twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu August 30th: అఖిల్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన జెస్సి.. జానకి అనుమానాలు

    |

    జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 377 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

    గ్రాండ్ గా వేడుకలు

    గ్రాండ్ గా వేడుకలు

    మల్లిక వారసుడికి జన్మనివ్వవ్వబోతోంది కాబట్టి ఈ కృష్ణాష్టమిని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అని జ్ఞానాంబ చెప్పడంతో గోవిందరాజులు కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఇక చుట్టుపక్కల వారిని కూడా పిలిచి కృష్ణాష్టమిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా కోలాటం ఆడే ఏర్పాట్లు చేస్తారు. అయితే అదే సమయంలో మల్లికకు కూడా కోలాటం ఆడాలని ఉంటుంది. కానీ అందుకు అత్తగారు వద్దని చెబుతారు. గర్భవతిగా ఉన్న నువ్వు ఇప్పుడు అలాంటి ఆటలు ఆడవద్దని అంటుంది. ఇక ఆ తరువాత మరచిపోయి ఆటలోకి వెళ్లినప్పటికీ మళ్ళీ అత్తగారి కోపంతో వెనక్కి వస్తుంది.

    ప్రెగ్నెన్సీతో జెస్సి

    ప్రెగ్నెన్సీతో జెస్సి

    ఇక అంతా హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో మరోవైపు అఖిల్ ప్రేమించిన అమ్మాయి జెస్సి గర్భవతి అవుతుంది. ఆ విషయం జెస్సి ఇంట్లో తెలియడంతో తనను కొడతారు. అంతే కాకుండా అతను ఎవరో చెప్పాలని హెచ్చరిస్తారు. ఇక ఆ సమయంలో జెస్సి అఖిల్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని అఖిల్ తో చెప్పాలని అనుకుంటుంది. కానీ అప్పుడు అఖిల్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక లాభం లేదని జెస్సి డైరెక్ట్ గా అఖిల్ ఇంటికి వెళ్లాలని అనుకుంటుంది.

     తమ్ముడికి రామ సహాయం

    తమ్ముడికి రామ సహాయం

    ఇక జ్ఞానాంబ, జానకి ఉట్టి కొట్టే తాడును లాగుతూ అందరికి ఛాలెంజ్ విసురుతారు. మొదట గోవిందరాజులు ఆ తరువాత విష్ణు, రామచంద్ర కూడా బాగానే ప్రయత్నం చేసినప్పటికీ ఉట్టిని కొట్టలేక పోతారు. ఇక తర్వాత అఖిల్ నీ ప్రయత్నం చేయమని చెబుతారు. అయితే అఖిల్ కు కూడా సాధ్యం కాకపోవడంతో చివరికి రామచంద్ర అతనికి సహాయం చేస్తాడు. తన భుజాలపై తమ్ముడిని ఎక్కించుకొని ఉట్టిని కొట్టేలా చేస్తాడు. ఇక అదే సమయంలో అక్కడికి ఆటోలో జెస్సి వస్తుంది.

    అఖిల్ మైండ్ బ్లాక్

    అఖిల్ మైండ్ బ్లాక్

    అఖిల్ కోసం ఆమె వెతుకుతూ ఉండగా హఠాత్తుగా ఆమెను అక్కడి నుంచి ఇంటి వెనకాల వైపుకు తీసుకువెళ్తాడు. ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చావు అని అఖిల్ అంటాడు. అంతేకాకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను నిన్ను తర్వాత కలుస్తాను అని అంటాడు. అయితే ఆ తర్వాత జెస్సి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ నేను గర్భవతి అయ్యాను అని చెబుతుంది. దీంతో ఒక్కసారి అఖిల్ మైండ్ బ్లాక్ అవుతుంది. నువ్వు చెప్పేది నిజమా అంటూ ఆశ్చర్యపోతాడు. అవును నేను మనం కలుసుకున్న రోజు ఎంత చెప్పినా కూడా వినకుండా తొందరపడ్డావు ఏమీ కాదు అని నచ్చజెప్పావు. కానీ ఇప్పుడు విషయం చాలా సీరియస్ గా మారిపోయింది. ఇంట్లో కూడా తెలిసిపోయింది ఎవరో చెప్పాలి అని నన్ను ఇంట్లో కొడుతున్నారు అంటూ జెస్సి చెబుతుంది.

    జానకి కంటపడిన అఖిల్, జెస్సి

    జానకి కంటపడిన అఖిల్, జెస్సి

    అయినప్పటికీ కూడా జెస్సికి ఏదో ఒకటి నచ్చజెప్పి అక్కడినుంచి పంపించాలి అని అఖిల్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అఖిల్ బ్రతిమాలతూ ఉండగా అప్పుడే కిటికీలోనుంచి జానకి చూస్తుంది. అసలు జెస్సి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని వాళ్ళిద్దరూ ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు అని అనుమానిస్తుంది. ఇక తర్వాత అప్పుడే ఇంట్లోకి వచ్చిన జ్ఞానాంబ జానకిని పిలిచి అక్కడ అందరూ భోజనానికి కూర్చున్నారు వడ్డించాలి అని చెబుతోంది. ఇక ఏమీ తెలియనట్టుగా వచ్చిన జానకి అందరికీ అక్కడ భోజనాలు వడ్డిస్తుంది.

    టెన్షన్ లో అఖిల్

    టెన్షన్ లో అఖిల్

    అదే సమయంలో సైలెంట్ గా అక్కడికి వచ్చిన అఖిల్ భోజనాలకు కూర్చుంటాడు. అయితే ఆ సమయంలో అఖిల్ చాలా టెన్షన్ గా ఉన్నట్లుగా జానకి గమనిస్తుంది. అంతేకాకుండా అఖిల్ జెస్సి మధ్యలో ఏం జరిగిందని వీలైనంత తొందరగా ఆ విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక మరోవైపు చిన్న కోడలు మల్లికా అక్కడ కూడా తన ఆహాన్ని చూపించాలని అనుకుంటుంది.

     మల్లిక మొండితనం

    మల్లిక మొండితనం

    అందరితో సమానంగా కూర్చుని భోజనాలు చేయకుండా ప్రత్యేకంగా మార్చి మీద కూర్చొని భోజనం చేయాలని అనుకుంటుంది. అయితే ఆ సమయంలో గోవిందరాజులు ఆమెను అందరితో పాటు కూర్చోవాలని అన్నప్పటికీ కూడా నేను ప్రస్తుతం కడుపుతో ఉన్నాను కాబట్టి కింద కూర్చుని తింటే కడుపులో బిడ్డకు మంచిది కాదు అని అంటుంది. కానీ గోవిందరాజులు అది నెలలు నిండిన తర్వాత అని ఇప్పుడు ఏం కాదు అని అన్నప్పటికీ కూడా మల్లికా మరొక విధంగా మాట్లాడుతుంది. దీంతో జ్ఞానాంబ తనను కుర్చీలో కూర్చొని తినమని చెబుతోంది. ఇక జానకిని వడ్డించమని కూడా అంటుంది. మరి ఈ తర్వాత పరిణామాలు కథను ఇంకా ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial August 30th Episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X