Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Janaki Kalaganaledu May 4th: మల్లిక అబద్ధంతో గొడవలు.. బాధలో రామచంద్ర.. కోపంలో జ్ఞానాంబ!
జానకి కలగనలేదు సీరియల్ స్టోరీ పాయింట్ జనాలను రోజురోజుకు మరింత ఎక్కువగా ఆకట్టుకుంటోంది. సీనియర్ నటి రాశి.. జ్ఞానాంబ అనే అత్త పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఐపీఎస్ కావాలని ఆమె కోడలు జానకి చేస్తున్న ప్రయత్నాలు ఆమెకు భర్త చేసే సహాయం హైలెట్ గా నిలుస్తోంది. అయితే జానకి చదువుకోవడం ఆమె అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. మరి ఈ క్లిష్ట పరిస్థితులలో జానకి తన ఐపీఎస్ కలను ఎలా నెరవేర్చుకుంది అనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 293 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
జానకి కోసం
జానకి అన్నయ్య యోగి బాబు కారణంగా తన తల్లికి అవమానం జరిగింది అని రామచంద్ర ఎంతో ఆవేదనతో ఉంటాడు. అయితే ఆ తరువాత కోపాలను మర్చిపోయి అందరు సంతోషంగా ఉండాలని మళ్ళీ కలవాలని యోగి భార్య ఊర్మిల చెబుతుంది. ఇక వారి కొడుకు బారసాల కి కూడా జ్ఞానం కుటుంబాన్ని ప్రత్యేకంగా పిలవాలని అనుకుంటుంది. మొదట యోగి ఒప్పుకోకపోయినా ఆ తర్వాత జానకి గురించి ఆలోచించి మనం వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఊర్మిల చెప్పడంతో యోగి సరే అని అంటాడు
ఓర్చుకోలేక పోయిన మల్లిక
ఇక
ఊర్మిళ
గురించి
వారి
కొడుకు
గురించి
ఆలోచించే
బారసాల
వేడుకకు
జ్ఞానాంబ
కుటుంబం
రావడానికి
ఒప్పుకుంటుంది.
అయితే
వచ్చిన
తర్వాత
అక్కడ
ఊహించని
పరిణామాలు
ఎదురవుతాయి.
మొదట
అందరూ
సంతోషంగానే
ఉన్నప్పటికీ
జానకి
తోడికోడలు
మల్లిక
ఏ
మాత్రం
ఓర్చుకోలేక
పోతుంది.
వెంటనే
జానకి
పై
మళ్లీ
ఏదో
ఒక
నింద
వేయాలి
అని
ఆలోచిస్తుంది.
అయితే
ఈ
క్రమంలో
బారసాల
జరుగుతున్నప్పుడు
యోగి
స్నేహితుడు
లాయర్
కూడా
అక్కడికి
వస్తాడు.
అది
చూసిన
మల్లిక
వెంటనే
ఈ
విషయంతో
ఏదైనా
గొడవ
సృష్టించవచ్చు
అని
ఆలోచిస్తుంది.
రామచంద్రకు అవమానం
మీకు జానకికి మళ్ళీ విడాకులు ఇప్పించాలి అని మాట్లాడేందుకు లాయర్ని పిలిపించినట్లుగా మల్లిక రామచంద్ర తో చెబుతుంది. అతని మనసులో అనుమానం కలిగేలా చేస్తుంది. ఇక రామచంద్ర కూడా అది నిజం అనుకొని వెంటనే యోగినీ గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తాడు. కానీ యోగి అలా కాకుండా అప్పుడు పరిస్థితులు వేరు అని.. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు అని ఎంత చెప్పినప్పటికీ కూడా రామచంద్ర వినిపించుకోరు. ఇక సహనం కోల్పోయిన యోగి అవును ముందు విడాకులు ఇప్పించాలన్నమాట నిజమే అని ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉన్నాను అని.. చదువులేని నీకు జానకి ఇచ్చి పెళ్లి చేయడమే నేను చేసిన పెద్ద తప్పు అని నిందిస్తాడు.
భర్తపై జానకి ప్రేమ
స్వీట్లు చేసుకుంటూ ఉండే నువ్వు ఎక్కడ.. డిగ్రీ చదువుకున్న నా చెల్లి ఎక్కడ.. అలాగే నా చెల్లి మరొక ఏడాది చదివితే ఐపీఎస్ అవుతుంది కానీ నువ్వు కష్టపడితే ఈ స్వీట్ షాప్ నుంచి మరో స్థాయికి వెళ్ళగలవా అని యోగి నిందలు వేయడంతో రామచంద్ర ఒక్కసారిగా కుంగిపోతాడు ఏమీ మాట్లాడలేక జరిగిన అవమానంతో మౌనంగా ఉంటాడు ఇక అదే సమయంలో జానకి యోగి చెంప పగలగొడుతుంది. నా భర్తను ఏమైనా ఉంటే ఊరుకోను అంటూ నాకు ఆయన దేవుడు అని అంటుంది. ఆ తరువాత రామచంద్ర అక్కడి నుంచి మెల్లగా వెళ్ళి పోతాడు.
జ్ఞానాంబ ఆవేదన
జరిగిన విషయాన్ని తలుచుకుంటూ రామచంద్ర ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ క్రమంలో తల్లి జ్ఞానం కూడా మనోవేదన చెందుతుంది. తన కారణంగానే రామచంద్ర చదువుకు దూరం అయ్యాడు అని కుటుంబం కోసం తన బాల్యం మొత్తం త్యాగం చేశాడు అని ఆవేదన చెందుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన జానకి ఇందులో నా తప్పు కూడా ఉంది అని అందుకు క్షమించాలి అని అత్తగారి అడుగుతుంది. కానీ జ్ఞానాంబ మాత్రం జానకి పై చాలా కోపం గానే ఉంటుంది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు నిన్ను రామచంద్రకు ఇచ్చి పెళ్లి చేశారు. నా జీవితంలో ఏదైతే జరగకూడదని అనుకున్నానో ఈ రోజు అదే జరిగింది. చదువుకోలేని అమ్మాయితోనే పెళ్లి చేయాలి అని అనుకున్నాను. కానీ నువ్వు చదువుకున్న విషయాన్ని దాచి పెట్టి పెళ్లి చేశారు. నువ్వు నా కొడుకు జీవితంలోకి రాకపోయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని జ్ఞానం చెబుతుంది.
తండ్రితో రామచంద్ర
అత్త గారి మాటలకు మరింత బాధపడినా జానకి భర్తను కూడా ఓదార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ రామచంద్ర జానకిపై కూడా పెద్దగా ఎలాంటి ఆలోచన లేకుండా ఉంటాడు. మీ అన్నయ్య చేసిన తప్పు కి మీరు అనవసరంగా బాధపడకండి అంటూ ఆమెకు భరోసా ఇస్తాడు. ఇక ఆ తర్వాత రామచంద్ర నాన్న గోవింద రాజులు కూడా మనోవేదనకు గురి అవుతాడు. నిన్ను చదివించి ఉంటే ఈరోజు నీకు ఈ అవమానం జరిగేది కాదు అని అంటాడు. అందుకు రామచంద్రరావు మీరు బాధపడకండి అని మీ చిన్నతనంలో ఆరోగ్యం బాగోలేకపోతే మీరు ఏమి చేస్తారు అని అయినా నేను ఈ విషయంలో బాధపడడం లేదు అని నా తండ్రికి నేను రుణం తీర్చుకునే అవకాశం గా ఫీల్ అయ్యాను అని చెబుతాడు.
జానకిపై అబద్ధాలు
ఇక
ఆ
తర్వాత
జానకి
ఇంట్లో
పనులు
చేయడానికి
సిద్ధమవుతుండగా
మల్లిక
పనిగట్టుకుని
మరొక
వివాదాన్ని
సృష్టించడానికి
ప్రయత్నం
చేస్తుంది.
నువ్వు
ఇంట్లో
ఏ
పని
చేయకూడదు
అని
అత్తగారు
ఆర్డర్
వేసిన
విషయం
మర్చిపోయావా
అని
చెబుతుంది.
ఇక
జానకి
నేను
అత్తగారి
దగ్గర
క్షమాపణలు
కోరి
మళ్లీ
పనులు
చేస్తాను
అని
అంటుంది.
ఇక
అప్పుడే
జ్ఞానాంబ
రావడంతో
మల్లిక
జానకిపై
అబద్ధాలు
చెబుతుంది.
పనులు
చేయవద్దని
అంటే
అత్త
గారు
బాహుబలిలో
శివగామి
దేవి
ఏమీ
కాదు
ఆమె
చెప్పిన
మాట
వినడానికి..
అని
జానకి
చెప్పినట్లుగా
మల్లిక
అబద్ధాలు
చెబుతుంది.
దాంతో
జ్ఞానాంబ
మరింత
కోపంతో
ఉంటుంది.
నా
కొడుకు
కోసం
మాత్రమే
నిన్ను
ఇంట్లో
ఉండనిస్తున్నాను
అంటూ
ఇంట్లో
ఏ
పని
ముట్టుకోవద్దు
అని
జ్ఞానాంబ
మరింత
నిప్పులు
కురిపిస్తుంది.
ఇక
ఆ
విషయం
తెలియని
రామచంద్ర
తల్లి
తన
భార్యతో
ప్రేమగానే
ఉంటున్నట్లు
అనుకుంటాడు.
మరి
ఈ
పరిస్థితుల
నడుమ
జానకి
చదువు
ఎలా
సాగుతుందో
చూడాలి.