ఆసక్తికరంగా మారుతోంది. జ్ఞానాంబ పెద్ద కోడలు జానకి ఐపీఎస్ కావాలని ఎన్నో కలలు కంటుంది. అందుకోసం జానకి కష్టపడి చదవాలని అని అనుకుంటుంది. కానీ జానకి చదువుకోవడం జ్ఞానాంబకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన చదువును కొనసాగిస్తుంది. భర్త రామచంద్ర నుంచి కూడా ఆమెకి సహకారం కూడా అందుతుంది. అయితే జానకి మంచితనం కారణంగా జ్ఞానాంబ ఆమెకు మరింత దగ్గరవుతుంది. ఆ విషయాన్ని చిన్న కోడలు మల్లిక ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది.
అందుకే ఇద్దరి మధ్యలో ఎదో ఒక గోడవను సృష్టించాలని అనుకుంటుంది. ఇక జానకిపై జ్ఞానాంబకు మెల్లగా కోపం పెరుగుతుంది. ఒక గొడవ కారణంగా కొడుకు కోడల్ని బయటకు పంపిన జ్ఞానాంబ మళ్ళీ ఇద్దరిని ఇంట్లోకి రమ్మని అంటుంది. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం జానకి కలగనలేదు టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 284 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
మళ్ళీ పిలిచిన జ్ఞానాంబ
జానకి అన్నయ్య యోగి కారణంగా జ్ఞానాంబ పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. ఆ కారణంతో జ్ఞానాంబ జానకి పై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రామచంద్ర కూడా చివరికి జానకినే అనుమానించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మల్లిక.. జానకి ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది అని ఎంతో సంతోషంగా ఉంటుంది.
ఇక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా జానకి మాత్రం అందరూ మళ్ళీ ఒకటవ్వాలని ప్రయత్నం చేస్తుంది. అపార్థాలు తొలగి పోవాలి అని కూడా అనుకుంటుంది. ఇక జానకి అనుకున్నట్లుగానే చివరికి మళ్ళీ కొడుకు కోడలిని జ్ఞానాంబ ఇంట్లోకి పిలుస్తుంది.
ఏమాత్రం నచ్చలేదు
జానకి రామచంద్ర మళ్లీ ఇంట్లోకి రాగానే పూర్వవైభవం వచ్చింది అని గోవిందరాజులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తాడు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మల్లిక మాత్రం సంతోషంగా ఉండదు.
జానకి ని పూర్తిగా ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకుంటే మళ్ళీ తిరిగి ఇంట్లోకి అడుగుపెట్టడం తనకు ఏమాత్రం నచ్చలేదు అని మనసులో అనుకుంటుంది. అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మల్లికకు మనసులో మాత్రం అసూయ కలుగుతుంది.
పూర్వవైభవం
ఇక రామచంద్ర జానకి ఇద్దరు కూడా ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు జ్ఞానాంబ ఆశీర్వాదం తీసుకోవాలి అని అనుకుంటారు. అయితే జ్ఞానాంబ మాత్రం కొడుకును మాత్రమే ఆశీర్వదించి నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి అని దీవిస్తుంది. కానీ జానకినీ ఆమె ఏమాత్రం పట్టించుకోదు.
అయినప్పటికీ కూడా జానకి ఎలాంటి అపార్థం చేసుకోకుండా అత్త గారికి తన మీద కూడా ప్రేమ ఉంటుంది అని ఆలోచిస్తుంది. ఇక ఆ తర్వాత జానకి రామచంద్ర రాకతో అందరూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటారు. గోవిందరాజులు ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెబుతూ మళ్లీ పెద్ద కొడుకు కోడలు ఇంట్లోకి తిరిగి రావడంతో పూర్వవైభవం వచ్చింది అని ఆనందంగా చెబుతూ ఉంటాడు.
రామచంద్ర సంబరం
ఇక రామచంద్రకు తల్లి జ్ఞానాంబ ప్రత్యేకంగా అన్నం తినిపిస్తుంది. ఆ తర్వాత మిగతా పిల్లలకు కూడా తన చేతితోనే అన్నం తినిపించిన జ్ఞానాంబ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత అందరిని వెళ్లి పడుకోవాలి అని చెబుతూ నేను జానకి చివరలో భోజనం చేస్తాము అని అంటుంది. రామచంద్ర జానకిని పిలిచినప్పటికీ కూడా జ్ఞానాంబ అడ్డుపడి ఆమె తర్వాత వస్తుంది అని చెబుతుంది. రామచంద్ర కూడా తల్లి విషయంలో ఎంతో ఆనందంగా ఉంటాడు. మళ్లీ తన భార్య జానకిని తల్లి దగ్గరికి తీసుకోవడంతో బాధ అంతా పోయింది అని సంబరపడిపోతూ ఉంటాడు.
జ్ఞానాంబ ట్విస్ట్
అయితే ఊహించని విధంగా జ్ఞానాంబ జానకి విషయంలో ఇంకా అసంతృప్తిగానే ఉంటుంది. నువ్వు చదువుకున్న తెలివితో అతన్ని నీ వెనకాలే తిప్పుకుంటున్నావు మమ్మల్ని అందరినీ కూడా ఎంత మోసం చేసావో అతనికి త్వరలోనే అర్థమయ్యేలా చేస్తాను. ఇక నుంచి నేను అదే పనిలో ఉంటాను. నువ్వు ప్రతి రోజు చేసే పనిపై నా దృష్టి ఉంటుంది అని చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పరిస్థితులు అన్నీ సర్దుకున్నాయి అని అనుకున్న సమయంలో మళ్లీ అత్తగారు అపార్థం చేసుకుంటూ ఉండడంతో ఆశ్చర్యపోతుంది.
మరో కండిషన్ పెట్టిన జ్ఞానాంబ
ఒకవైపు భర్త రామచంద్ర మాత్రం జానకి అలాగే తల్లి కూడా కలిసి పోయారు అని అనుకుంటూ ఉంటాడు. ఇక జ్ఞానాంబ గురించి జానకి మాత్రం ఎలాంటి విషయాన్ని తన భర్తకు చెప్పదు. ఎలాగైనా అత్తగారి మనసులో అపార్దాలు తొలగిపోవాలి అని ఆలోచిస్తుంది. ఇక మరోవైపు జానకి ఇంటి ముందు ముగ్గు వేయాలి అని అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన జ్ఞానాంబ ఇకనుంచి మా ఇంట్లో నువ్వు ఎలాంటి పనులు చేయడానికి వీలులేదు అని కండిషన్ పెడుతుంది. మరి ఇలాంటి వాతావరణంలో జానకి ఎలా ముందుకు సాగుతుంది చూడాలి.