Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Janaki Kalaganaledu march 11th: జనకి విషయంలో మల్లిక భయంకరమైన ఆలోచన.. పిల్లలు పుట్టకుండా ప్లాన్!
జానకి కలగనలేదు సీరియల్ మరోక కీలక ఘట్టంలోకి ప్రవేశించింది. ఐపీఎస్ చదువుకోవాలని ఎన్నో కలలు కన్న జానకికి అత్తగారు నుంచి అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చదువుకున్న కోడలు తనకు ఏ మాత్రం వద్దని అనుకున్నా జ్ఞానాంబకు చివరికి జానకి డిగ్రీ చదువుతుంది అని తెలియగానే ఆశ్చర్యపోతుంది. కానీ జానకి ఐపీఎస్ చదువుకుంటున్న విషయాన్ని మాత్రం ఆమెకు ఏమాత్రం తెలియదు తెలియకుండానే ఐపీఎస్ పూర్తిచేయాలని అనుకుంటుంది. ఇక ఆమెకు భర్త రామచంద్ర కూడా ఎంతో సహాయంగా ఉంటాడు. ఇక అదే సమయంలో జ్ఞానాంబ మనవడు మనవరాళ్లతో ఆడుకోవాలి అని ఆశ పడుతుంది. జానకి హటాత్తుగా వాంతులు చేసుకోవడంతో నిజంగానే పిల్లలు పుట్టబోతున్నారు అని ఆనందపడుతుంది. కానీ ఆ వాంతులు గర్భంతో వచ్చినవి కావు అని ఆ తర్వాత తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నడుమ జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 255 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో తెలుసుకుందాం పదండి.
అలా వాంతులు అవ్వడంతో..
జానకి హటాత్తుగా వాంతులు చేసుకోవడం తో ఆమెకు పిల్లలు పడతారని జ్ఞానాంబ ఎంతగానో సంతోషిస్తుంది. వెంటనే విషయాన్ని భర్త గోవిందరాజులు కూడా ఆనందంగా చెబుతుంది. ఆ తర్వాత వీధిలో ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా స్వీట్లు పంచుతుంది. గుడిలో కూడా అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆ వాంతులు నెలలు నిండినందుకు వచ్చినవి కావు అని రామచంద్ర తన తండ్రి గోవిందరాజుల చెబుతాడు. జానకికి కేవలం రాత్రి భోజనం సరిగా జీర్ణం కాకపోవడంతో వాంతులు చేసుకుంది అని చెబుతాడు.
జ్ఞానాంబకు షాక్
ఇక రామచంద్ర నిజం చెప్పగానే ఆ విషయాన్ని గోవిందరాజులు తన భార్య జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటాడు. కానీ అప్పుడు జ్ఞానాంబ సంతోషంగా ఉంటుంది. ఓపిక పట్టలేక జానకి అసలు నిజాన్ని అత్తగారితో చెబుతుంది. నిజం చెప్పడంతో జ్ఞానాంబకు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. వారసులను ఎత్తుకోవాలి అని ఎంత ఆరాట పడుతున్న తనకు దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఎంతగానో బాధకు గురి అవుతుంది. అంతేకాకుండా ఇది నిజం అనుకొని ఇప్పటివరకు తాను ఎంతగానో ఆనందపడ్డాను ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత తనపై తనకే జాలి వేస్తుంది అని జ్ఞానాంబకు బాధపడుతుంది.
పిల్లల్ని వద్దని అనుకుంటున్నారా?
ఆ తర్వాత జ్ఞానాంబ కొడుకు కోడలు ఇద్దరిని ప్రత్యేకంగా పిలిపించి అసలు విషయాన్ని అడుగుతుంది. పెళ్లి అయ్యి ఇన్ని నెలలు అవుతున్నా మీకు కడుపు ఎందుకు పండలేదు, మీరు ఇప్పుడే పిల్లలు వద్దని అనుకుంటున్నారా అని కూడా జ్ఞానాంబ వారిని ప్రశ్నిస్తుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా అలాంటిది ఏమీ లేదు అని చెప్పడంతో జ్ఞానాంబ భరోసాని ఆలోచిస్తుంది. వెంటనే మీరు హాస్పిటల్ కి వెళ్లి ఒక సారి డాక్టర్ కి చూపించుకోవాలి అని అంటుంది.
జానకికి పిల్లలు పుట్టవద్దని..
ఇక అదే సమయంలో మల్లిక నాటు వైద్యం తీసుకుంటే తప్పకుండా పిల్లలు కలుగుతారు అని చెబుతుంది. మల్లిక ముందుగానే మగ పిల్లాడు పుట్టాలి అని జుమాంజి అనే నాటు వైద్యుడు దగ్గర మందులు తీసుకోవాలని అనుకుంటుంది. ఇక మరోవైపు జానకికి ఏ మాత్రం పిల్లలు పుట్టకూడడు అని అప్పుడు అత్తగారు తనను మాత్రమే ప్రేమగా చూస్తారు అని ఒక ప్లాన్ వేస్తోంది. జుమాంజి నాటు వైద్యుడు దగ్గర నుంచి పిల్లలు పుట్టకుండా మందులు కూడా జానకికి ఇప్పించాలి అని అనుకుంటుంది.
షాక్ ఇచ్చిన నీలావతి
నాటు వైద్యం మాత్రం అస్సలు నమ్మకూడదు అని జానకి ఎంతో సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. మల్లికను ఏ కాలంలో ఉన్నావు అని సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటివి వాడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని చెబుతూ ఉండగా ఆ సమయంలో అప్పుడే ఇంట్లోకి వచ్చిన నీలావతి ఎందుకు వాడ కూడదు అని మా కాలంలో ఎక్కువగా నాటు వైద్యం తో నే అన్ని రోగాలకు మందులు ఇచ్చేవారు అని అంటుంది. జ్ఞానాంబ అలాగే నేను ఇద్దరం కూడా పిల్లలను అదే తరహాలో కన్నామని చెబుతుంది అంతేకాకుండా జానకి ఎక్కువగా చదువుకుంది కాబట్టి ఇలా మాట్లాడుతోంది అని కూడా నీలావతి చెప్పడంతో జ్ఞానాంబ ఆలోచన మారిపోతుంది.
నాటు వైద్యుడి దగ్గరికి జానకి
ఏదైనా మంచి జరుగుతుంది అంటే వారు చెప్పినట్లు చేయాలి అని జ్ఞానాంబ జానకిని నాటు వైద్యం తీసుకోవాలి అని చెబుతోంది. ఇక జానకి ఇష్టం లేకుండా మల్లికతో కలిసి జుమాంజి నాటు వైద్యుల దగ్గరికి వెళుతుంది. ఇక నీలావతి వారి ఇద్దరిని తీసుకొని ఆ వైద్యుడి దగ్గరికి వెళ్లడంతో ముందుగానే ఆమె జానకికి పిల్లలు కలగకుండా మందులు ఇవ్వాలి అని చెబుతుంది. అతను సరే అని చెబుతాడు. ఇక జానకి మళ్ళీ ఇద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఇద్దరికీ మందులు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ జానకి మాత్రం ఇవి ఎలాంటి మూలికలతో తయారు చేశారు అని అడిగే ప్రయత్నం చేస్తుంది. ఇక నాటు వైద్యుడు కాస్త తడిబడినప్పటికీ ఈ రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు అని ఇవి పలు మూలికలతో తయారు చేసినవి అని చెబుతాడు.
Recommended Video
వెన్నెల నిశ్చితార్థం..
ఇక ఆ తర్వాత వెన్నెల పెళ్లి గురించి కూడా గోవిందరాజులు జ్ఞానాంబతో ఆలోచిస్తారు. వెన్నెల పెళ్లి చేయాలి అని అందుకు నిశ్చితార్థం తేదీ ని ఫిక్స్ చేయాలని కూడా అనుకుంటారు. ఇక గోవిందరాజులు తల్లి ఒక తేదీ గురించి చెప్పడంతో అందుకు జ్ఞానాంబ కూడా సరే అంటుంది. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చిన మల్లికా అత్త గారిని కలిసి జానకి ఎక్కడికో వెళ్ళింది అని చెబుతుంది. నేను మందులు తీసుకొని ఇంటికి వచ్చాను కానీ తను మాత్రం చెప్పకుండా వెళ్ళింది అని అంటుంది. మరి ఈ విషయంలో జ్ఞానాంబ ఏ విధంగా ఆలోచిస్తూనే చూడాలి.