Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Janaki Kalaganaledu July 18th: రొమాన్స్ తో రెచ్చగొడుతున్న జానకి.. రామచంద్ర ఉక్కిరిబిక్కిరి!
జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన అంశంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. భర్త రామచంద్ర సహకారంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఆనుకున్న జనకి కొన్ని ఊహించని పరిణామాలు ఎదుర్కొంటుంది. అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలు అంటే ఇష్టం ఉండదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 346 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా..
జానకి అమ్మ నాన్నల కోరిక మేరకు రామచంద్ర తన భార్యను ఐపీఎస్ చదివించాలని అనుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయంలో వెనుకడుగు వేయకూడదు అని కూడా పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జానకి కూడా ఎంతో బాధ్యతగా తన చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి క్లాస్ లకు వెళ్లి ఐపీఎస్ కోచింగ్ కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె తోడికోడలు మల్లిక నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా రామచంద్ర జానకి చాలా జాగ్రత్తగా ఉండేందుకు ఆలోచిస్తూ ఉంటారు. అయితే మరొకవైపు రామచిత్ర తల్లి జ్ఞానాంబకు మాత్రం చదువుకున్న కోడలు అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి ఆమెకు కూడా ఆ విషయాన్ని తెలియకుండా చూసుకుంటారు.
జానకి మంచి ఆలోచన
ఈ క్రమంలో జానకికి మరొక సవాలు ఎదురవుతుంది. అత్తగారు జానకికి వారసులు పుట్టాలి అని కోరుకుంటుంది. అంతేకాకుండా పెద్ద కోడలు చిన్నకోడలకి ఒక మంచి ఆఫర్ కూడా ఇస్తుంది. ఎవరైతే ముందుగా వారసుడిని ఇస్తారో వారికి రామాలయం దగ్గర ఉన్న భూమిని కూడా రాసిస్తాను అని చెబుతుంది. దీంతో చిన్న కోడలు మల్లికా జానకి కంటే ముందుగానే వారసుడిని కని ఇవ్వాలి అని ఆ తర్వాత ఫ్లాట్ సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ జానకి మాత్రం అత్తగారి బాధను చూసి ఆమెకు వారసుడిని ఇవ్వాలి అని ఆలోచిస్తుంది.
రామచంద్ర కంట్రోల్
అయితే ఈ క్రమంలో రామచంద్ర మాత్రం ఇప్పుడే పిల్లలు వద్దు అని ఆలోచించుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కనలని అనుకుంటే మళ్ళీ జానకి ఐపిఎస్ చదువుకు ఆటంకం కలుగుతుంది అని, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని అనుకుంటాడు. జానకి ఇది వరకే చాలాసార్లు అత్తయ్య గారి కోరిక మేరకు తన భర్తతో కలవాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం తనను తాను చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. కోడలిగా నా బాధ్యతను నిర్వర్తించాలని ఉంది అని జానకి చెప్పిన కూడా రామచంద్ర పట్టించుకోడు. ప్రతిరోజు రాత్రి జానకి తన భర్తకు దగ్గరటంయ్యేందుకు ప్రయత్నిస్తుంది.
రెచ్చగొడుతున్న జానకి
ఇక
మల్లెపూలు
తేవాలి
అనే
జానకి
చెప్పడంతో
రామచంద్ర
వాటిని
తీసుకురాడు.
కానీ
ముందుగానే
జానకి
మల్లెపూలు
తెచ్చుకుని
రామచంద్రను
రెచ్చగొట్టే
ప్రయత్నం
చేస్తుంది.
అంతే
కాకుండా
రామచంద్ర
ప్రత్యేకంగా
ఆ
పూలు
తన
జడకు
పెట్టాలి
అని
అంటుంది.
ఇక
రామచంద్ర
జానకి
అందానికి
ఆమె
మాటలకు
కూడా
టెంప్ట్
అయ్యే
ప్రయత్నం
చేస్తాడు.
ఆమెకు
ముద్దు
కూడా
పెట్టుకోవాలి
అని
ఆలోచిస్తూ
ఉంటాడు.
ఆ
తర్వాత
రామచంద్ర
జానకి
పడుకున్నప్పుడు
కూడా
ఆమె
వైపు
పదేపదే
చూస్తూ
ఉంటాడు.
అప్పుడే
జానకి
చేయి
కూడా
వేస్తుంది.
ఇక
జానకీ
అంత
రెచ్చగొట్టినా
కూడా
రామచంద్ర
మాత్రం
చాలా
కంట్రోల్
చేసుకుంటూ
ఉంటాడు.
మల్లిక ప్లాన్ ఫ్లాప్
ఆ తర్వాత రామచంద్ర తడబడకుండా ఉన్నప్పటికీ జానకి దగ్గరకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక తెల్లవారే సరికి ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగా మల్లిక మాత్రం ఏదో ఒక గొడవ సృష్టించాలని ఆలోచిస్తూ ఉంటుంది అంతేకాకుండా గత రాత్రి జానకి కాలేజీ నుంచి ఒక ఫోన్ కాల్ రావడంతో ఎలాగైనా ఆ విషయాన్ని అత్తగారికి చెప్పాలని ఆ తర్వాత జానకిని తిట్టించాలి అని అనుకుంటుంది. ఇక ఆ విషయంలో టిఫిన్ తినేటప్పుడు మల్లికా తన అత్తగారి ముందు గుర్తు చేస్తూ ఉంటుంది అయితే జ్ఞానాంబ మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. నువ్వు ఎప్పుడు కూడా జానకి పై ఏదో ఒక అబద్ధం చెబుతావు అని ఇది మార్చుకోవాలి అని బుద్ధి చెబుతుంది.
గిల్లిన జానకి
ఇక తర్వాత రామచంద్ర జానకి ఇద్దరు కూడా టిఫిన్ తినడానికి వస్తారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు జానకి క్రింద కాళ్ళతో రామచంద్ర కాళ్ళు తొక్కుతూ రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ప్రత్యేకంగా రామచంద్ర నడుము గిల్లుతుంది. దీంతో రామచంద్ర ఒక్కసారిగా అరిచేస్తాడు. ఏమైందని తల్లి అడిగినప్పటికీ కూడా అల్లం ముక్క నోట్లో ఇరుక్కుంది అని అబద్ధం చెప్తాడు. ఇక వీరి రొమాన్స్ చూసిన మల్లికా ఏదో జరుగుతుంది అని వెంటనే ఆ విషయం గురించి తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి జానకి రెచ్చగొడుతున్న విధానంతో రామచంద్ర ఆమెకు దగ్గరవుతాడో లేదో చూడాలి.