Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Janaki Kalaganaledu October 22nd: జ్ఞానాంబ ఇచ్చిన మరొక కొత్త షాక్.. విడాకులకు సిద్దమైన జానకి!
జానకి కలగనలేదు సీరియల్ ప్రతిరోజూ అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కొనసాగుతున్న జానకి కథ అన్ని వర్గాల వారికి కనెక్ట్ అవుతోంది. ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలని కలలు కనే ఒక కోడలు అత్తగారిని ఎలా దాటుకుంటూ వచ్చింది అనేది అసలు పాయింట్. భర్త సహకారంతో ముందుకు సాగుతూ ఉండగా జ్ఞానాంబకు అసలు నిజం తెలుస్తుంది. 39వ వారంలో ఈ సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకుంది.. 40వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది.
ఇక రూరల్ లో మాత్రం 38వ వారంలో 8.07 రేటింగ్ రాగా 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. అత్తగారి బాధ వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందని తెలుసుకున్న జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. జానకి అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందనే పాయింట్ కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఇక ఇప్పటి నుంచి మరొక ఆసక్తికరమైన అంశంతో సీరియల్ కొనసాగనుంది. జానకిని బయటకు పంపించాలని అనుకున్న మల్లికకు మరొక షాక్ తగులుతుంది. నేడు ప్రసారం కాబోయే 155వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అబద్ధంతో పెళ్లి చేసిన జానకి అన్నయ్య
జానకి తన చదువు కోసం అత్తగారింట్లో అన్నయ్య చెప్పిన అబద్ధాలు కొనసాగిస్తూ ఉండడం వలన జ్ఞానాంబకు అది ఏ మాత్రం నచ్చదు. జానకి అన్నయ్య తన చెల్లి ఏమాత్రం చదువుకోలేదని కేవలం ఐదవ తరగతి మాత్రమే చదువుకుంది అని అబద్ధం చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు.
అయితే చదువు కోలేని కొడుకు కోసం ఎక్కువ చదువుకున్న అమ్మాయి వస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆలోచించిన జ్ఞానాంబ జానకితో పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ చివరికి ఆమె చదివింది ఐదో తరగతి మాత్రమే కాదు డిగ్రీ పూర్తిచేసినట్లు తెలియగానే జ్ఞానాంబ ఒక్క సారిగా షాక్ అవుతుంది. అందరూ కలిసి మోసం చేశారని ఆమె బాధపడుతుంది.
మరో నిజాన్ని చెప్పిన రామచంద్ర
జానకి విషయంలో జ్ఞానాంబ ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆమెను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించాలని అని కూడా అనుకుంటుంది. అయితే అదే సమయంలో జానకి భర్త రామచంద్ర తల్లికి మరొక నిజాన్ని చెబుతాడు అసలు జానకి చదువుకున్న విషయాన్ని మీతో ఎప్పుడూ చెప్పాలని అనుకున్నారని, కానీ అలా చెబితే నా మీద ఒట్టు వేయించుకున్నాను అని తల్లికి రామచంద్ర మరొక నిజాన్ని చెబుతాడు.
రామచంద్ర చివరికి భార్యకు మద్దతుగా మాట్లాడతాడు. ఇక జ్ఞానాంబ కొడుకు చెప్పిన మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన వెనకాల ఇంత మోసం జరుగుతుందా అని ఆశ్చర్యపోవడమే కాకుండా మనోవేదనకు గురవుతుంది.
కొడుకు చేసిన మోసం
అంటే జానకి చదువు విషయంలో కొడుకు కూడా అబద్ధం తనను మోసం చేసినట్లు రాసి ఎంతగానో ఆవేదన చెందుతుంది. గతంలో చదువుకున్న అమ్మాయి కారణంగా తన తమ్ముడి జీవితం మంటల్లో బూడిదైన విషయాన్ని జ్ఞానాంబ గుర్తు చేసుకుంటుంది. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేయడం వలన ఆమె అతి తెలివి వలన తమ్ముడు చనిపోయిన విషయాన్ని అందరికీ చాలా క్లారిటీగా చెబుతుంది.
ఇక మళ్లీ అదే తప్పు కొడుకు విషయంలో జరగకూడదు అని జ్ఞానాంబ వివరణ ఇస్తుంది. ఆ విషయంలో నేను ఎప్పటికి తప్పు చేయను అని జానకి చెప్పినప్పటికీ కూడా జ్ఞానాంబ ఏమాత్రం నమ్మదు. భవిష్యత్తులో మనుషులు మారతారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.
భార్య కోసం తల్లికి అబద్ధం
ఇక జానకి ఈ విషయంలో కొడుకు చెప్పిన అబద్దంపై కూడా తీవ్ర ఆవేదనకు గురవుతుంది. ఇన్నేళ్ల జీవితంలో నాతో ఎప్పుడు అబద్ధం చెప్పని నా కొడుకు తన భార్య కోసం అబద్ధం చెప్పడం ఏమాత్రం నచ్చలేదు అంటూ అందరికీ ఒక షాక్ ఇస్తుంది.
ఇక జీవితంలో మళ్ళీ మరొకసారి రామచంద్ర తనని అమ్మ అని పిలువకూడదా అనే జ్ఞానాంబ తన పై ఒట్టు వేసుకుంటుంది. మళ్లీ ఇంకో సారి తనతో మాట్లాడితే చచ్చినంత ఒట్టు అని చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయాతాడు. తల్లి వేసిన శిక్ష కు అతను ఎంతగానో మనోవేదనకు గురవుతారు.
Recommended Video
విడాకుల కోసం వెళ్లిన జానకి
దీంతో జానకి తన భర్తకు వేసిన శిక్ష పై జ్ఞానాంబ బ్రతిమాలు క్షమర్శించమని అంటుంది. ఆయన ఊపిరి పీల్చుకోకుండా ఉంటారేమో గానీ అమ్మ అనే పదం అనకుండా ఉండలేరు అని జ్ఞానాంబ ఎంతగానో బాదాపడుతుంది. మీరు నా కారణంగా రామచంద్ర గారికి శిక్ష వేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటూ జానకి అత్తను ప్రశ్నిస్తుంది. ఆమె ఎంత బతిమాలినా కూడా జ్ఞానాంబ మాట్లాడేందుకు ఒప్పుకోదు.
అందరూ బయటకు వెళ్లిపోవాలని ఒక గదిలోకి వెళ్లిపోతుంది. ఇక జానకి ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక కఠిన నిర్ణయం తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోంది.
తన భర్తతో విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది. ఎలాగైనా మళ్లీ రామచంద్ర ఇద్దరు కూడా తల్లి కొడుకులుగా మంచిగా మాట్లాడుకోవాలని జానకి ఆలోచిస్తుంది. ఇక జానకి విడాకుల విషయం గురించి అందరికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.