Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Janaki Kalaganaledu December 1st: పెద్దమ్మ ఊరికి జనకితో వెళ్లిన రామ.. రొమాంటిక్ జర్నీలో ఫుల్ హ్యాపీ
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారింది. జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ తన ఫ్రెండ్ మాధురిపై హత్య ప్రయత్నం చేసి తప్పించుకోవాలని అనుకుంటాడు. ఇక అది చూసిన జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. కానీ జానకి మాటలను ఎవరు నమ్మరు. ఆమె పొరపాటు పడి ఉంటుంది అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. ఇక అఖిల్ కూడా ఆ విధంగా అందరిని నమ్మిస్తాడు. జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకోవడం వలన తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అని అనుకుంటుంది. ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 444 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
చేయి నొప్పితో మల్లిక
ఇంట్లో వరుసగా అనర్థాలు జరుగుతున్నాయని జ్ఞానాంబ ప్రత్యేకంగా గుడిలో హోమాలు పూజలు చేయిస్తుంది. అయితే మల్లికను ప్రత్యేకంగా ఒక యాగం చేయాలి అని చెప్పడంతో ఆమె మొదట అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కష్టంగా ఉండడంతో చేయలేను అంటుంది అయినప్పటికీ అత్తగారి ఆదేశాల మేరకు మల్లిక ఎంతో కష్టపడి పూజలను పూర్తి చేస్తుంది. ఇక తర్వాత చేయి నొప్పితో ఇంట్లో కూర్చుండిపోతుంది. అయితే తన దొంగ ప్రెగ్నెన్సీ గురించి కూడా ఎక్కడ బయటపడుతుందో అని మల్లిక భయపడుతూ ఉంటుంది. అంతేకాకుండా తన తోడికోడలు జానకి పై పగ తీర్చుకోవాలని కూడా అనుకుంటుంది. తన దొంగ ప్రెగ్నెన్సీ గురించి కేవలం జానకికి మాత్రమే తెలుసు కాబట్టి ఎలాగైనా జానకి చదువు విషయంలో ఏదో రకంగా చిచ్చలు పెట్టి నా మ్యాటర్ బయటపడకుండా చూడాలని ఆలోచిస్తూ ఉంటుంది.
చాలా సంతోషంగా
మరోవైపు జానకి చదువు విషయంలో రామచంద్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా జానకి ఐపిఎస్ చదువును కొనసాగించేలా చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జానకి మాత్రం ఐపిఎస్ చదువును పట్టించుకోకుండా చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటుంది. ఎందుకు జానకి గారు ఇంత సంతోషంగా ఉన్నారు అని రామచంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఇదే సమయంలో ఆమెను మరోసారి అడగాలని అనుకుంటాడు. ఇక అప్పుడే తల్లి జ్ఞానాంబ జానకిని పిలుస్తుంది.
అమ్మ చిన్ననాటి స్నేహితురాలు
ప్రత్యేకంగా పిండి వంటకాలు రెడీ చేస్తున్న జ్ఞానాంబ వాటన్నిటిని తీసుకువెళ్లి భానుకి ఇవ్వాలి అని చెబుతోంది. అయితే అప్పుడే కాఫీ తీసుకు వచ్చిన జానకి భాను ఎవరు అని అడుగుతుంది. భాను అంటే మా అమ్మ చిన్ననాటి స్నేహితురాలు అని ఒక విధంగా ఆమె నాకు మరో తల్లి లాంటి వారు అని రామచంద్ర చెబుతూ ఉంటాడు. అంతేకాకుండా రామచంద్ర అక్కడే పెరిగాడు అని గోవిందరాజులు కూడా చెబుతాడు. ఇక తర్వాత ఆ పిండి వంటకాలు ప్రత్యేకంగా భాను కోసం తీసుకువెళ్లి కలిసి రావాలి అని తల్లి జ్ఞానాంబ రామచంద్రకు చెబుతుంది. అయితే తాను కూడా వస్తాను అని జానకి చెప్పడంతో వద్దని రామచంద్ర అంటాడు.
మల్లిక బిర్యానీ గోల
ఆ
తరువాత
తల్లి
నిర్ణయంతో
రామ
జానకిని
తీసుకు
వెళ్ళడానికి
ఒప్పుకుంటాడు.
ఇక
కారులో
కాకుండా
బైక్
పై
వెళదాము
అని
జానకి
చెబుతుంది.
అయితే
అప్పుడే
మల్లిక
కూడా
మేము
కూడా
బావగారితో
పాటు
వెళ్తామని
చెప్పినప్పటికీ
జ్ఞానాంబ
ఒప్పుకోదు.
కడుపుతో
ఉన్నవాళ్లు
అంత
దూరం
వెళ్లడం
మంచిది
కాదు
అని
చెప్పడంతో
మల్లిగా
తన
బెడ్
రూమ్
లోకి
వెళ్లి
బాధపడుతూ
ఉంటుంది.
అప్పుడే
ఆమె
భర్త
విష్ణు
ఎందుకు
ఏడుస్తున్నావు
అని
అడుగుతాడు.
నాకు
ఇష్టమైనవి
జరగడం
లేదు
అని
అనడంతో
బయటకు
వెళ్లడం
తప్ప
ఏదైనా
అడుగు
చేస్తాను
అని
మాట
ఇస్తాడు.
అయితే
బిర్యానీ
కావాలి
అని
మల్లి
కడగడంతో
భర్త
విష్ణు
సరే
అని
ఒప్పుకుంటాడు.
షాప్
కు
వెళ్లి
ఇంటికి
తిరిగి
వచ్చినపుడు
తప్పకుండా
బిర్యాని
తీసుకువస్తాను
అని
చెబుతాడు.
రొమాంటిక్ జర్నీ
ఇక మరొకవైపు రామచంద్ర జానకీ ఇద్దరు కూడా జాలీగా బైక్ పై వెళుతూ ఉంటారు. కారులో కాకుండా ఇలా బైక్ పై ఎందుకు వెళదామని అన్నారు అని రామచంద్ర తన భార్యని అడగడంతో ఆమె కారులో వెళితే మజా ఉండదు అని బైక్లో వెళితేనే మీకు దగ్గరగా ప్రకృతికి కూడా చూసుకుంటూ సంతోషంగా వెళ్లవచ్చు అని అంటుంది. ఇక జానకి ఒక చోటున బండి ఆపమని చెబుతుంది. అక్కడ ఉండే పర్యావరణంను ఆమె ఇష్టపడుతుంది. ఇక చివరికి జానకి రామచంద్ర ఇద్దరు కూడా వాళ్ళ పెద్దమ్మ భాను ఇంటికి వెళతారు. అయితే మొదట రామచంద్ర భానుకి కనిపించకుండా దాక్కుంటాడు. కేవలం జానకి మాత్రమే ఇంటి ముందు నిలుచుని ఉంటుంది. ఇక వెనకాల నుంచి రామచంద్ర వచ్చి భానుని పట్టుకోవడంతో ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో రామచంద్ర జానకి చదువు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.