Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Janaki Kalaganaledu September 27th: మల్లిక వలన జెస్సి పొరపాటు.. పూజలో తప్పు జరిగేలా ప్లాన్!
జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథాంశంతో మరో మలుపు తిరిగింది. రామచంద్ర సహకారంతోనే, భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు ఆమె అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి మరిది అఖిల్ మరో అమ్మాయిని ప్రేమించి గర్భం వచ్చేలా చేస్తాడు.
ఇక ఆ అమ్మాయికి న్యాయం చేయాలని జానకి ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 396 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
జెస్సి పై కోపం
ఉన్నత చదువులు చదివి కుటుంబ పరువు నిలబెడతాడు అని గొప్ప స్థాయికి చేరుకుంటాడు అని చిన్న కొడుకు అఖిల్ మీద జ్ఞానాంబ నమ్మకం పెట్టుకుంటుంది. కానీ అతను మాత్రం జెస్సి అనే అమ్మాయిని ప్రేమించి ఆమెకు గర్భం వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెబుతాడు.
ఈ క్రమంలో జానకి ఎంత చెప్పినా కూడా మొదట నమ్మని జ్ఞానాంబ ఆ తర్వాత నిజం తెలుసుకొని అఖిల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక జానకి సలహాతో వారిద్దరికీ పెళ్లి కూడా చేస్తుంది. అయితే వారిద్దరూ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా జ్ఞానాంబ మాట్లాడకుండా ఉంటుంది. జెస్సి పై నిత్యం కోపంతోనే కనిపిస్తూ ఉంటుంది.
ప్రత్యేకంగా పూజ
ఇక జానకి ఇంట్లో ఉండ్రాళ్ల తద్ది అనే పూజ చేయించాలి అని ఈ వేడుకను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అత్తని అడుగుతుంది. అందుకు మొదట జ్ఞానాంబ ఒప్పుకోకపోయినప్పటికి ఆ తర్వాత ఇంట్లో అందరూ చెప్పడంతో ఒప్పుకుంటుంది. ప్రత్యేకంగా గోరింటాకు సిద్ధం చేస్తూ ఉండగా జానకి దగ్గరకు జెస్సి వస్తుంది. పండగ విశేషాలను కూడా అడిగి తెలుసుకుంటుంది. ఈ పూజలో తాను కూడా పాల్గొంటాను అని జెస్సి చెప్పడంతో ఇది మీకోసమే ప్రత్యేకంగా చేస్తున్నట్లుగా జానకి చెబుతుంది. అందుకు అత్తగారు కూడా ఒప్పుకున్నట్లు చెప్పడంతో జెస్సి కొంత సంతోషిస్తుంది.
జెస్సి సహాయం
ఇక పండగ గురించి ప్రత్యేకంగా జానకి వివరించిన తర్వాత అందుకు తగ్గట్టుగా జెస్సి ఈ పూజలో తను కూడా సహాయం చేయాలని అనుకుంటుంది. ఇక పూజ కోసం వంటకాలు సిద్ధం చేయాలని కూడా జానకి అనుకోవడంతో అప్పుడు జెస్సి కూడా వచ్చి నేను కూడా ఈ వంటకాలు తయారు చేస్తాను అని చెబుతుంది. అయితే మధ్యలో మల్లిక మాత్రం ఏదో ఒక తరహాలో ఈ వంటకంలో తప్పుచేసి జానకిపై నింద వేయాలి అని అనుకుంటుంది.
పొరపాటు చేయడంతో..
అయితే అక్కడ ఉండ్రాళ్లు చేసే క్రమంలో రవ్వకు బదులు ఉప్పు పక్కన పెడుతుంది. ఇక జెస్సి ఆ పిండిలో రవ్వకు బదులు ఉప్పు వేస్తూ ఉండగా అప్పుడే జ్ఞానాంబ చూస్తుంది. వెంటనే జానకి అని గట్టిగా అరుస్తుంది. ఇలాంటి తప్పులు జరగకుండా ముందే చూసుకోమని చెప్పాను కదా అంటూ నేను చూడడం కొంచెం ఆలస్యమై ఉంటే ఈ నైవేద్యం అమ్మవారికి పెడితే ఎంత అరిష్టమో తెలుసా అని కూడా ఉంటుంది. ఇక అలాంటి తప్పు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను అని జానకి చెబుతుంది.
గోవిందరాజులు సెటైర్లు
ఆ తర్వాత జెస్సి జానకికి క్షమాపణలు చెబుతుంది. నేను టెన్షన్ లో చూసుకోలేదు అని అత్తయ్య గారిని చూసిన తర్వాత చాలా భయం వేసింది అని కూడా అంటుంది. అలా భయపడొద్దు అని జానకి ధైర్యం చెపుతుంది. ఇక తర్వాత ఇంట్లో అందరూ కూడా పూజ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అదే గ్రామంలో మల్లిక మాత్రం వివిధ రకాల పండ్లను తింటూ ఒక దగ్గర కూర్చుని ఉంటుంది.
దీంతో గోవిందరాజులు సెటైర్లు వేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మల్లికా అవేమీ పట్టించుకోదు. ఇక తర్వాత అఖిల్ కూడా అక్కడ పనిచేయాలని అనుకుంటాడు. ఇక రామచంద్రా అతనికి ఇంట్లోకి వెళ్లి ప్రసాదాలు తీసుకురావాలి అని చెబుతాడు.
పూజను చెడగొట్టాలని..
ఇక పూజ కోసం అన్ని ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడే లీలావతి కూడా అక్కడికి వస్తుంది. ముందుగానే లీలావతి చేత మల్లికా ఒక ప్లాన్ చేస్తుంది. ఈ పూజను ఎలాగైనా చెడగొట్టాలని జానకిని అత్తగారి చేత తిట్టించాలి అని అనుకుంటుంది. అందుకోసం ఆమె పూజలో చిన్నపాటి మంటలు వచ్చేలా ప్లాన్ వేస్తుంది. ఇక మరోవైపు పూజ జరుగుతున్న సమయంలో జెస్సి తడబడుతుంది. మొదట జెస్సిని చూసిన మహిళలు కొందరు ఆమె ఎవరు అని అడుగుతారు.
ఇక వారి ప్రశ్నలకు సమాధానం చెప్పక ముందే జానకి వాళ్ళందరినీ పూజకు సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత పూజ జరుగుతూ ఉండగా హఠాత్తుగా జాకెట్ ముక్కలపై మంట అంటుకుంటుంది. ఇక ఈ అపశకునం మనకు కూడా తగిలే అవకాశం ఉంటుంది అని లీలావతి తన మాటలతో బాధపెడుతుంది. తోటి మహిళలు వాయినాలు తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు. మరి ఈ పరిణామాలతో జ్ఞానాంబ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.