Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Janaki Kalaganaledu January 18th: జానకి చనిపోయింది అంటూ వార్తలు.. కుప్పకూలిపోయిన రామ!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్న జానకి పెళ్లి అనంతరం అత్తగారి ఇంటికి రావడంతో తన చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతాయి. ఇక ఆమె భర్త రామచంద్ర భార్య చదువు గురించి తెలుసుకొని ఎంతగానో సహాయం చేస్తుంటాడు. సివిల్స్ చదువుతున్న జానకి కన్నబాబు రివెంజ్ తో పోలీసుల వలలో చిక్కుకుంది.
రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 48వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 49వ వారంలో 7.22 రేటింగ్ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 48వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 49వ వారంలో 8.25 రేటింగ్ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 214 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
భయపడిన వెన్నెల
రామచంద్ర చెల్లెలు కాలేజీ లో ఒక వ్యక్తిని ప్రేమించిన విషయాన్ని ఇంట్లో ఎలాగైనా చెప్పాలని అనుకుంటుంది అయితే అలా చెబితే తల్లి జ్ఞానాంబ కోపంతో ఏం చేస్తుందో తెలియదు అని భయపడిన వెన్నెల ముందుగా ఇంట్లో వాళ్లకి చెప్పాలని ఆలోచిస్తుంది. ఇక ముందుగా జానకితో చెప్పడంతో ఆమె సహాయం చేస్తానని కూడా ఎంతో నమ్మకంగా చెబుతుంది. ఇక ఈ లోపు పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఇక మరో వైపు నుంచి వెన్నెల ప్రేమ విషయం తెలియడంతో కన్నబాబు ఆమెను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తాడు. ఇక ఇంతలో జానకి అతని నుంచి వెన్నెల కాపాడుతుంది. అంతేకాకుండా కన్నబాబు పై చేయి కూడా చేసుకుంటుంది
మైరావతి దెబ్బకు
కన్నబాబు జానకి పై ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని తన తల్లి కార్పొరేటర్ కావడంతో అధికారంతో పోలీసుల చేత అరెస్టు కూడా చేయిస్తాడు. జానకి ఆ విషయంలో సైలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే కన్నబాబు కొట్టిన విషయాన్ని చెబితే వెన్నెల ప్రేమ విషయం కూడా బయటకు వస్తుందని ఆ తరువాత చాలా బాధపడుతుంది అని ఆలోచిస్తుంది.
అయితే జానకిని బయటకు రప్పించేందుకు రామచంద్ర విశ్వప్రయత్నాలు చేస్తాడు. అంతేకాకుండా జ్ఞానాంబ కూడా తన పలుకుబడితో తనను బయటకు తీసుకురావడానికి ఎంతగానో ట్రై చేస్తుంది. ఇక చివరికి మైరావతి జానకిని బయటకు తీసుకు వస్తుంది. కన్నబాబు తల్లి సునంద దేవికి హెచ్చరిక చేయడంతో మైరావతి దెబ్బకు జానకి మళ్లీ ఇంట్లోకి తిరిగి వస్తుంది.
ఏమీ చేయలేని పరిస్థితులలో..
కన్నబాబుని కొట్టడానికి కారణం ఏమిటో చెప్పాలి అని మైరావతి తో పాటు జ్ఞానాంబ కూడా ఎంతగానో అడుగుతరు. కానీ జానకి ఆ విషయంలో మౌనంగా ఉండడంతో వారిద్దరికీ చాలా కోపం వస్తుంది. ఇక మైరావతి ఆగ్రహం వ్యక్తం చేయడంతో జ్ఞానాంబ కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో జానకిని పంపించేస్తుంది. రామచంద్ర జీవితంలోకి మళ్ళి రాకూడదు అని కూడా ఆదేశిస్తుందిమ్ ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జానకి ఒక బస్ స్టాప్ లో కూర్చుని ఉంటుంది. ప్రస్తుతం తన భర్త చాలా బాధలో ఉండి ఉంటాడు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.
అన్నయ్యకు నిజం చెప్పిన వెన్నెల
ఇక మరోవైపు రామచంద్ర తన భార్య విషయంలో ఏమి అర్థం కాక బైక్ తీసుకొని ఆమెను వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అతని దగ్గరికి వచ్చిన చెల్లెలు వెన్నెలా అసలు నిజాన్ని చెబుతుంది. ఇదంతా తన వల్లే జరిగిందని ఒక వ్యక్తిని ప్రేమించిన కారణంగా కన్నబాబు తనను బ్లాక్ మెయిల్ చేయాలని చూశాడు అని అంటుంది. ఇక అతని నుంచి కాపాడే ప్రయత్నం లోనే జానకి వదిన చేయి చేసుకుంది అంటూ.. మళ్లీ ఆ విషయం బయటకు చెబితే తన ప్రేమ విషయం కూడా అందరికీ తెలుస్తుంది అని, ఆ తర్వాత తనను అమ్మ చంపేస్తుంది అనే కారణంగా జానకి వదిన అసలు నిజం చెప్ప లేదు అని రామచంద్రకు వివరణ ఇస్తుంది.
టెన్షన్ పడవద్దని..
నిజం తెలుసుకున్న తర్వాత రామచంద్ర ఎంతగానో భావోద్వేగానికి గురి అవుతాడు. ఇక వెంటనే బస్ స్టాప్ కి వెళ్లిన రామచంద్ర అక్కడ జానకిని కలుసుకుని తన గొప్పతనం గురించి చాలా విషయాలు మాట్లాడుతాడు. మీరు ఆలోచించని విధంగా నేను మాత్రం ఆలోచించలేక పోయాను అని, నా కుటుంబం కోసం అలాగే నా చెల్లి కోసం మీరు ఆలోచించండి విధానం చాలా గొప్పగా ఉందని అంటాడు. ఇక జానకి తన విషయంలో టెన్షన్ పడవద్దని కొన్ని రోజులు తన స్నేహితురాలు శ్రావణి ఇంట్లో ఉంటానని అంటుంది.
కుప్పకూలిపోయిన రామ..
జానకి ఆత్రేయపురం వదిలేసి మరో ఊరికి వెళ్లాలి అని అనుకుంటుంది. ఇక బస్సు ఎక్కే క్రమంలో రామచంద్ర జానకి కొన్ని డబ్బులు కూడా ఇస్తాడు. ఇక బస్సు వెళ్ళిపోతున్న క్రమంలో పరిగెత్తుకుంటూ వెళ్లిన రామ కింద పడిపోతాడు. ఇక భర్త బాధలు చూసిన జానకి కన్నీళ్లు పెట్టుకుంటూ బస్సులోనే ఏడుస్తుంది.
అయితే అదే సమయంలో బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా లోయలో పడిపోతుంది. ఆ తర్వాత అందుకు సంబంధించిన వార్త కూడా టీవీలో వస్తుంది. ప్రమాదంలో జానకి చనిపోయింది అంటూ వార్త రావడంతో రామచంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.. మరి నిజంగానే ఆ ప్రమాదంలో జానకి చనిపోయిందా అనే విషయం తెలియాలి అంటే మరొక ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.