Don't Miss!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
Janaki Kalaganaledu May 30th: మరో నిజం తెలుసుకున్న మల్లిక.. అత్త మనసులో కొత్త అనుమానం!
జానకి కలగనలేదు మరో ట్విస్ట్ తో ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. స్వీట్ షాప్ ను జ్ఞానంబ కొడుకు రామచంద్ర అనుకోకుండా తాకట్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది. భార్య జానకిని ఐపీఎస్ చదువు కోసం లక్ష రూపాయలు కన్నబాబు దగ్గర అప్పు చేయడంతో స్వీట్ షాప్ ను లాగేసుకోవాలని చూస్తాడు. ఇక చిన్న కోడలు మల్లిక కారణంగా జానకికి సమస్యలు ఎదురవుతాయి.
ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ ప్రేక్షకులలో ఆదరణను పెంచుకుంటోంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 311వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
అమ్మకు తెలియకుండా హైదరాబాద్
తన భర్త రామచంద్రను ఎలాగైనా హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ వంటల పోటీలలో పాల్గొనేలా చేయాలని జానకి ఆలోచిస్తుంది. అయితే ఈ క్రమంలో రామచంద్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ వెళ్ళకూడదు అని అతను వంటల పోటీల్లో ఓడిపోతే తట్టుకోలేడు అని అతని తల్లి జ్ఞానాంబ తీవ్రంగా హెచ్చరిస్తుంది. జానకి రామచంద్రను హైదరాబాద్ తీసుకు వెళ్ళడానికి వీలు లేదు అని గట్టిగానే హెచ్చరిస్తుంది.
ఈ క్రమంలో జానకి రామచంద్ర ఇద్దరికీ కూడా జ్ఞానాంబ భర్త గోవిందరాజులు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మీ అమ్మకు తెలియకుండానే మీ భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపో అని తండ్రి గోవిందరాజులు చెప్పడంతో రామచంద్ర కూడా అందుకు ఒప్పుకుంటాడు.
టెన్షన్ పెట్టిన కన్నబాబు
అయితే స్వీటి షాప్ వివాదంపై మరొకసారి రామచంద్ర కన్నబాబు టెన్షన్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. తీసుకున్న అప్పు ఎలాగో ఇవ్వరు అనే నమ్మకంతో జ్ఞానాంబ పేరుమీద ఉన్న స్వీట్ షాప్ ను తన ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటాడు. అంతేకాకుండా తన తల్లి సునంద దేవి పేరు కూడా పెట్టాలని అనుకుంటాడు.
అయితే కన్నబాబు రామచంద్ర ఇంటికి వచ్చి ఆందోళనకు గురి చేస్తాడు. త్వరలోనే షాక్ ఇవ్వబోతున్నాం అని మా కొత్త సీట్ షాప్ సిద్ధం కానుందని అది మీకు బాగా తెలుసు అని కుటుంబ సభ్యులకు కూడా వివరణ ఇస్తారు. దీంతో రామచంద్రం మరొకసారి టెన్షన్ లో పడతారు.
కన్నబాబుకు జానకి వార్నింగ్
అయితే కన్నబాబు సునంద వెళ్ళిపోయే క్రమంలో జానకి వాళ్లకి తీవ్రంగా మరొక హెచ్చరిక చేస్తుంది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడానికి ఇంకా గడువు ఉంది కదా అప్పటి లోపు తప్పకుండా డబ్బులు ఇస్తామని అంతేకానీ ఇలా ఇంటికి వచ్చి అనవసరమైన గొడవలు సృష్టించాలని చూస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది.
అయితే మీరు డబ్బు ఎంత మాత్రం కట్టలేరని కన్నబాబు చాలా నమ్మకంగా చెబుతాడు. ఇక రామచంద్ర కూడా ఆ విషయంలో కలుగజేసుకుని తప్పకుండా నీ డబ్బు సమయానికి ఇచ్చేస్తాను అని ఇక్కడి నుంచి వెంటనే వెళ్లి పోవాలి అని కూడా చెబుతాడు. ఇక వారి మాటలకు కన్నబాబు తల్లితో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
గోవిందరాజులు మరోసారి సహాయం
ఇక జానకి రామచంద్ర కన్నబాబు ఇవ్వాల్సిన డబ్బు గురించే ఆలోచనలో పడతారు. కన్నబాబు అమ్మకు చెబితే అసలు నిజం బయట పడుతుందని ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అర్థం కావడం లేదు అని రామచంద్ర ఆందోళనలో ఉంటాడు. అయితే జానకి మాత్రం అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పూర్తయ్యేలోపు అతను అత్తయ్య గారికి ఆ విషయం చెప్పాడు అని అంటుంది. అయితే డబ్బులు అనే మాట గురించి పక్కనే ఉన్న గోవిందరాజులు వీరి సంభాషణను వింటాడు. డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు కదా అని తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటాడు.
ఆ మాటలు విన్న మల్లిక
హైదరాబాద్ వెళుతున్నారు కదా అక్కడ ఖర్చులకు ఏదో ఒక అవసరం ఉండే ఉంటుంది అంటూ తన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తాడు. రామచంద్ర వద్దని అన్నప్పటికీ కూడా ఇది నేను చేస్తున్న ఒక బాధ్యత అనుకుంటూ కొడుకుకు చెబుతాడు. అయితే వీరి మాటలు విన్న మల్లిక వైజాగ్ వెళ్లకుండా రామచంద్ర జానకి హైదరాబాద్ వెళుతున్నారు అని తెలుసుకుంటుంది. వెంటనే ఆ విషయాన్ని అత్తగారికి చెప్పాలని అనుకుంటుంది.
అత్తకు నిజం చెప్పిన మల్లిక
అయితే రామచంద్ర జానకి వైజాగ్ పెళ్లికి వెళుతున్నారు అనే ఆలోచనలోనే ఉన్న జ్ఞానాంబ వారికి ప్రత్యేకంగా దారిలో తినడానికి భోజనం సిద్ధం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా జానకి కోసం కూడా పులిహోర తయారు చేస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మల్లిక అసలు విషయం చెప్పాలని అనుకుంటుంది. మీరు ఇక్కడ ఎంతో ప్రేమగా నమ్మకంతో కొడుకు కోడలికి పులిహార కలుపుతున్నారు కానీ అక్కడ మీ నమ్మకాన్ని వారు మోసం చేస్తున్నారు అని చెబుతుంది. అయితే మొదట జ్ఞానాంబ ఆమె మాటలు ఏమాత్రం నమ్మకుండా ఉంటుంది. నిన్ను వైజాగ్ పంపించలేదు అనేసి వారిపై నిందలు వేస్తున్నారు కదా అని అంటుంది.
Recommended Video
వెన్నెల చేతికి టికెట్లు
తను చెప్పేది నిజమే అంటూ మల్లిక మరొకసారి వివరణ ఇస్తుంది. మీకు నిజం తెలియాలి అంటే ఒకసారి రామచంద్ర మల్లికా దగ్గర ఉన్న టికెట్లను చూడాలి అని అప్పుడే అర్థం అవుతుంది అని మల్లిక చెబుతుంది. దీంతో జ్ఞానాంబ కొంత ఆలోచించి ఎలాంటి అనుమానం రాకుండా రామచంద్ర వెళ్లేటప్పుడు వారి టికెట్లను అడుగుతుంది.
బస్సు ఏ సమయానికి ఉంది ఎప్పుడు వెళుతుంది అనే వివరాలు తెలుసుకోవాలని ఉంది అని చెబుతుంది. తన కూతురు వెన్నెల కు ఆ టిక్కెట్లను ఇచ్చి అందులో ఉన్న వివరాలను చెప్పాలని జ్ఞానాంబ అడుగుతుంది. మరి జానకి రామ చంద్ర ఇద్దరు కూడా హైదరాబాద్ వెళుతున్న విషయం జ్ఞానాంబ తెలుసుకుంటుందా లేదా అనే విషయం తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.