Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Janaki Kalaganaledu November 23rd: అందుకే నా ఐపీఎస్ డ్రీమ్ వదిలేసుకున్నా.. భర్తకు షాక్ ఇచ్చిన జానకి
జానకి కలగనలేదు సీరియల్ ఊహించని కథనంలోకి వెలుతోంది. జానకి చిన్న మరిది తన స్నేహితురాలు మాధురి పై హత్యాయత్నం చేస్తాడు. రక్తపు మడుగులో ఉన్న మాధురిని అనుకోకుండా చూసిన జానకి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. ఇక ఆ ఘటన జానకి ఐపీఎస్ చదువుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 438 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
అఖిల్ కేసు వెనక్కి తీసుకున్న జానకి
రామచంద్ర తమ్ముడు అఖిల్ తన స్నేహితురాలు మాధవి పై అత్యాయత్నం చేయడంతో ఆ ఘటనను జానకి చూస్తుంది. అయితే అఖిల్ పై వెంటనే ఆమె పోలీస్ కేసు కూడా నమోదు చేస్తుంది. ఇక జానకి అసలు ఇలా ఎందుకు చేసింది అనే విషయంపై పూర్తిగా ఆలోచించకుండా కుటుంబ సభ్యులు వెంటనే ఆ కేసును వెనక్కి తీసుకోవాలని అంటారు. ముఖ్యంగా రామచంద్ర జానకి చెప్పిన విషయాలను ఏ మాత్రం పట్టించుకోరు. మీరు అఖిల్ విషయంలో పొరపాటు పడుతున్నారు అని అతను అలాంటి తప్పులు చేయడు అని రామచంద్ర చెబుతాడు. ఇక జానకి ఏమి చేయలేని పరిస్థితులలో.. కుటుంబం కావాలా ఐపీఎస్ డ్రీం కావాలా అని ఆలోచించుకున్నప్పుడు కుటుంబమే కావాలి అని అనుకుంటుంది. అందుకే అఖిల్ మీద ఉన్న కేసును వెనక్కి తీసుకుంటుంది.
గుడిలో జానకి వదిన
ఒక నేరస్తుడికి శిక్ష పడకుండా చేసినందుకు జానకి చాలా బాధపడుతుంది. అందుకే ఆమె తన ఐపిఎస్ చదువును కొనసాగించలేను అని ఆ చదువు విషయంలో కూడా ఆమె వెనుకడుగు వేస్తుంది. ఇక చదువుకోకూడదు అని తన తండ్రి కలను నెరవేర్చకుండానే ఉండిపోతున్నందుకు ఎంతగానో బాధపడుతుంది. ఇక గుడికి వెళ్లి తన బాధను చెప్పుకుంటూ దేవుడిని ప్రార్దిస్తుంది. ఇక అప్పుడే జానకి వదిన తన కొడుకుతో అక్కడికి వస్తుంది. అయితే జానకి బాధపడుతున్న విధానాన్ని చూసి జానకి వదిన ఏం జరిగిందో అని అనుమానిస్తుంది. కానీ జానకి మాత్రం ఆ విషయాలు ఏమీ చెప్పకుండా ఉంటుంది అంతేకాకుండా జానకి వదిన నువ్వు కావాలనుకున్న ఐపీఎస్ డ్రీమ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని మరోసారి చెబుతోంది. కానీ జానకి ఆ విషయంలో పెద్దగా వివరణ ఇవ్వకుండా తన అన్నయ్యను కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
చదువు కంటే మీరే ఎక్కువ
ఇక జానకి అసలు ఎందుకు తను చదువు విషయాన్ని పక్కన పెట్టింది అని మరోవైపు రామచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జానకి గుడి నుంచి ఇంటికి రాగానే అసలు విషయం అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు. అయితే జానకిని ప్రశ్నించగానే ఆమె అసలు విషయం చెబుతుంది. మీరు కుటుంబం కావాలా చదువు కావాలా అని అడిగినప్పుడు నేను ఎంత బాధ పడ్డానో తెలుసా అని అంటుంది. అలాగే నాకు చదువు కంటే మీరు అలాగే కుటుంబం మాత్రమే ఎక్కువ. అందుకే నా చదువుని వదిలేసుకున్నాను అని చెబుతుంది.
అందుకే చదువును వదిలేసాను
నేను అఖిల్ విషయంలో మీకంటే ఎక్కువగా ఒక తల్లిగా ఆలోచించాను. అతను తప్పు చేశాడు అని నేను ఎంత చెప్పినా కూడా మీరు ఎవరూ కూడా నన్ను నమ్మలేదు. అంతేకాకుండా కుటుంబం కావాలా చదువుకావాలా అని అడిగినప్పుడు నేను నా నిర్ణయం తీసేసుకున్నాను అని అందుకే చదువును వదిలేసాను అని జానకి చెబుతుంది. ఆమె మాటలకు రామచంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. నేను ఏదో తమ్ముడిని కాపాడుకోవడం కోసం తొందరపాటులో ఆ మాట అన్నాను. మీరు ఆ మాటలను పట్టించుకోని ఇప్పుడు మీరు చిన్నప్పటినుంచి కలలు కన్నా ఐపిఎస్ డ్రీమ్ ను ఎలా వదిలేస్తారు అని అంటాడు. కానీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని జానకి చాలా తేలిగ్గా చెప్పేస్తుంది.
తప్పును సరిదిద్దుకోవాలని
ఆ తర్వాత ఆమె ఇంట్లో వాళ్లందరితోను అన్యోన్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక అందరూ భోజనం చేస్తుంటే రామచంద్ర కూడా అక్కడికి వెళ్లి కూర్చుంటాడు. కానీ భోజనం చేయడు. ఇక గోవిందరాజులు అతనికి అన్నం తినిపించమని జానకికి చెబుతాడు. ఇక జానకి ఇంత ప్రశాంతంగా ఎలా ఉందా అని రామ అనుకుంటాడు. అంతేకాకుండా ఎలాగైనా తన తప్పును సరిదిద్దుకోవాలని కూడా రామచంద్ర అనుకుంటాడు.
నిర్ణయం మార్చుకున్న రామ
ఇక మరోవైపు అఖిల్ తన మంచితనంతో ఇంట్లో నటిస్తూనే ఉంటాడు. ఇంట్లో కొన్ని రోజులుగా పరిస్థితులు బాగోలేకపోవడంతో మీరిద్దరూ అసలు సంతోషంగా లేరు అని అందుకే నీ భార్యని తీసుకొని మీ అత్తగారింటికి వెళ్లి రా అని జ్ఞానాంబ అఖిల్ కు డబ్బులు ఇస్తుంది. అయితే అక్కడ మంచి మార్కులు కొట్టేయాలి అని అఖిల్ డబ్బులు వద్దని నేను నా కెరీర్ పై ఫోకస్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. అంతే కాకుండా ఒక కోర్స్ నేర్చుకుంటుంన్నట్లు చెబుతూ అది పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని కూడా అంటాడు. ఇక అఖిల్ పూర్తిగా మారిపోయాడు అని ఇంట్లో వాళ్ళందరు మరోసారి నమ్ముతారు. ఇక మరోవైపు రామ తన తప్పును సరిదిద్దుకోవాలి అని జానకి మళ్ళీ తన చదువును కొనసాగించేలా చేయాలని అనుకుంటాడు. మరి ఆ విషయంలో అతను ఏ విధంగా ఆలోచిస్తాడో చూడాలి.