Don't Miss!
- News గన్నవరం వైసీపీపై తాజా నివేదిక..వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉందంటే..?
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
Janaki Kalaganaledu February 9th: వెన్నెల ప్రేమ విషయంలో షాకింగ్ నిర్ణయం.. మరోసారి జ్ఞానాంబ సీరియస్
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఉత్కంఠగా మారుతోంది. ఐపీఎస్ చదువును పూర్తి చేసేందుకు జానకి ఇంతకుముందు సీక్రెట్ గా కోచింగ్ సెంటర్ కు వెళ్లింది. కానీ ఇప్పుడు జ్ఞానాంబ మాత్రం జానకి చదువు విషయంలో పెద్ద కండిషన్ పెట్టేసింది. ఇక జానకి తన అత్తగారి కోసం చదువును వదులుకోవాలి అనుకుంటుంది. ఇక జానకి భవిష్యత్తు ఎలా మారింది? ఆమెను భర్త రామ చంద్ర ఏ విధంగా మళ్ళీ చదువు వైపుకు తెచ్చాడు అనే కథాంశం ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది.
అయితే చదువుకున్న కోడలు వద్దనుకున్న జ్ఞానాంబ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. గత కొంతకాలంగా జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 233 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
జానకి మౌనంగానే..
కుల దేవతకు పూజ చేయాలని జ్ఞానాంబ పెద్ద కొడుకు కోడలిని గుడికి పంపిస్తుంది. అయితే జానకి ఐపీఎస్ చదువును ఎందుకు హఠాత్తుగా మానేసిందని సందిగ్ధంలో రామ ఆలోచనలో పడతాడు. ఇక సమస్య ఏమిటని జానకిని ఎంత అడిగినా కూడా ఆమె చెప్పదు. అయితే అసలు నిజం ఏమిటో చెప్పే పూజకు కూడా రానని మొండిగా ఉంటాడు. ఇక జానకి సైతం బాధపడుతూ ఉంటుంది. అత్తగారికి ఇచ్చిన మాట ప్రకారం జానకి నిజం చెప్పకుండా మౌనంగానే ఉంటుంది. ఇక మీరు ఇంటికి వెళ్లి ఆ మాట అత్తగారికి చెప్పండి అని, నన్ను ప్రతీ విషయంలో అర్థం చేసుకునే భర్త ఈ విషయంలో ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తెలియడం లేదని జానకి అంటుంది.
భర్తతో జానకి అప్సెట్
జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక తన అత్తకు అబద్ధం చెప్పి భర్తతో కలిసి హ్యాపీగా బయటకు వెళ్లాలని అనుకుంటుంది. పెద్ద కోడలు జానకిని మాత్రమే పూజకు పంపింది అని తనను పంపలేదు అనే అసూయతో మల్లిక పక్కా ప్లాన్ తో బయటకు వెళ్లిపోతుంది. తన నానమ్మకు ఆరోగ్యం బాగోలేదని మరొకరితో ఫోన్ చేయించిన మల్లిక హైదరాబాద్ కు వెళ్లిపోతుంది. అక్కడ భర్తతో కలిసి రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తుంది. మూడు రోజుల వరకు మనం ఇక్కడే చాలా హ్యాపీగా ఉందమని అంటుంది. ఇక మరోవైపు మల్లిక నానమ్మ జ్ఞానాంబ ఇంటికి రావడానికి సిద్ధమవుతోంది.
చెంప మీద కొట్టిన తల్లి
అయితే ఫైనల్ గా జ్ఞానాంబ తన కూతురు ప్రేమకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటుంది. వెన్నెల లవర్ ఇచ్చిన గిఫ్ట్ లు ప్రేమ కానుకలు అన్ని కూడా జ్ఞానాంబ చూస్తుంది. అయితే నిజం తెలుసుకున్న జ్ఞానాంబ వెంటనే అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. కానీ అప్పటికే వెన్నల తన లవర్ తో మాట్లాడి మాటలు అన్ని కూడా వింటుంది. జ్ఞానాంబ అప్పుడే వెన్నెల దగ్గరకు వస్తుంది. ఇక తల్లిని చూసిన క్రమంలో వెన్నెల క్లాస్ విషయం గురించి మాట్లాడుతున్నాను అంటూ అబద్దాలు చెబుతుంది. వెంటనే చెంప మీద కొట్టి నన్ను ఇంకా ఎంత మోసం చేస్తావు అని చెబుతుంది. నిశ్చితార్థం జరిగే తీరుతుంది అని గట్టిగా చెబుతుంది. ఇక ఆ విషయం గురించి జ్ఞానాంబ ఆలోచిస్తున్న సమయంలో పనిమనిషి వచ్చి జానకి గారు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం ఇంట్లోనే మర్చిపోయారు అని చెబుతుంది.
అందరి సంగతి తేలుస్తా..
ఇక జ్ఞానాంబ కూడా ఆ విషయంలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. నా మాట అంటే ఇంట్లో ఎవరికీ లెక్కలేదు. దేవతకు సంబంధించిన ఆరాధన విషయంలో ప్రసాదం నైవేద్యంగా పెడితేనే లాభం ఉంటుందని నేను జనకికి ఎంతో చెప్పాను. అయినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంది. అందరి సంగతి కూడా తెలుస్తాను అంటూ అంటుంది. ఇక ప్రసాదం తీసుకొని జ్ఞానాంబ గుడికి బయలు దేరుతుంది.
ప్రసాదం మర్చిపోయిన జానకి
ఇక మరొకవైపు పూజకు సిద్ధం అయిన జానకి అదే సమయంలో ప్రసాదం నైవేద్యంగా పెట్టాలని అనుకుంటుంది. కానీ అక్కడ ప్రసాదం కనిపించకపోవడంతో ఆందోళన చెందుతుంది. ఇక ఆ తరువాత రామచంద్ర కూడా షాక్ అవుతాడు. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండే జానకి ఇంత హఠాత్తుగా ఎందుకు ప్రసాదం మర్చిపోయింది అని రామ హఠాత్తుగా మరొక విధంగా ఆలోచిస్తాడు. మీరు ఏదో ఏందోళనలో ఉన్నారు. అందుకే ఇలా మర్చిపోయారు అని అంటాడు. కానీ జానకి మాత్రం సైలెంట్ గానే ఉంటుంది.
చచ్చిపోవాలనే ఆలోచన..
ఇక మరోవైపు వెన్నెల తన ప్రేమికుడితో అసలు నిజం చెబుతుంది. మా అమ్మకు నిజం తెలిసింది అని ఇప్పుడు నేను ఏమి చేయలేను అని చెప్పడంలో అతను చచ్చిపోదాం అని అంటాడు. ఇక అప్పుడే జ్ఞానాంబ మరోవైపు జానకి వద్దకు వస్తుంది. రామచంద్రతో చదువు ప్రస్తావన ఏ మాత్రం చెప్పవద్దు అని మరోసారి నీ చదువు కారణంగా మనం ఎవరు బాధ పడవద్దు అని అంటారు. మరి ఈ రెండు విషయాలలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో తదుపరి ఎపిసోడ్స్ లో చూడాలి.