Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Janaki Kalaganaledu January 12th: జానకి కోసం కన్నబాబు కాళ్లు పట్టుకున్న రామ.. మరో ట్విస్ట్ ఇచ్చిన సునంద
జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. ఏకగైన ఐపీఎస్ కావాలనే అశయంతో చిన్నప్పటి నుంచి కష్టపడి చదివిన జానకి అత్తగారి ఇంటికి రావడంతో తన చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆమె భర్త రామచంద్ర భార్య చదువు గురించి తెలుసుకొని ఆమెకు ఎంతగానో సహాయ పడతాడు. అయితే చదువుతున్న జానకి కన్నబాబు రివెంజ్ తో పోలీసుల వలలో చిక్కుకుంది. కేసు నమోదయ్యింది అంటే జానకి ఐపీఎస్ అయ్యే అవకాశం ఉండదు. ఇన్ని రోజులు భర్త రామచంద్ర జాగ్రత్తల సహాయంతో అత్తగారి నుంచి తృటిలో తప్పించుకున్న జానకి పోలీసుల చేర నుంచి ఎలా తప్పించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 48వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 49వ వారంలో 7.22 రేటింగ్ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 48వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 49వ వారంలో 8.25 రేటింగ్ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 213 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
వెన్నెల ప్రేమ కోసం..
తన మరదలు వెన్నెల ప్రేమ విషయం ఎక్కడ ఇంట్లో తెలిసిపోతుందో అని కన్నబాబు కేసు విషయంలో జానకి ఏ మాత్రం మౌనం వీడదు. ఆమెను పోలీసులు అరెస్ట్ చేసినా కూడా నోరు మెదపకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. వెన్నెల ప్రేమలో ఉన్న విషయాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసేందుకు కన్నబాబు ప్రయత్నం చేయగా అతన్ని కొట్టి జానకి ఆ వీడియోలను డిలీట్ చేస్తుంది. అయితే జానకిపై రివెంజ్ తీర్చుకునేందుకు కన్నబాబు ఆమె కొట్టిందని అరెస్ట్ చేయిస్తాడు.
కేసు నమోదైతే జానకి ఐపీఎస్ అవ్వలేదు
ఇక జానకిపై ఎఫ్ఐర్ నమోదైంది అంటే ఆమె ఇప్పటివరకు ఎంతో కష్టపడి చదువుకున్నదంతా వృధా అవుతుందని ఆమె స్నేహితురాలు రామచంద్రకు చెబుతుంది. ఐపీఎస్ పరీక్షలు పాస్ అయిన తరువాత ఇంటర్వ్యూలో పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అని చూస్తారు అని అప్పుడు ఒక కేసు ఉందని తెలిసినా కూడా ఆమెకు ఉద్యోగం రాదని, ఇప్పటి వరకు చదివింది అంతా వృధా అవుతుంది అని, జానకి జీవితంలో కూడా తను అనుకున్న కలను నెరవేర్చుకునే లేదు అని జానకి ఫ్రెండ్ శ్రావణి చెబుతుంది. ఇక అలా జానకి చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎలాగైనా జానకి పై పోలీస్ కేసు నమోదు అవ్వకుండా చూసుకోవాలి అని ఆలోచించి కన్నబాబుకు ఫోన్ చేస్తాడు.
కన్నబాబు కాళ్ళు పట్టుకున్న రామచంద్ర
ఇక కన్నబాబుకు ఫోన్ చేయగా తన మామిడి తోట కి రావాలి అని చెబుతాడు.. తన భార్య పై వేసిన కేసును వెనక్కి తీసుకోవాలి అని అక్కడ కన్నబాబుని రామ ఎంతగానో బ్రతిమాలతాడు. ఇక రామచంద్ర ఎంతగా వేడుకున్నా కూడా కన్నబాబు ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఇక అతన్ని కూల్ చేసే విధంగా మాట్లాడుతూ ఆఖరికి మందు కలిపి మరి అతని చేతికి ఇస్తాడు. అంతేకాకుండా అతను కాళ్ళు పట్టుకో అని చెప్పగా భార్య భవిష్యత్తు కోసం రామచంద్ర కన్నబాబు కాళ్లను పట్టుకుంటాడు. కాళ్లు పట్టుకుంటే నీ భార్యను వదిలేస్తాను అని చెప్పిన కన్నబాబు ఆ తర్వాత వెంటనే మాట మార్చేసి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. రామచంద్ర ఓపిక నశించి అతని పట్టుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయినప్పటికీ కన్నబాబు కోపంతోనే అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
కోర్టు వరకు వెళితే..
ఇక మరోవైపు జ్ఞానాంబ కూడా తన కోడలిని బయటకు తేవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంది. తనకు తెలిసిన ఉన్నతస్థాయి పోలీసు అధికారులకు కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంది. అయితే సునందా దేవి ముందుగానే అంతకంటే ఉన్నత స్థాయి ఆఫీసర్స్ తో మాట్లాడి జానకి కేసును కోర్టు వరకు వెళ్లేలా చేసినట్లుగా చెప్పడంతో జ్ఞానాంబ మరింత ఆందోళన చెందుతుంది. జానకి కేసు కోర్టు వరకు వెళితే అది తీరని అవమానం అంటూ గోవిందరాజులు కూడా ఎంతగానో బాధపడతాడు.
పోలీస్ స్టేషన్ దగ్గరే రామచంద్ర
ఇక రామచంద్ర ఏమి చేయలేని పరిస్థితులలో తన భార్య గురించి ఆలోచించి పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. చీకటి పడిన కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడు. ఈ తరుణంలో రామచంద్ర తమ్ముడు విష్ణు పోలీస్ స్టేషన్ వచ్చి ఎంతసేపు ఇక్కడ ఉంటావు ఇంటికి వెళ్ళిపోదాం అని చెబుతాడు. ఇక రామచంద్ర మీ వదిన ను ఇక్కడ వదిలేసి నేను రాలేను అని బాధపడుతూ చెబుతాడు. అయితే తాను కూడా ఇక్కడే ఉంటాను అని విష్ణు చెప్పడంతో అలా చేయకూడదు అని నీ కోసం మల్లిక ఎదురుచూస్తూ ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళు అని అంటాడు.
ఎఫ్ఐఆర్ పేమర్ ను చించేసిన సునందాదేవి..
ఇక ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కిటికీ లో నుంచి జానకిని చూసిన రామచంద్ర ఎంతగానో బాధపడతాడు. ఇక రామ తన కోసం అక్కడే ఉన్నాడు అని జానకి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని చెబుతోంది. ఇక మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చిన సునంద దేవి ఎఫ్ఐఆర్ పేపర్ ను చించేస్తుంది. వెంటనే జానకిని విడిచి పెట్టాలి అని కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతుంది. మరి సునంద దేవి కేసు ఎందుకు వెనక్కి తీసుకుందో తెలియాలి అంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.