Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Janaki Kalaganaledu October 25th: కడుపు నొప్పితో అఖిల్ కు జ్ఞానోదయం.. అదే ప్లాన్ లో మల్లిక
జానకి కలగనలేదు సీరియల్ సరికొత్త ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి కుటుంబంలో రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని పెద్ద కోడలు జానకి అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. ఇక జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 417 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి ప్లాన్
జ్ఞానాంబ రెండవ కోడలు మల్లిక ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని ఎప్పటినుంచో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆమె అనుకున్నట్లే ఏదో ఒక గొడవ కూడా క్రియేట్ చేయాలని అనుకుంటుంది. సరైన సమయం దొరకడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మల్లిక నిర్ణయం తీసుకుంటుంది. ఇంట్లో మాకు గౌరవం లేదు అని జానకి రామచంద్ర ప్రత్యేకంగా డబ్బు ఆదా చేసుకుంటున్నారు అని కాబట్టి మేము ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేము అని మల్లిక కారణం చెబుతుంది. ఇక రామచంద్ర జానకి ఇద్దరు కూడా జెస్సి కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసం డబ్బులు ఆదా చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం తెలియక మల్లిక ఆ కారణాలు ఏమి పట్టించుకోకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది.
ఉమ్మడి కుటుంబంలో సంతోషం
మల్లిక తో పాటు జ్ఞానాంబ చిన్నకోడలు అఖిల్ కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు. అతని భార్య జెసి వెళ్లిపోవద్దు అని ఎంత చెప్పినప్పటికీ కూడా అఖిల్ ఏ మాత్రం పట్టించుకోడు. ఇక తర్వాత అందరూ కలిసి దసరా పండగ సందర్భంగా ప్రత్యేకంగా గుడికి వెళ్తారు. అక్కడ కూడా మల్లిక ప్రత్యేకంగా పూజలు చేయించుకునేందుకు ఇష్టపడుతుంది. ఇక వారు గుడిలో ఉండగానే కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చి జ్ఞానాంబను కలుస్తారు. మా ఉమ్మడి కుటుంబం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మీరే అంటూ వాళ్ళు ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం విడిపోతే వచ్చే నష్టాల గురించి కూడా చెబుతూ ఉంటారు.
బాధ్యత గుర్తు చేసిన జానకి
ఇక అందరితో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అని జానకి అత్తగారికి మామ గారికి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి చెబుతుంది. ముఖ్యంగా మామ గోవిందరాజులతో మాట్లాడుతూ మీరు ఇంటికి పెద్దవారు కాబట్టి అందరితో మాట్లాడి ఎవరు కూడా విడిపోకుండా చూడాలి అని జానకి ఎంతగానో తాపత్రయపడుతుంది. ఇక ఆ విషయంలో అత్త జ్ఞానాంబ కూడా జానకిని ప్రత్యేకంగా కోరుతుంది. మీరు కూడా ఒకసారి మల్లిక అఖిల్ తో ఇద్దరితో ప్రత్యేకంగా మాట్లాడాలి అని ఈ కుటుంబం విడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని జానకి వివరణ ఇస్తుంది.
భర్తను మార్చేందుకు
అయితే జానకి చెప్పిన మాటలకు విష్ణు ఎక్కడ మారిపోతాడు అని అతని భార్య ఏదో ఒక విధంగా మళ్లీ అతన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. మనం ఇక్కడే ఉంటే గొప్ప స్థాయికి రాలేము అని అదే సిటీలోకి వెళితే అక్కడ మన పుట్టబోయే బిడ్డకు ఉన్నత చదువులు చదివిపించే అవకాశం ఉంటుంది అని అలాగే మీరు కూడా గొప్ప బిజినెస్ చేసుకోవచ్చు అని మల్లిక చెబుతుంది. అయితే విష్ణు మాత్రం అలా ఆలోచించకుండా మల్లికా పోరు ఇంట్లో వాళ్లకి తప్పుతుంది అని అందుకే వెళ్ళిపోతే మంచిది అని అనుకుంటాడు.
సమస్యల గురించి తలుచుకుంటూ
ఇక తర్వాత జానకి తన బెడ్ రూమ్లో ఇంట్లో ఉన్న సమస్యల గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆమెను గమనించిన రామచంద్ర ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. మీరు జరిగిన విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవద్దు అని పరిస్థితులు అన్నీ అవే సర్దుకుంటాయి అని అంటాడు. ఇక తర్వాత గోవిందరాజులు కూడా తన భార్య జ్ఞానాంబతో కలిసి కూర్చొని మాట్లాడుతాడు. ఇంట్లో పరిస్థితులను పరిష్కరించాలి అని ఎవరు విడిపోకుండా మనమే ఒక నిర్ణయానికి రావాలి అని అఖిల్ మల్లికకు నచ్చ జెప్పాలని కూడా అతను అంటాడు.
అఖిల్ కు కడుపు నొప్పి
ఇక అర్ధరాత్రి అఖిల్ కు హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది. అతను నొప్పితో బాధపడుతున్నట్లు గమనించిన జెస్సి వెంటనే జానకిని పిలుస్తుంది. అలాగే రామచంద్ర కూడా తమ్ముడిని చూడడానికి వస్తాడు. గదిలో నొప్పితో బాధపడుతున్న అఖిల్ ను రామచంద్ర ఏమైంది అని అంటాడు. ఇక వెంటనే జానకి హాస్పిటల్ కి వెల్దామా అఖిల్ అని ఉంటుంది. అయితే ముందుగానే జీలకర్ర మంజీగ కలిపి అది తాగమని చెబుతుంది. అప్పుడు అఖిల్ నొప్పి తగ్గింది అని అంటాడు. ఈమధ్య చెడు తిరుగుడులు తిరిగి మద్యం కారణంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నావని అందుకే ఈ నొప్పి వచ్చింది అని రామచంద్ర చెబుతాడు. ఇక అఖిల్ కూడా ఈ ఆప్యాయతలు దూరమైతే దక్కవు అని మళ్ళీ కలిసి ఉండాలని అనుకుంటాడు. కానీ రామచంద్ర మాత్రం కలిసే అవకాశం లేదు అని ఉదయం ఇద్దరం కూడా విడిపోతున్నాము అని బాధపడుతూ చెబుతాడు. మరి ఆ మాటలకు అఖిల్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి.