Don't Miss!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Janaki Kalaganaledu August 4th: తగ్గిన జ్ఞానాంబ కోపం.. త్యాగానికి సిద్దమైన జానకి!
జానకి కలగనలేదు సీరియల్ సరికొత్త కథాంశంతో ముందుకు సాగుతోంది. ఎలాగైనా భర్త రామచంద్ర సహకారంతో జానకి ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. కానీ జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. అయితే అప్పుడు జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 358 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
రామచంద్ర కోసం...
చిన్నప్పుడు కుటుంబం కోసమే తన చదువును త్యాగం చేసిన రామచంద్ర ఎంతగానో కష్టపడతాడు. ఆ విషయం తల్లి జ్ఞానాంబకు కూడా బాగా తెలుసు. అయితే అతని జీవితంలోకి చదువుకున్న అమ్మాయి వస్తే మళ్లీ ఇబ్బంది పడతాడేమో అని చదువుకోలేని అమ్మాయిని ఇంటికి కోడలిగా తీసుకురావాలని జానకి ని ఇచ్చి పెళ్లి చేస్తుంది. కానీ పెళ్లి తర్వాత జానకి చదువుకున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా జానకి మంచితనం కారణంగా ఆమెను క్షమించి మళ్లీ ఒక మాట కూడా తీసుకుంటుంది. నీ భవిష్యత్తులో మళ్ళీ చదువు ప్రస్తావన తీసుకురావద్దు అని సర్టిఫికెట్స్ కూడా తీసుకుంటుంది. ఇక జానకి మాత్రం ఎలాగైనా ఐపీఎస్ కావాలి అని కలలు కంటుంది.
తల్లిదండ్రుల కోరిక మేరకు..
భార్య కల కోసం రామచంద్ర ఆలోచించి ఆమె చదువుకునేందుకు సహాయపడతాడు. కానీ చివరికి జ్ఞానాంబకు నిజం తెలియడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. జానకి అత్తగారు అంటే కూడా ఎంతో గౌరవం. అలాగే తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఐపిఎస్ చదువును పూర్తి చేయాలి అని అనుకుంటుంది. కానీ కోడలిగా తన బాధ్యతను పూర్తి చేయాలి కాబట్టి అత్తగారి కోసం మధ్యలో చదువును కూడా వదిలేయాలని అనుకుంటుంది. కానీ భర్త రామచంద్ర మాత్రం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని ధైర్యం చెప్పి చదువును కొనసాగించేలా చేస్తాడు. ఇక ఫైనల్ గా జ్ఞానాంబకు నిజం తెలియడంతో ఆమె కొడుకు కోడలితో మాట్లాడకుండా అసహనంతో ఉంటుంది.
నచ్చజెప్పిన గోవిందరాజులు
చదువుకున్న భార్య కారణంగా భవిష్యత్తులో నా కొడుకుకు ఏమవుతుందో అనే ఆందోళన నాలో ఎంతగానో ఉంది. ఆ విషయాన్ని మాత్రం అర్థం చేసుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. కాబట్టి నేను ఈ పూజ సమయంలో వారిని ఎలా ఆశీర్వదించాలి అంటూ జ్ఞానాంబ బాధపడుతుంది. ఇక ఆమె భర్త గోవిందరాజులు మాత్రం కొడుకు కోడలు నీ కంటే ఎక్కువ బాధ పడుతున్నారు అని ముఖ్యంగా రామచంద్ర నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు అని అంటాడు. ఇక రామచంద్ర ఎప్పుడూ కూడా నిన్ను మోసం చేయాలని అనుకోలేదు అలాగే నీకు ఇచ్చిన మాట ప్రకారం భార్యను ఆనందంగా చూసుకోవాలని అనుకున్నాడు అందుకే ఆమె కలకు అడ్డం పడకుండా చదివిస్తున్నాడు.. అనే గోవిందరాజులు చెబుతాడు.
మల్లికకు హెచ్చరికలు
వరలక్ష్మీ వ్రతం పూజ ముగిసిన తర్వాత వాయనం ఇవ్వడానికి జానకి ముందుకు వచ్చినప్పటికీ కూడా జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గోవిందరాజులు చెప్పిన మాటలకు ఆమె ఆలోచనలో పడుతుంది. ఇక మరోవైపు అత్తగారు జానకి మళ్ళీ కలిసిపోతే తన పరిస్థితి ఏమైపోతుందో అని మల్లిక కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అందుకే వాళ్ళని కలవనివ్వకుండా చేయాలి అని అత్తగారి మాటకు విలువ లేకుండా చేసిన జానకి క్షమించమంటారా ? అని మల్లిక అంటుంది. దీంతో ఒక్కసారిగా గోవిందరాజులు కోపంతో ఊగిపోతాడు. నువ్వు మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు మల్లికా భర్త విష్ణు కూడా భార్యపై కోపంగా ఉంటాడు. మధ్యలో కలుగజేసుకుంటే కొడతాను అంటూ సీరియస్ అవుతాడు. దీంతో మల్లికా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతుంది.
ప్రాణాలకు తెగించి..
ఇక
చివరికి
జ్ఞానాంబ
కొడుకు
కోడలు
విషయంలో
మళ్ళీ
ఆలోచనలో
పడుతుంది.
గోవిందరాజులు
కూడా
ఆమెకు
నచ్చజెప్పె
ప్రయత్నం
చేస్తాడు.
అయినా
నువ్వు
పడుతున్న
ఆందోళనలో
అర్థం
లేదు.
ఎందుకంటే
జానకికి
తన
భర్త
కుటుంబం
అన్న
ఎంతో
గౌరవం
అలాంటి
అమ్మాయి
మనకోసం
ఒకసారి
ప్రాణాలకు
తెగించి
కాపాడే
ప్రయత్నం
చేసింది.
ఆ
విషయం
మర్చిపోయావా
జ్ఞానాంబ
అని
గోవిందరాజులు
చెబుతాడు.
గతంలో
జానకి,
జ్ఞానాంబ
కుటుంబంపై
కరెంటు
తీగ
పడుతూ
ఉంటే
ప్రాణాలకు
తెగించి
కాపాడుతుంది.
ఆ
సమయంలో
ఆమె
గాయపడుతుంది
కూడా.
ఆ
విషయం
గుర్తు
చేసుకున్న
జ్ఞానాంబ
మెల్లగా
తన
కోపాన్ని
తగ్గించుకుంటుంది.
బాధలో జానకి
ఇక తర్వాత ఫైనల్ గా జ్ఞానాంబ మనసు కరగడంతో జానకి చేత వాయనం తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ రామచంద్ర జానకి ఇద్దరు కూడా జరిగిన విషయంపై బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా జానకి తన తల్లిదండ్రుల ఫోటోలు చూస్తూ ఎంతగానో మనోవేదనకు గురి అవుతుంది మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఐపీఎస్ చదవలేక పోతున్నాను నాన్న అంటూ.. నా అత్తగారి కుటుంబం కోసం ఐపిఎస్ చదువును వదిలేస్తున్నాను అని బాధపడుతుంది.
చదువును వదిలేస్తున్న జానకి
అయితే జానకి మాటలను గది పక్కనే ఉన్న జ్ఞానాంబ కూడా వింటుంది. ఇక జానకి తన పుస్తకాలను తెచ్చి భర్త రామచంద్రకి ఇచ్చి వీటిని మన స్వీట్ షాప్ లో పొట్లాలకు ఉపయోగించండి అని బాధపడుతూ ఉంటుంది. మరోసారి ఆలోచించమని భర్త రామచంద్ర కూడా అంటాడు. కానీ జానకి దండం పెడుతూ గొడవలు సృష్టించే ఈ చదువు నాకు వద్దు అని ఏడుస్తూ ఉంటుంది. మరి ఈ విషయంలో జ్ఞానాంబ.. జానకికి మద్దతు ఇస్తుందో లేదో తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.