Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Janaki Kalaganaledu January 17th: వెన్నెల ప్రేమ విషయం తెలుసుకున్న రామచంద్ర.. ప్రమాదంలో జానకి
జానకి కలగనలేదు సీరియల్ గత కొంత కాలంగా ఎంతో ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. ఐపీఎస్ కావాలనే అశయంతో చిన్నప్పటి నుంచి కలలు కన్న జానకి పెళ్లి అనంతరం అత్తగారి ఇంటికి రావడంతో తన చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆమె భర్త రామచంద్ర భార్య చదువు గురించి తెలుసుకొని ఎంతగానో సహాయం చేస్తుంటాడు. సివిల్స్ చదువుతున్న జానకి కన్నబాబు రివెంజ్ తో పోలీసుల వలలో చిక్కుకుంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.
ఇక 48వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 49వ వారంలో 7.22 రేటింగ్ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 48వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 49వ వారంలో 8.25 రేటింగ్ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 214 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఆమె ప్రేమ కారణంగా..
రామచంద్ర చెల్లెలు వెన్నెల కాలేజ్ లోనే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక ఆమె జానకి సహాయం అడుగుతుంది. అదే క్రమంలో వెన్నెల ప్రేమ గురించి తెలుసుకున్న కన్నబాబు ఆమెను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తాడు. ఊరంతా తెలిసేలా చేస్తానని వీడియో కూడా తీస్తాడు.
దీంతో మీ అమ్మ పరువు మొత్తం బజారున పడుతుందని కన్నబాబు చెప్పడంతో వెన్నెల ఆ విషయాన్ని జానకితో చెబుతుంది. ఇక ఆ విషయంలో కన్నబాబుని కొట్టిన జానకి ఆ వీడియోల ఆధారాలను డిలీట్ చేసి మరోసారి తన మరదలి జోలికి రావద్దని చెబుతుంది. ఇక కన్నబాబు జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని తన తల్లి కార్పోరేటర్ అధికారంతో పోలీస్ కేసు వేస్తాడు.
మైరావతి రావడంతో..
పోలీస్ కేసు నుంచి తప్పించడానికి జానకి అలాగే జ్ఞానాంబ కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ ఎంత ట్రై చేసినా కూడా జానకి అసలు నిజం దాచడంతో బయటకు తీసుకు రావడం కష్టంగా మారుతుంది. కన్నబాబు చేసిన తప్పు గురించి చెబితే వెన్నెల ప్రేమ విషయం అందరికి తెలిసిపోతుంది అని జానకి ఆలోచిస్తుంది.
ఇక జానకి కూడా చాలా ఓపికతో ఉంటుంది. అయితే మొత్తానికి జ్ఞానాంబ అత్తగారు మైరావతి రంగంలోకి దిగి జానకి బయటకు వచ్చేలా చేస్తుంది. సునంద దేవికి హెచ్చరిక చేసి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేస్తుంది.
జానకి కారణంగా వెన్నెల పెళ్లి క్యాన్సిల్
ఇక జానకి ఇంటికి వచ్చిన తరువాత కూడా అసలు విషయం చెప్పకుండా మౌనంగానే ఉంటుంది. ఇక వెన్నలకు వచ్చిన సంబంధం కూడా జానకి పోలీస్ కేసు కారణంగా క్యాన్సిల్ అవుతుంది. దీంతో మైరావతి కూడా జానకిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఆ కారణంగా జ్ఞానాంబ ను కూడా తిడుతుంది. ఆ రోజే నేను జానకిని ఇంట్లో నుంచి పంపించమని చెప్పాను. అయినప్పటికీ నువ్వు నా మాట వినలేదు.
ఇప్పుడు జానకి కారణంగానే వెన్నలకు వచ్చిన సంబంధం కూడా పోయిందని మైరావతి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
జానకి శాశ్వతంగా వెళ్లిపోవాలి..
ఇక జ్ఞానాంబ కూడా అత్త ముందు తలదించుకుంటుంది. అవును అత్తయ్య గారు ఆ రోజు మీరు చెప్పిన మాట వినకుండా పొరపాటు చేశాను. కానీ ఈ రోజు మాత్రం అలాంటి పొరపాటు జరగనివ్వను. ఈ క్షణమే జానకికి ఈ ఇంటితో అనుబంధం తెగిపోయింది అంటూ.. రామచంద్ర జీవితం నుంచి కూడా జానకి శాశ్వతంగా వెళ్లిపోవాలి అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక అమ్మ నిర్ణయంపై రామచంద్ర మాట్లాడేందుకు రాగా అప్పుడు జ్ఞానాంబ వెంటనే అడ్డుపడి ఈ విషయంలో ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదని చెబుతుంది.
నిజం చెప్పిన వెన్నెల
ఇక అసలు నిజం చెప్పాలని వెన్నెల కూడా ముందుకు వస్తుంది. కానీ ఆమెను కూడా నిజం చెప్పవద్దని జానకి అడ్డుపడుతుంది. ఆ విషయంలో కొంత అనుమానాలు వచ్చినప్పుటికీ ఎవరు ప్రశ్నించరు. ఇక జానకి తప్పంతా తనదే అని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఇక ఆ సమయంలో రామచంద్ర ఆమెను వెత్తుకుంటూ వెళతాడు.
మరోవైపు వెన్నెల కూడా తన కారణంగా వదిన ఇంట్లో నుంచివెళ్లిపోవడం న్యాయం కాదని అనుకుంటుంది. ఎంతో బాధపడుతూ ఆ విషయాన్ని రామచంద్రకు చెప్పాలని బయటకు వస్తుంది. ఇక రామచంద్రను ఒక రోడ్డుపై కలిసిన వెన్నెల ఇదంతా తన వల్లే జరిగిందని అసలు నిజాన్ని చెబుతుంది.
ప్రమాదంలో జానకి..?
కన్నబాబు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి చూశాడని, అలాగే తను ఒక వ్యక్తిని కూడా ప్రేమించనని అందుకే జానకి నిజం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు వెన్నెల చెబుతుంది. దీంతో రామచంద్ర చెల్లి మాటలకు ఆశ్చర్యపోతాడు. అనంతరం జానకి ఒక బస్ స్టాప్ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. రామ తన విషయంలో చాలా బాధపడుతూ ఉంటాడని అనుకుంటుంది.
ఇక ఆ తరువాత బస్సు ఎక్కి మరో చోటుకి ప్రయాణం అవుతుండగా రామ ఆమె బస్సు వెనకాలే వెళతాడు. ఇక అనుకోకుండా ఆ బస్సుకు యాక్సిడెంట్ కూడా అవుతుంది. మరి జానకి ఈ పరిస్థితులు ఎలా దాటేసి తన భర్తను కలుసుకుంటుందో తదుపరి ఎపిసోడ్స్ లో చూడాలి.