Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Janaki Kalaganaledu march 18th: జానకి ప్లాన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మల్లిక.. జ్ఞానాంబ మరో ట్విస్ట్!
జానకి కలగనలేదు రోజురోజుకు వీక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. ఇటీవల కాలంలో మొదలైన సీరియల్స్ లో ఇదొక్క సీరియల్ మాత్రమె చాలా తొందరగా జనాలకు కనెక్ట్ అయ్యింది అనే చెప్పాలి. సీనియర్ హీరోయిన్ రాశి కూడా ఈ సీరియల్ లో ఒక ప్రత్యేకమైన అత్త పాత్రలో అట్రాక్ట్ చేస్తోంది. ఇక జానకి పాత్ర కూడా ప్రేక్షకులకు చాలా బాగా ఎక్కేసింది. ఐపీఎస్ చదువుకోవాలని ఎంతగానో ఆశ పడిన ఒక అమ్మాయి అత్తగారి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అలాగే తన భర్త సహకారంతో ఆమె ఈ విధంగా తన కలను నెరవేర్చుకుంది అనేది ఆసక్తిని రేపుతోంది. అయితే అత్తగారి చిన్న కూతురుకి ప్రత్యేకంగా ప్రేమ వివాహం చేయాలనుకున్న జానకి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది అలాగే తోడికోడలు మల్లిక ఆమెపై ఇలాంటి నిందలు వేస్తుంది అనే విషయం కూడా సీరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 260వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూద్దాం..
మల్లిక మరో ప్రయత్నం
జానకి ఎలాగైనా తన భర్త చెల్లెలు వెన్నెలకు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇక జ్ఞానాంబ మాత్రం తన కూతురుకు ప్రేమవివాహం ఏమాత్రం జరగకూడదు అని షరతు పెడుతుంది. కానీ జానకి మాత్రం వెన్నెల ప్రేమ వివాహానికి పెద్దలు కుదిర్చిన పెళ్లి గా మారుస్తుంది. ఈ క్రమంలో జానకి పై పగ తీర్చుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్న చిన్న కోడలు మల్లికకు ఆ విషయం తెలుస్తుంది. అంతేకాకుండా వెన్నెలను తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తు వెన్నలకు జరగబోయే నిశ్చితార్థంను కూడా క్యాన్సిల్ చేయాలని ప్రయత్నం చేస్తుంది.
నిశ్చితార్థం ఆగిపోవాలి అంటూ..
వెన్నెల నిశ్చితార్థం తనకు నచ్చిన దిలీప్ తో జరుగుతూ ఉండడంతో సంతోషంగా ఉంటారు. గోవింద రాజులు తల్లి మైరావతి ఇంటి వద్దనే నిశ్చితార్థ వేడుకను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఎంగేజ్మెంట్ మల్లిక జానకికి అనుకోని విధంగా షాక్ ఇస్తుంది. నిశ్చితార్థం జరుగుతూ ఉండగా మధ్యలో జానకిని కాస్త పక్కకు రావాలి అని మల్లిక పిలుస్తుంది. ఎందుకు అని జానకి అడిగినప్పటికీ కూడా వెంటనే రావాలి అని చెబుతుంది. ఇక మల్లిక ఎందుకు తనను పిలిచిందో అర్థం కాని పరిస్థితులలో జానకి ఆలోచిస్తుంది. ఇక మల్లిక వెంటనే నిశ్చితార్థ వేడుక ఆగిపోవాలి అని లేకపోతే నువ్వు ఆడుతున్న నాటకం మొత్తం కూడా అత్తగారికి చెనుతను అంటూఆ తరువాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మల్లిక చెబుతుంది.
జానకిని డేంజర్ లో పడేసిన మల్లిక
ఇక
మల్లికా
అలా
చెప్పగానే
జానకి
కూడా
ఒక్కసారిగా
షాక్
అవుతుంది.
వెన్నెల
తనకు
నచ్చిన
వాడితో
పెళ్లి
జరగకపోతే
తట్టుకోలేదని
ఇది
ప్రాణాలతో
చెలగాటం
ఆడుతున్నట్టే
అని
మల్లికకు
అర్థమయ్యేలా
చెప్పాలి
అనుకుంటుంది.
కానీ
మల్లిక
మాత్రం
వెన్నలను
తన
తమ్ముడికి
ఇచ్చి
పెళ్లి
చేయాలనే
ఆలోచనతో
జానకి
మాటలను
ఏమాత్రం
పట్టించుకోకుండా
నువ్వు
ఏం
చేస్తావో
ఎలా
చేస్తావో
నాకు
తెలియదు
కానీ
నిశ్చితార్థం
మాత్రం
ఆగిపోవాలి
అని
గట్టిగా
షరతులు
విధిస్తుంది.
నీ
అంతట
నువ్వే
అత్తగారి
దగ్గర
నిజం
ఒప్పుకుంటే
ఒప్పుకుంటే
క్షమిస్తారు
అదే
నేను
చెబితే
ఇంట్లో
నుంచి
బయటకు
నెట్టివేసి
పరిస్థితులు
ఎదురవుతాయి
అని
మరొక
కండిషన్
కూడా
పెడుతుంది.
హడలిపోయిన జానకి..
ఇక మల్లికా మాటలకు హడలిపోయిన జానకి ఏమి మాట్లాడలేను పరిస్థితులలో ఉంటుంది. ఇక ఆ తర్వాత వెన్నెల నిశ్చితార్థం సమయంలో ఉంగరాలు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఉంగరాలు జానకి దగ్గర ఉండి పోతాయి. చివరికి జ్ఞానాంబ జానకిని పిలిచి ఉంగరాలు వారికి ఇవ్వాలి అని చెబుతోంది. అయితే జానకి మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత రామచంద్ర ఉంగరాలు తీసుకుని వాళ్లకు ఇస్తాడు. ఇక ఆ తర్వాత వెన్నెల దిలీప్ ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకుంటూ ఉండగా మల్లిక మరొక షాక్ ఇస్తుంది.
నిజాన్ని బయటపెట్టిన మల్లిక
వెంటనే ఈ నిశ్చితార్థం ఆగిపోవాలి అని అత్తగారిని జానకి మోసం చేస్తున్న విషయం బయట పడాలి అని అందరితో చెప్పేస్తుంది. జానకి నన్ను మోసం చేయడం ఏమిటి అని జ్ఞానాంబ మరొకవైపు ఆశ్చర్యంగా మల్లికను ప్రశ్నిస్తుంది. జానకి చెప్పినట్లుగా దిలీప్ వారి కుటుంబ సభ్యులకు చెందిన వాడు కాదు అని ఇది ప్రేమ పెళ్లి అని మీకు తెలియకుండా పెద్దలు కుదిర్చిన వివాహం జరిపిస్తున్నారు అని మల్లిక అసలు విషయం బయట పెడుతుంది.
వదిలేసి వెళ్లిపోయిన జ్ఞానాంబ
అంతే కాకుండా ఈ నాటకంలో మెవె కొడుకు, కూతురు కూడా ఉన్నారని నిజమో కాదో ఆ విషయాన్ని వాళ్లనే అడగాలని కూడా మల్లిక అంటుంది. ఇక మల్లికా అలా చెప్పగానే మొదట గోవిందరాజులు ఆ విషయాన్ని నమ్మడు. కానీ ఈ నిజాన్ని జానకి మాత్రమే చెప్పాలని అత్త గారి మీద ఒట్టు వేసి చెప్పాలి అని ఒక బలమైన కండిషన్ పెడుతోంది. దీంతో జానకి ఏమి మాట్లాడకుండా సైలెంట్ అవుతుంది. ఇక జ్ఞానాంబ తప్పు చేసిన వారిని మైరావతి దగ్గర వదిలేసి ఎలాంటి శిక్ష వేస్తారో మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.