Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Janaki Kalaganaledu August 3rd: చల్లారని జ్ఞానాంబ ఆగ్రహం.. పాటతో మెప్పించిన జానకి!
జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులలో రోజురోజుకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. భర్త రామచంద్ర సహకారంతో జానకి ఐపీఎస్ కలను పూర్తి చేయాలని చదువును కొనసాగిస్తుంది. మరోవైపు జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇక తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. అయితే అప్పుడు జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 358 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
భవిష్యత్తుపై ఆందోళన
చదువుకున్న కోడలు వస్తే చదువుకోలేని కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో అని తల్లి జ్ఞానాంబ ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది. గతంలో తన తమ్ముడు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వలన తీవ్రస్థాయిలో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు అని జ్ఞానాంబ ఎంతో బాధలో ఉంటుంది. ఇక మళ్ళీ అదే పరిస్థితి తన కొడుకుకు జరిగే అవకాశం ఉంటుందేమో అని చదువుకోలేని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఇక జానకితో పెళ్లి జరిగిన తర్వాత ఆమె డిగ్రీ పూర్తి చేసింది అని జ్ఞానాంబ నిజం తెలుసుకుంటుంది. అందుకే మళ్ళీ ఆమె చదువు ప్రస్తావన తీసుకురావద్దు అని తన సర్టిఫికెట్స్ కూడా జ్ఞానాంబ తీసుకుంటుంది.
ఐపిఎస్ చదవును పూర్తి చేయాలని..
కానీ జానకి మాత్రం చిన్నప్పటినుంచి ఐపిఎస్ కావాలి అని కలలు కంటుంది. అందుకే ఆమె భర్త సహకారంతో తన ఐపిఎస్ చదవును పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకోసం భర్త రామచంద్ర కూడా ఎంతగానో సహాయం చేస్తాడు. ఈ క్రమంలో మల్లిక నుంచి కూడా జానకికి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా జానకి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తను చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే అత్తగారికి అసలు విషయం తెలుస్తుంది.
కోపంతోనే ఉన్న జ్ఞానాంబ
జానకి మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తన చదువుని యధావిధిగా కొనసాగిస్తుందని తెలుసుకున్న జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాకుండా జానకి చదువు కోసం తన కొడుకు రామచంద్ర కూడా సహాయం చేస్తున్నాడు అని తెలుసుకోగానే ఆమె మౌనంగా ఉండిపోతుంది. అంతేకాకుండా వారిద్దరిపై కోపంగా కొన్ని రోజుల వరకు మాట్లాడకుండా ఉంటుంది. ఇక వరలక్ష్మీ వ్రతం చేయవలసిన పనులు ఉన్నాయి అని జ్ఞానాంబ ఇంట్లో అందరికీ పనులు అప్పగిస్తుంది. కానీ జానకి రామచంద్రలతో మాత్రం ఆమె కొంచెం కూడా మాట్లాడదు. ఏ పని కూడా చెప్పదు.
పూజలో మల్లిక హడావుడి
అయితే ఈ తరుణంలో చిన్న కోడలు మల్లిక అదే అనువుగా తీసుకొని అత్తగారికి మరింత దగ్గర అవ్వాలి అని జానకి పై మరింత కోపం తెప్పించాలి అని అనుకుంటుంది. ఇక జ్ఞానాంబ చిన్న కోడలు మల్లికకు అన్ని పనులు అప్పగిస్తుంది. అయితే ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం కోసం విగ్రహాన్ని శుద్ధి చేసి తీసుకురావాలి అని మల్లికకు చెబుతుంది. ఇక ఆమె తీసుకురాగానే పక్కనే ఉన్న మరి కొందరు ఈ పనులన్నీ పెద్ద కోడలు చూసుకోవాలి కదా అని చెప్పడంతో జ్ఞానాంబ మౌనంగానే ఉంటుంది. ఇక తర్వాత గోవిందరాజులు కలగజేసుకుని జానకి చేస్తేనే బాగుంటుంది అని మళ్ళీ ఆమెకు కొన్ని పనులు అప్పగిస్తాడు.
పాటతో మెప్పించిన జానకి
అయితే పూజ సమయంలో పెద్ద కొడుకు కోడలు ముందు పీటల మీద కూర్చోవాలి అని పంతులు చెబుతాడు. కానీ ఈసారి కి చిన్న కోడలు చిన్న కొడుకు చేస్తారు అని జ్ఞానాంబ చెబుతుంది. అదే సమయంలో మల్లిక తన భర్త విష్ణుని తీసుకొని స్పీడ్ గా పీటల మీదకు వెళ్లి కూర్చుంటుంది. ఈ క్రమంలో పంతులు చెబుతున్న కొన్ని పనులను మల్లికా చాలా తప్పు తప్పుగా చేస్తుంది. ఇక పక్కనే ఉన్న గోవిందరాజులు చిన్న కోడలిపై సెటైర్లు వేస్తూ ఉంటాడు. అలాగే పూజ ముగింపు సమయంలో హారతి పాట పాడాలని పంతులు మల్లికకు చెప్పినప్పటికీ ఆమె తనకు రాదు అని చెబుతుంది. ఇక గోవిందరాజులు జానకిని పాడమని చెప్పడంతో ఆమె అద్భుతంగా అందరిని మెప్పించే విధంగా పాడుతుంది.
చల్లారని జ్ఞానాంబ ఆగ్రహం
ఆ
తరువాత
అందరికీ
వాయనం
ఇవ్వాలి
అని
పంతులు
చెబుతాడు.
ఇక
మల్లిక
మొదట
తన
అత్తగారికి
ఇచ్చి
అలాగే
మిగతా
వారికి
కూడా
వాయనం
ఇస్తుంది.
కానీ
జానకికి
మాత్రం
ఇవ్వదు.
తర్వాత
గోవిందరాజులు
నువ్వు
కూడా
అందరికీ
వాయనం
ఇవ్వమ్మా
అని
జానకికి
చెప్పగా
ఆమె
మొదట
తన
అత్తగారికి
ఇవ్వాలని
అనుకుంటుంది.
కానీ
జ్ఞానాంబ
మాత్రం
అక్కడి
నుంచి
వెళ్ళిపోతుంది.
ఆ
తర్వాత
కూడా
జానకి
వాయనం
ఇవ్వాలని
ప్రయత్నం
చేస్తుంది.
కానీ
జ్ఞానాంబ
మాత్రం
తన
కొడుకు
కొడలిపై
ఇంకా
కోపంగానే
ఉంటుంది.
వారి
క్షేమం
కోసం
నేను
ఆలోచిస్తుంటే
వారు
మాత్రం
నా
మీద
గౌరవం
లేకుండా
ప్రవర్తిస్తున్నారు.
అలాంటిది
వారిని
నేను
ఎందుకు
ఆశీర్వదించాలి
అని
ప్రశ్నిస్తుంది.
మరి
ఈ
విషయంలో
జానకి
అత్త
గారితో
ఏ
విధంగా
మాట్లాడుతుందో
చూడాలి.