Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
Janaki Kalaganaledu July 13th: బెడిసికొట్టిన మల్లిక ప్లాన్.. రొమాంటిక్ మూడ్ లో రామ, జానకి!
జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. జానకి తన భర్త సహకారంతో ఎలాగైనా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ప్లాన్ వేస్తుంది. కానీ అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలు ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 343 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
జ్ఞానాంబ భయం
జానకి ఐపిఎస్ చదువు విషయంలో రామచంద్ర ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. అయితే అత్తగారికి చదువుకున్న కోడలు అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒకవైపు జానకిపై ఇష్టం చూపిస్తూనే మరోవైపు ఆమె చదువు విషయంలో జ్ఞానాంబ కొంత భయపడుతూ ఉంటుంది. చదువుకున్న కోడలు ఉంటే భర్తను పట్టించుకోరు అనే అపోహలతో ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. కానీ జానకి మాత్రం ఎన్నడూ కూడా అలా ఆలోచించకుండా భర్తను అలాగా ఇంటి సంప్రదాయాలను కూడా ఎంతో చక్కగా పాటిస్తూ ఉంటుంది.
అత్తగారి ఆఫర్
ఈ
క్రమంలో
అత్తగారు
ఇంటికి
వారసుడిని
ఇవ్వాలి
అని
జానకిని
ప్రత్యేకంగా
కోరుకుంటుంది.
అంతేకాకుండా
మల్లికను
కూడా
అదే
విషయం
అడుగుతుంది.
ఎవరైతే
ముందుగా
ఈ
ఇంట్లోకి
వారసుడిని
ఇస్తారో
వారికి
రామాపురం
లో
ఉన్న
ఐదు
సెంట్ల
భూమిని
రాసిస్తాను
అని
ఆఫర్
కూడా
చేస్తుంది.
దీంతో
మల్లిక
ఆఫర్
గురించి
ఎంతగానో
ఆలోచిస్తుంటుంది.
ఎలాగైనా
ముందుగా
వారసుడిని
ఇచ్చేసి
5
సెంట్ల
భూమిని
దక్కించుకోవాలి
అని
అనుకుంటుంది.
మరొకవైపు
జానకి
రామచంద్ర
ఇద్దరూ
కలవకుండా
చూడాలని
కూడా
ఆమె
ఆలోచిస్తూ
ఉంటుంది.
అయితే
జానకి
ఎంత
ప్రయత్నం
చేస్తున్నప్పటికీ
కూడా
రామచంద్ర
మాత్రమే
ఆమె
చదువు
విషయం
గురించి
ఆలోచించి
దూరంగా
ఉండేందుకు
ప్రయత్నం
చేస్తాడు.
జ్ఞానాంబ ప్లాన్
ఆ విషయం తెలియని జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కూడా వివిధ రకాల ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా వారికి ఏకాంతం కలిగించాలి అని ఇంట్లోనే శోభనం గది తరహాలో ఏర్పాట్లు కూడా చేస్తారు. మరోవైపు మల్లిక కోసం కూడా వారసుడిని ఇవ్వాలి అని అదే తరహాలో వారి గదిని సిద్ధం చేసి ఉంచుతారు. ఇక ఈ రోజు రాత్రి ఈ ఇంట్లో కేవలం కొత్త జంటలు మాత్రమే ఉండాలి అని మనమందరం కూడా గుడికి వెళ్లి అక్కడ నిద్ర చేయాల్సి ఉంది అని గోవిందరాజులు జ్ఞానాంబ చెబుతారు. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా గుడికి వెళ్ళిపోతారు. ఇక రామచంద్ర జానకి కోసం ప్రత్యేకంగా గదిని ముస్తాబు చేసి ఉంచడంతో ఆశ్చర్యపోతారు. రామచంద్ర కూడా వాళ్ళు మన నుంచి పిల్లల్ని కోరుకుంటున్నారని అనుకుంటాడు.
రామ వెనుకడుగు
అయితే మొదట జానకి పిల్లలను కనేందుకు ఒప్పుకున్నప్పటికీ రామచంద్ర మాత్రం మళ్ళీ వెనకడుగు వేస్తాడు. ముందు మీరు ఐపిఎస్ పూర్తి చేసిన తర్వాతనే ఈ సంసార జీవితం గురించి ఆలోచిద్దామని ఉంటాడు. కానీ జానకి మాత్రం ఒక వైపు ఐపిఎస్ చదువుతూనే మరొకవైపు కోడలిగా నా బాధ్యతను కూడా పూర్తి చేయాల్సి ఉందని మీ సంతోషం కూడా చూసుకోవాలి అని చెబుతోంది. ఇక రామచంద్ర ఆ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాడు.
బెడిసికొట్టిన మల్లిక ప్లాన్
మరొకవైపు మల్లికా జానకి రామచంద్రలను కలవకుండా చేయాలి అని ఆలోచిస్తుంది. వారిద్దరూ ముందుగా ఈ ఇంటికి వారసుడిని ఇస్తే తనకు రావాల్సిన 5 సెంట్ల భూమి వారి పేరు మీద మారిపోతుంది అని ఆందోళన చెందుతూ ఉంటుంది. అందుకే వారిద్దరూ కలవకుండా ఒక ప్లాన్ కూడా వేస్తుంది. ప్రత్యేకంగా వంటగదిలోకి వెళ్లి జానకి తీసుకోవాల్సిన పాలలో ఆమె ఒక పౌడర్ కలుపుతుంది. అది తాగితే ఇద్దరు కూడా గాఢంగా నిద్రపోతారు అని ఆమె ప్లాన్ వేస్తుంది. అయితే ఆ పౌడర్ కలుపుతున్న సమయంలోనే వంటగదికి జానకి వస్తుంది. ఈ క్రమంలో మల్లికా అనుకోకుండా జానకి తీసుకోవాల్సిన పాల గ్లాసును తను తీసుకొని విష్ణు గదికి వెళ్ళిపోతుంది. ఎంతో సంతోషంగా ఉన్నా మల్లిక వారు పాలు తాగి నిద్ర పోతారు అని అనుకుంటుంది. కానీ ఆ ఊహ నుంచి బయటకు రాగానే విష్ణు ఒక్కసారిగా బెడ్ పై గాఢ నిద్రలోకి జారుకుంటాడు. తీరా ఆలోచించిన తర్వాత తొందరపాటులో పౌడర్ కలిపిన పాల గ్లాసును నేనే తీసుకువచ్చాను అంటూ నెత్తి మీద చేతులు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది.
టెంప్ట్ చేసిన జానకి
మరొకవైపు రామచంద్ర జానకి అందాన్ని చూసి ఆమెను దగ్గరికి తీసుకుంటాడు. ఇక జానకి పాలు తాగిన తర్వాత ఆ గ్లాస్ రామచంద్రకు ఇస్తుంది. ఇక రామచంద్ర టెంప్ట్ అవ్వకుండా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ కూడా జానకీ తన మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక రామచంద్ర పాలు తాగిన తర్వాత జానకిని మరింత దగ్గరకు తీసుకుంటాడు. ఇక వీరి మధ్య కొనసాగిన రొమాంటిక్ సీన్ ఎక్కడి వరకు దారితీస్తుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.